దేశ పారిశ్రామిక దిగ్గజం.. రతన్ టాటా ఇకలేరు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ముంబైలోని ప్రముఖ ఆసుపత్రి బ్రీచ్ క్యాండీ లో ఆయన తుదిశ్వాస విడిచారు. జీవితాంతం బ్రహ్మచారిగా గడిపిన ఆయన తన పూర్తి సమయాన్ని టాటా వ్యాపార విస్తరణకు, అదేవిధంగా సమాజ సేవకు వినియోగించారు. 86 ఏళ్ల వయసులో టాటా కన్నుమూశారు. దేశానికి వ్యాపార పాఠాలు నేర్పిన టాటా కేవలం వ్యాపార లాభాలే చూసుకోలేదు. వ్యాపారంలోనూ మానవత్వాన్ని పరిమళించేలా చేసింది.
టాటా పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన జమ్ షెడ్ టాటా.. తర్వాత తరంలో ఆయన కుమారుడు జేఆర్ డీ టాటా వ్యాపారంలోకి వచ్చారు. వీరిద్దరి తర్వాత.. జమ్షెడ్ టాటా మునిమనవడైన రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు టాటా అంటే కేవలం కొన్నిరంగాలకే పరిమితమైంది. భారీ వాహనాల తయారీ, యుద్ధ విమానాలు.. ఇతరత్రా వరకు మాత్రమే పరిమితమైన టాటాను.. రతన్ టాటా భూమార్గం పట్టించారు. ప్రతి ఇంటికీ పరిచయం చేశారు. టాటా సాల్ట్ నుంచి నిత్యం తాగే టీ(టెట్లీ) వరకు అనేక రూపాల్లో సామాన్య ప్రజలకు చేరువయ్యారు.
అంతేకాదు.. టాటా ఆభరణాలు(తనిష్క్ పేరుతో) వ్యాపారం ప్రారంభించారు. దీంతో పాటు టైటాన్ పేరుతో వాచీలకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇలా.. రతన్ టాటా తనదైన శైలిలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1990లో టాటా గ్రూప్ సంస్థలకు చైర్మన్గా బాద్యతలు చేపట్టిన రతన్ టాటా.. 2012 వరకు అంటే.. 22 ఏళ్ల పాటు ఆ బాధ్యతల్లో ఉన్నారు. అనుక్షణం పనే అనే సూత్రాన్నినమ్మిన ఆయన.. ప్రతి కదలికలోనూ.. ఫలితాన్ని కోరుకున్నారు. అందుకే.. ఎన్నో సంస్థలు.. విదేశీ పోటీ ఉన్నా.. నేటికీ టాటా ఒక ప్రత్యేక బ్రాండు.. గుర్తింపుగా మిగిలిపోయింది.
జననం-మరణం..
This post was last modified on October 10, 2024 11:55 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…