Trends

మీ అమ్మాయికి పెళ్లిచేసి.. ఇత‌ర అమ్మాయిల‌కు స‌న్యాసం ఇస్తారా?’

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేష‌న్ అధిప‌తి, స‌ద్గురుగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జ‌గ్గీ వాసుదేవ్ చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని మ‌ద్రాస్ హైకోర్టు తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది. మీ అమ్మాయికి పెళ్లి చేశారు. బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. ఆమె త‌న జీవితంలో నిల‌దొక్కుకునేలా చేశారు. మ‌రి ఇత‌రుల జీవితాల్లోనూ ఇలాంటి ఆశ‌లే ఉంటాయి క‌దా. వారికి మాత్రం సంసారం, పిల్లలు, భ‌ర్త అవ‌స‌రం ఉండదా? కానీ, మీరు మాత్రం ఇత‌ర అమ్మాయిల‌ను స‌న్యాసులుగా మారుస్తున్నారు. ఇదేం ప‌ద్ధ‌తి అని క‌డిగిపారేసింది.

త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు శివారులో ఏర్పాటు చేసుకున్న ఈశా ఫౌండేష‌న్ ద్వారా.. విదేశీ విరాళాలు సేక‌రించ‌డంతో పాటు.. అక్క‌డే ప‌లు విద్యాసంస్థ‌ల‌ను, వైద్య శాల‌ల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఇవేవీ ఉచితం కాదు. ఇదేస‌మ‌యం లో జ‌గ్గీవాసుదేవ్ ఏటా మ‌హాశివ‌రాత్రిని ఘ‌నంగా చేప‌డ‌తారు. ఎక్క‌డెక్క‌డి నుంచో భ‌క్తుల‌ను ర‌ప్పిస్తారు. ఇది కూడా ఉచితం కాదు. రూ. ల‌క్ష ఎంట్రీ ఫీజుగా ఉంటుంది. దీనిని మూడు మాసాల ముందే బుక్ చేసుకోవాలి. ఇలా వ‌చ్చిన వారిని ఆయ‌న భ‌క్తి మార్గంలో ముంచేస్తారు. ఇది మంచిదే. కానీ, ఆయ‌న యువ‌తుల‌ను వివాహం చేసుకోకుండా.. దేవుడికి అంకితం కావాలంటూ.. ప్రోత్స‌హిస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇదే వివాదం అయింది.

ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడు అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కె. కామ‌రాజ్‌కు ఇద్ద‌రు కుమార్తెలు. వీరు జ‌గ్గీవాసు దేవ్ భ‌క్తురాళ్లుగా మారిపోయారు. దీంతో త‌మ ఇంటిని కూడా వ‌దిలేసి.. ఈశా ఫౌండేష‌న్‌లోనే ఉంటున్నారు. అయితే.. వీరిద్ద‌రూ కూడా యుక్త‌వ‌య‌సుకు రావ‌డంతో కామ‌రాజ్ త‌న కుమార్తెల‌కు వివాహం చేయాల‌ని త‌ల‌పోశారు. కానీ, ఈశా ఫౌండేష‌న్‌లో జ‌గ్గీ వాసు దేవ్‌.. చేసిన బ్రెయిన్ వాష్‌తో ఆ ఇద్ద‌రు యువ‌తులు కూడా తాము పెళ్లి చేసుకునేది లేద‌ని.. ఈశా ఫౌండేష‌న్‌కే త‌మ జీవితాల‌ను అంకితం చేసి .. స‌న్యాసులుగా ఉండిపోతామ‌ని తెలిపారు.

దీంతో షాకైన కామ‌రాజ్. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తులు.. సుబ్ర‌మ‌ణియ న్‌, శివ‌జ్ఞానం.. జ‌గ్గీ వాస్‌దేవ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ కుమార్తెకు వివాహం చేసి..సంసారం చేసుకునేలా ప్రోత్స‌హించిన మీరు.. ఇత‌ర యువ‌తుల‌ను ఇలా స‌న్యాసం దిశ‌గా ఎలా న‌డిపిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇది స‌రైన విధానం కాద‌ని ఏవ‌గించుకున్నారు. ఇత‌ర మ‌హిళ‌ల సంసార జీవితాల‌ను త్య‌జించ‌మ‌ని ఎలా ప్రోత్స‌హిస్తార‌ని నిప్పులు చెరిగారు. దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది.

This post was last modified on October 2, 2024 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంకర్‌కు నష్టం.. నిర్మాతకు లాభం

ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్‌ల క్రేజీ…

2 hours ago

నా భ‌వ‌నాలైనా కూల్చేయండి: రేవంత్‌కు కేపీవీ ఆఫ‌ర్‌

కేవీపీ రామ‌చంద్ర‌రావు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని దాదాపు…

5 hours ago

ప్రభాస్ పుట్టినరోజుకి ఏం ఇవ్వబోతున్నారు

ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…

6 hours ago

నందిగం సురేష్‌కు బెయిల్‌.. ఎన్ని ష‌ర‌తులంటే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బాప‌ట్ల‌ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జైల్లో…

6 hours ago

తగ్గిపోతున్న OTT జోరు దేనికి సంకేతం

కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…

8 hours ago

జ‌న‌సేన రైటిస్టు పార్టీగా మారిందా?: ష‌ర్మిల

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

9 hours ago