మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమాలను పట్టాలెక్కించాడు. వీటి తర్వాత బాబీతో చిరు తన 154వ సినిమాను చేయనున్నాడు. `మెగా 154` వర్కింగ్ టైటిల్తో గత ఏడాది గ్రాండ్గా ఈ మూవీ ప్రారంభమైంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా ఊరమాస్ గెటప్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ను ఫిక్స్ చేశారని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బాబీ ఈ సినిమా టైటిల్ను ఛేంజ్ చేశారట. వాల్తేరు వీరయ్య కాకుండా `వాల్తేరు మొనగాడు` అనే టైటిల్ ఇంకా బెటర్గా ఉందని బాబీ భావించారట. చిరంజీవికి సైతం ఆ టైటిల్ నచ్చడంతో.. `వాల్తేరు మొనగాడు`నే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు, త్వరలోనే ఈ కొత్త టైటిల్ను ఓ అదిరిపోయే పోస్టర్తో ప్రకటించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
కాగా, బాబీ చిత్రం తర్వాత చిరంజీవి వెంకీ కుడుముల డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. డివివి ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్పై సైతం ఇటీవలె అధికారిక ప్రకటన వచ్చింది.
This post was last modified on February 11, 2022 2:15 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…