ఇంకొక్క రోజులో థియేటర్లలోకి దిగబోతోంది విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఒకప్పుడు హీరోగా, విలన్గా వైభవం చూసిన ఆయన.. గత రెండు దశాబ్దాల్లో మార్కెట్ అంతా కోల్పోయారు. హీరోగా చేసిన సినిమాలన్నీ నిరాశ పరచడం.. తనకు తానుగా సినిమాలు బాగా తగ్గించేసుకోవడంతో క్రేజ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి.
చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘గాయత్రి’ మూవీ కనీస ప్రభావం కూడా చూపించలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మోహన్ బాబు. కానీ ఈ సినిమా పట్ల ఆడియన్స్లో కనీస ఆసక్తి కూడా కనిపించడం లేదు. ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజవుతుండగా.. సినిమా బుకింగ్స్ చూస్తే దయనీయంగా ఉన్నాయి. హైదరాబాద్లో దాదాపు 50 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుంటే.. విడుదలకు 24 గంటల ముందు రెండంకెల సంఖ్యలో టికెట్లు అమ్ముడైన థియేటర్ ఏదీ కనిపించడం లేదు.
చాలా థియేటర్లలో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా తెగని పరిస్థితి. థియేటర్ దగ్గర బుకింగ్ కోసం బ్లాక్ చేసిన కొన్ని వరుసల్లో మాత్రమే టికెట్లు అందుబాటులో లేవు. మిగతావన్నీ అందుబాటులో ఉండగా.. ఏవో కొన్ని థియేటర్లలో 2, 3, 4.. ఇలా కొన్ని టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్లో నంబర్ వన్ మల్టీప్లెక్స్ అనదగ్గ ఏఎంబీ సినిమాస్లో ఎలాంటి సినిమాకైనా ఓ మోస్తరుగా బుకింగ్స్ ఉంటాయి. చిత్రం ఏదన్నది సంబంధం లేకుండా ఇక్కడొచ్చి సినిమా చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు ప్రేక్షకులు.
అలాంటి థియేటర్లో కూడా పది టికెట్లయినా అమ్ముడవని పరిస్థితి నెలకొంది. మార్నింగ్ షోలకే పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా షోల గురించైతే చెప్పాల్సిన పని లేదు. బుకింగ్స్ పరిస్థితి ఇలా ఉంటే.. ట్విట్టర్లో ఏమో #SONOFINDIA హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. దాన్ని కూడా పాజిటివ్గా చూడటానికేమీ లేదు. ఈ హ్యాష్ ట్యాగ్ మీద ఉన్న కంటెంట్ అంతా ట్రోలింగే. ‘సన్ ఆఫ్ ఇండియా’ బుకింగ్స్ గురించి వస్తున్న వార్తల మీద రకరకాల జోకులు, మీమ్స్ తయారు చేసి మోహన్ బాబును, విష్ణును తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on February 19, 2022 3:47 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…