భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాదు విలువలతో కూడిన వ్యక్తిత్వం.. వ్యాపారాన్ని పద్దతిగా నిర్వహించే రతన్ టాటా ఇప్పుడు గతమయ్యారు. తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడంతా ఆయనకు సంబంధించిన గురుతుల్ని తలుచుకుంటూ.. ఆయన వ్యక్తిత్వాన్ని అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు ఐబీఎస్ సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్. రతన్ టాటాతో తనకున్న మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా రతన్ టాటా గురించి.. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి ఎవరికి తెలీని ఆసక్తికర సంఘటల్ని షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. మానవత్వంతో పాటు హాస్య చతురతతో ఎవరైనా ఆయనతో ఇట్టే కనెక్ట్ అయిపోతారని చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరిచే టాలెంట్ ఆయన సొంతంగా అభివర్ణించారు.
ఆయనతో కలిసి కొంత కాలం పని చేసిన కారణంగా తనకు ఆయన గురించి.. ఆయన వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు తెలుసంటూ ఆసక్తికర అంశాల్ని చెబుతూ.. “అమెరికా పర్యటనలో ఆయనతో కొంత టైం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకెప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. ఓ రోజు న్యూయార్క్ లోని టాటా సొంత హోటల్లో మేం టిఫిన్ చేశాం. ఆ సందర్భంగా రతన్ టాటా తాను ఆ హోటల్ కు యజమాని అన్న దర్పాన్ని అస్సలు ప్రదర్శించలేదు. ఆ మాటకు వస్తే తాను ఎవరన్న విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పలేదు. ఆయన నిరాడంబరతకు ఇదో నిదర్శనం” అని మాథ్యూస్ పేర్కొన్నారు.
అదే రోజు తర్వాత తాను..తన కుటుంబం మరో రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంగా అక్కడ కూడా రతన్ టాటా కనిపించారన్న ఆయన.. “రతన్ టాటా తన బిల్లును తానే తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఆయన ఎంత సింఫుల్ గా ఉంటారో ఇది తెలియజేసింది. ఆయనలో హాస్యచతురత ఎక్కువ. తన ట్రేడ్ మార్క్ హాస్యాన్ని ఆయన ప్రదర్శిస్తుంటారు. హోటల్ లో మరోసారి కలిసిన సందర్భంగా.. నేను నిన్ను వెంటాడుతున్నానా? నువ్వు నన్ను వెంటాడుతున్నావా? అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతరులతో ఇట్టే కనెక్ట్ అయ్యే తత్వం ఆయన సొంతం” అని మాథ్యూస్ తన గురుతుల్ని షేర్ చేసుకున్నారు.
This post was last modified on October 12, 2024 11:34 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…