ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ అధిపతి, సద్గురుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జగ్గీ వాసుదేవ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యవహార శైలిని మద్రాస్ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. మీ అమ్మాయికి పెళ్లి చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆమె తన జీవితంలో నిలదొక్కుకునేలా చేశారు. మరి ఇతరుల జీవితాల్లోనూ ఇలాంటి ఆశలే ఉంటాయి కదా. వారికి మాత్రం సంసారం, పిల్లలు, భర్త అవసరం ఉండదా? కానీ, మీరు మాత్రం ఇతర అమ్మాయిలను సన్యాసులుగా మారుస్తున్నారు. ఇదేం పద్ధతి అని కడిగిపారేసింది.
తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో ఏర్పాటు చేసుకున్న ఈశా ఫౌండేషన్ ద్వారా.. విదేశీ విరాళాలు సేకరించడంతో పాటు.. అక్కడే పలు విద్యాసంస్థలను, వైద్య శాలలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవేవీ ఉచితం కాదు. ఇదేసమయం లో జగ్గీవాసుదేవ్ ఏటా మహాశివరాత్రిని ఘనంగా చేపడతారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులను రప్పిస్తారు. ఇది కూడా ఉచితం కాదు. రూ. లక్ష ఎంట్రీ ఫీజుగా ఉంటుంది. దీనిని మూడు మాసాల ముందే బుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన వారిని ఆయన భక్తి మార్గంలో ముంచేస్తారు. ఇది మంచిదే. కానీ, ఆయన యువతులను వివాహం చేసుకోకుండా.. దేవుడికి అంకితం కావాలంటూ.. ప్రోత్సహిస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇదే వివాదం అయింది.
ఏం జరిగింది?
తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. కామరాజ్కు ఇద్దరు కుమార్తెలు. వీరు జగ్గీవాసు దేవ్ భక్తురాళ్లుగా మారిపోయారు. దీంతో తమ ఇంటిని కూడా వదిలేసి.. ఈశా ఫౌండేషన్లోనే ఉంటున్నారు. అయితే.. వీరిద్దరూ కూడా యుక్తవయసుకు రావడంతో కామరాజ్ తన కుమార్తెలకు వివాహం చేయాలని తలపోశారు. కానీ, ఈశా ఫౌండేషన్లో జగ్గీ వాసు దేవ్.. చేసిన బ్రెయిన్ వాష్తో ఆ ఇద్దరు యువతులు కూడా తాము పెళ్లి చేసుకునేది లేదని.. ఈశా ఫౌండేషన్కే తమ జీవితాలను అంకితం చేసి .. సన్యాసులుగా ఉండిపోతామని తెలిపారు.
దీంతో షాకైన కామరాజ్. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు.. సుబ్రమణియ న్, శివజ్ఞానం.. జగ్గీ వాస్దేవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుమార్తెకు వివాహం చేసి..సంసారం చేసుకునేలా ప్రోత్సహించిన మీరు.. ఇతర యువతులను ఇలా సన్యాసం దిశగా ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. ఇది సరైన విధానం కాదని ఏవగించుకున్నారు. ఇతర మహిళల సంసార జీవితాలను త్యజించమని ఎలా ప్రోత్సహిస్తారని నిప్పులు చెరిగారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
This post was last modified on October 2, 2024 12:12 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…