భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాదు విలువలతో కూడిన వ్యక్తిత్వం.. వ్యాపారాన్ని పద్దతిగా నిర్వహించే రతన్ టాటా ఇప్పుడు గతమయ్యారు. తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడంతా ఆయనకు సంబంధించిన గురుతుల్ని తలుచుకుంటూ.. ఆయన వ్యక్తిత్వాన్ని అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు ఐబీఎస్ సాఫ్ట్ వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్. రతన్ టాటాతో తనకున్న మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా రతన్ టాటా గురించి.. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి ఎవరికి తెలీని ఆసక్తికర సంఘటల్ని షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. మానవత్వంతో పాటు హాస్య చతురతతో ఎవరైనా ఆయనతో ఇట్టే కనెక్ట్ అయిపోతారని చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరిచే టాలెంట్ ఆయన సొంతంగా అభివర్ణించారు.
ఆయనతో కలిసి కొంత కాలం పని చేసిన కారణంగా తనకు ఆయన గురించి.. ఆయన వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు తెలుసంటూ ఆసక్తికర అంశాల్ని చెబుతూ.. “అమెరికా పర్యటనలో ఆయనతో కొంత టైం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకెప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. ఓ రోజు న్యూయార్క్ లోని టాటా సొంత హోటల్లో మేం టిఫిన్ చేశాం. ఆ సందర్భంగా రతన్ టాటా తాను ఆ హోటల్ కు యజమాని అన్న దర్పాన్ని అస్సలు ప్రదర్శించలేదు. ఆ మాటకు వస్తే తాను ఎవరన్న విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పలేదు. ఆయన నిరాడంబరతకు ఇదో నిదర్శనం” అని మాథ్యూస్ పేర్కొన్నారు.
అదే రోజు తర్వాత తాను..తన కుటుంబం మరో రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంగా అక్కడ కూడా రతన్ టాటా కనిపించారన్న ఆయన.. “రతన్ టాటా తన బిల్లును తానే తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఆయన ఎంత సింఫుల్ గా ఉంటారో ఇది తెలియజేసింది. ఆయనలో హాస్యచతురత ఎక్కువ. తన ట్రేడ్ మార్క్ హాస్యాన్ని ఆయన ప్రదర్శిస్తుంటారు. హోటల్ లో మరోసారి కలిసిన సందర్భంగా.. నేను నిన్ను వెంటాడుతున్నానా? నువ్వు నన్ను వెంటాడుతున్నావా? అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతరులతో ఇట్టే కనెక్ట్ అయ్యే తత్వం ఆయన సొంతం” అని మాథ్యూస్ తన గురుతుల్ని షేర్ చేసుకున్నారు.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…