మెగాస్టార్ మూవీ టైటిల్ మార్చేస్తున్న దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` చిత్రాన్ని పూర్తి చేసిన చిరంజీవి.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌`, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` సినిమాల‌ను ప‌ట్టాలెక్కించాడు. వీటి త‌ర్వాత బాబీతో చిరు త‌న 154వ సినిమాను చేయ‌నున్నాడు. `మెగా 154` వ‌ర్కింగ్ టైటిల్‌తో గత ఏడాది గ్రాండ్‌గా ఈ మూవీ ప్రారంభ‌మైంది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌బోతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా ఊర‌మాస్‌ గెటప్‌లో కనిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశార‌ని ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బాబీ ఈ సినిమా టైటిల్‌ను ఛేంజ్ చేశార‌ట‌. వాల్తేరు వీర‌య్య కాకుండా `వాల్తేరు మొనగాడు` అనే టైటిల్ ఇంకా బెట‌ర్‌గా ఉంద‌ని బాబీ భావించార‌ట‌. చిరంజీవికి సైతం ఆ టైటిల్ న‌చ్చ‌డంతో.. `వాల్తేరు మొనగాడు`నే ఫైన‌ల్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాదు, త్వ‌ర‌లోనే ఈ కొత్త టైటిల్‌ను ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించ‌నున్నార‌ని కూడా టాక్ న‌డుస్తోంది.

కాగా, బాబీ చిత్రం త‌ర్వాత చిరంజీవి వెంకీ కుడుముల డైరెక్ష‌న్‌లో ఓ మూవీ చేయ‌నున్నాడు. డివివి ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్ తో డివివి దాన‌య్య ఈ మూవీని నిర్మించ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై సైతం ఇటీవ‌లె అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

This post was last modified on February 11, 2022 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago