రుద్రమదేవి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీసి మంచి ఫలితాన్నే అందుకున్నాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. కానీ దీని తర్వాత ఇదే తరహాలో ఆయన తీసిన శాకుంతలం మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీని మీద పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోయింది.
ఈ చిత్రానికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు. దీంతో ఆయన కెరీర్లో కొంచెం గ్యాప్ వచ్చింది. అలా అని సినిమాలేమీ ఆపేయలేదు గుణ. ఈసారి ట్రెండుకు అనుగుణంగా సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఆ చిత్రమే.. యుఫోరియా.
గుణశేఖర్ లాంటి దర్శకుడు ఇలాంటి టైటిల్ పెట్టడమేంటి అని అంతా అనుకున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ గ్లింప్స్ చూస్తే సరైన టైటిలే అనిపిస్తోంది. ఈ కాలానికి తగ్గట్లుగా డ్రగ్స్ వినియోగం, మహిళలపై లైంగిక దాడుల నేపథ్యంలో నడిచే సినిమా ఇది. గ్లింప్స్లో కూడా అన్నీ దీనికి సంబంధించిన విజువల్సే చూపించాడు గుణశేఖర్.
‘యుఫోరియా’ టీజర్ గ్లింప్స్ చూస్తే ట్రెండీ కాన్సెప్ట్తోనే తీసినట్లు అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాల గురించి.. మహిళలపై అత్యాచారాల గురించి ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. అనేక ఘోరమైన ఘటనల గురించి వార్తలు నిత్యకృత్యమైపోయాయి.
డ్రగ్స్ తీసుకుని అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోయాయి. గుణశేఖర్ ఈ నేపథ్యాన్నే ‘యుఫోరియా’ కోసం ఎంచుకున్నట్లున్నాడు. ఐతే కాన్సెప్ట్ ట్రెండీగా ఉన్నప్పటికీ టేకింగ్ రొటీన్గానే అనిపిస్తోంది. అంతే కాక అత్యాచార ఘటనలు, డ్రగ్స్ వినియోగం మీద కొన్ని సీన్లు చూసినా ఏదోలా అనిపిస్తుంది. ఒక రకమైన అలజడి రేగుతుంది.
కానీ ‘యుఫోరియా’ గ్లింప్స్ చూస్తే సినిమా మొత్తం ఈ అంశాల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది. అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. గ్లింప్స్ చూస్తే సినిమా అంతా చెడును చూపించి.. చివర్లో ఒక సందేశం ఇచ్చే సినిమాలా కనిపిస్తోంది. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో కొంచెం కష్టమైన కాన్సెప్ట్ ఎంచుకున్న గుణశేఖర్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి మరి.
This post was last modified on October 8, 2024 10:35 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…