మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమాలను పట్టాలెక్కించాడు. వీటి తర్వాత బాబీతో చిరు తన 154వ సినిమాను చేయనున్నాడు. `మెగా 154` వర్కింగ్ టైటిల్తో గత ఏడాది గ్రాండ్గా ఈ మూవీ ప్రారంభమైంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా ఊరమాస్ గెటప్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ను ఫిక్స్ చేశారని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బాబీ ఈ సినిమా టైటిల్ను ఛేంజ్ చేశారట. వాల్తేరు వీరయ్య కాకుండా `వాల్తేరు మొనగాడు` అనే టైటిల్ ఇంకా బెటర్గా ఉందని బాబీ భావించారట. చిరంజీవికి సైతం ఆ టైటిల్ నచ్చడంతో.. `వాల్తేరు మొనగాడు`నే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు, త్వరలోనే ఈ కొత్త టైటిల్ను ఓ అదిరిపోయే పోస్టర్తో ప్రకటించనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
కాగా, బాబీ చిత్రం తర్వాత చిరంజీవి వెంకీ కుడుముల డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. డివివి ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్పై సైతం ఇటీవలె అధికారిక ప్రకటన వచ్చింది.
This post was last modified on February 11, 2022 2:15 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…