సంచలనం రేపిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారానికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. బాలీవుడ్లో ఓ వర్గం సుశాంత్ను అణగదొక్కేందుకు ప్రయత్నించిందని.. ఈ క్రమంలో అతను డిప్రెషన్కు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో పలువురు ప్రముఖులను పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పోలీసు విచారణకు హాజరయ్యాడు. బన్సాలీ.. సుశాంత్తో సినిమా చేసేందుకు ఒకట్రెండు సందర్భాల్లో ప్రయత్నించాడని.. ఓ సినిమా పట్టాలెక్కినట్లే ఎక్కి ఆగిపోయిందని మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బన్సాలీ అతణ్ని సినిమా నుంచి తప్పించాడేమో అన్న అనుమానంతో పోలీసులు ఆయన్ని విచారించారు.
ఐతే సుశాంత్ బిజీగా ఉండటం వల్లే తన సినిమాల్లో నటించలేకపోయాడని బన్సాలీ పోలీసులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. 2013లో బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ లీలా’ సినిమా కోసం చిత్రబృందం తొలుత సుశాంత్ను కలిసింది. కానీ తర్వాత ఆ చిత్రాన్ని రణ్వీర్ సింగ్తో తీశారు. అయితే తన సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని సుశాంత్ను కోరానని.. అయితే అప్పుడు బాగా బిజీగా ఉండటం వల్ల సుశాంత్ ఆఫర్ను వదులుకున్నాడని బన్సాలీ చెప్పినట్లు విచారణ అధికారి వెల్లడించారు. తర్వాత మరోసారి సుశాంత్ను సినిమా కోసం అడగలేదని.. అలా సుశాంత్కు అవకాశాన్ని ఇవ్వలేకపోయానని బన్సాలీ చెప్పుకొచ్చినట్లు సమాచారం. సుశాంత్ ఆత్మహత్య కేసులో న్సాలీని దాదాపు రెండు గంటలకుపైగా పోలీసులు విచారించగా.. సినిమాలు, ఇతర విషయాలకు సంబంధించి ఆయనకు 20 ప్రశ్నలు వేసినట్లు తెలిసింది.
This post was last modified on July 8, 2020 3:54 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…