రుద్రమదేవి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీసి మంచి ఫలితాన్నే అందుకున్నాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. కానీ దీని తర్వాత ఇదే తరహాలో ఆయన తీసిన శాకుంతలం మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీని మీద పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోయింది.
ఈ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు. దీంతో ఆయన కెరీర్లో కొంచెం గ్యాప్ వచ్చింది. అలా అని సినిమాలేమీ ఆపేయలేదు గుణ. ఈసారి ట్రెండుకు అనుగుణంగా సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఆ చిత్రమే.. యుఫోరియా.
గుణశేఖర్ లాంటి దర్శకుడు ఇలాంటి టైటిల్ పెట్టడమేంటి అని అంతా అనుకున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్ చూస్తే సరైన టైటిలే అనిపిస్తోంది. ఈ కాలానికి తగ్గట్లుగా డ్రగ్స్ వినియోగం, మహిళలపై లైంగిక దాడుల నేపథ్యంలో నడిచే సినిమా ఇది. గ్లింప్స్లో కూడా అన్నీ దీనికి సంబంధించిన విజువల్సే చూపించాడు గుణశేఖర్.
‘యుఫోరియా’ టీజర్ గ్లింప్స్ చూస్తే ట్రెండీ కాన్సెప్ట్తోనే తీసినట్లు అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాల గురించి.. మహిళలపై అత్యాచారాల గురించి ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. అనేక ఘోరమైన ఘటనల గురించి వార్తలు నిత్యకృత్యమైపోయాయి.
డ్రగ్స్ తీసుకుని అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోయాయి. గుణశేఖర్ ఈ నేపథ్యాన్నే ‘యుఫోరియా’ కోసం ఎంచుకున్నట్లున్నాడు. ఐతే కాన్సెప్ట్ ట్రెండీగా ఉన్నప్పటికీ టేకింగ్ రొటీన్గానే అనిపిస్తోంది. అంతే కాక అత్యాచార ఘటనలు, డ్రగ్స్ వినియోగం మీద కొన్ని సీన్లు చూసినా ఏదోలా అనిపిస్తుంది. ఒక రకమైన అలజడి రేగుతుంది.
కానీ ‘యుఫోరియా’ గ్లింప్స్ చూస్తే సినిమా మొత్తం ఈ అంశాల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది. అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. గ్లింప్స్ చూస్తే సినిమా అంతా చెడును చూపించి.. చివర్లో ఒక సందేశం ఇచ్చే సినిమాలా కనిపిస్తోంది. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో కొంచెం కష్టమైన కాన్సెప్ట్ ఎంచుకున్న గుణశేఖర్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి మరి.
This post was last modified on October 8, 2024 10:35 am
మొత్తానికి ఒడుదొడుకులను దాటి ‘దేవర’ సినిమా సక్సెస్ అనిపించుకున్నట్లే కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు…
‘అందాల రాక్షసి’తో మొదలుపెట్టి నటుడిగా చాలానే సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా మారి తీసిన ‘చి ల సౌ’…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల లిస్టు తీస్తే.. అందులో మలయాళ చిత్రం ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుంది. భాషా భేదం…
కొన్ని కొన్ని ఘటనలకు కార్యాకారణ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు.. అక్కడి తెలుగు దేశం పార్టీ పుంజుకోవడానికి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం 5 గంటల…
ఈ మధ్య వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు, దివ్వెల మాధురి అనే వివాహితకు మధ్య సంబంధం గురించి ఎంత రచ్చ…