ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు బల్ల కింద చేతులు చాపడం సహజంగా మారిపోయింది. ఓ సర్వే అంచనా ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారిలో 65 శాతం మంది పైడబ్బులకోసం ఆశపడే ఉద్యోగాల వేట సాగిస్తున్నారని తేలింది. ఇది ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజం. ఇక, ఇంట్లోఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఉంటే.. వెంటనే ఆ కుటుంబం అంతా.. ఎంత సంపాయించావ్! అంటూ ప్రశ్నించడం కూడా మామూలైపోయింది.
భర్త సంపాయించే పైడబ్బులపై భార్య ఆశలు పెట్టుకోవడం సహజం. ఇక, భార్య-భర్త ఇద్దరూ ఉద్యోగస్తు లైతే.. కొందరు నిజాయితీగానే పనిచేస్తున్నా.. మరికొందరు మాత్రం తప్పుదోవలో ఆదాయాలు వెతుక్కుంటున్నారు. అయితే.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటి వరకు బట్టబయలు చేసిన సందర్భాలు లేవు. అంటే.. మా ఆయన లంచగొండి అని కానీ, నా భార్య లంచాలకు అలవాటు పడిందని కానీ.. చెప్పిన దంపతులు ఎవరూ కనిపించలేదు.
కానీ, ఇప్పుడు హైదరాబాద్లో వెలుగు చూసిన సంఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తున్నా.. భర్త నిజాయితీకి అచ్చరువొందుతున్నారు. మణికొండ మునిసిపాలిటీలో డీఈఈగా పనిచేస్తున్న దివ్యజ్యోతి అనే అధికారి లంచావతారాన్ని ఆమె భర్తే స్వయంగా మీడియాకు చెప్పేశారు. ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత.. కొన్నాళ్లు బాగానే పనిచేసినా.. తర్వాత లంచాల బాట పట్టిందని కట్టుకున్న భర్తే.. ఆధారాలతో సహా ఓ మీడియా సంస్థకు ఉప్పందించారు. అంతేకాదు.. ఆమె సొంత కప్ బోర్డులు, పిల్లో కవర్లు, పర్సులు, ఇలా ఎక్కడ చూసినా కనిపిస్తున్న నోట్ల కట్లను ఆయన వీడియో తీసి మరీ విడుదల చేశారు.
నా భార్యకు అనేక సార్లు చెప్పాను. లంచాలు తీసుకోవద్దు. నిజాయితీగా పనిచేయి. జీతం చాలు. అని చెప్పా. అయినా.. నామాట వినిపించుకోలేదు. ప్రతిరోజూ ఇంటి వస్తూనే కట్టలు తెస్తోంది. దీనిని చూసి నేను జీర్ణించుకోలేక పోయాను. అందుకే.. ఇప్పుడు వీడియోలు తీసి మీడియాకు అందిస్తున్నా. కనీసం ఇప్పటికైనా నా భార్య మారాలని కోరుకుంటున్నా అని సదరు భర్త తన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. ఈ వీడియో మీడియాలో ప్రసారం కావడంతో ఏసీబీ అధికారులు అలెర్ట్ అయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా కట్టుకున్న భార్య అవినీతిపై ఇలా భర్తే కుండబద్దలు కొట్టడం మాత్రం దేశచరిత్రలో ఇదే తొలిసారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on October 15, 2024 4:47 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…