ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ అధిపతి, సద్గురుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జగ్గీ వాసుదేవ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యవహార శైలిని మద్రాస్ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. మీ అమ్మాయికి పెళ్లి చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆమె తన జీవితంలో నిలదొక్కుకునేలా చేశారు. మరి ఇతరుల జీవితాల్లోనూ ఇలాంటి ఆశలే ఉంటాయి కదా. వారికి మాత్రం సంసారం, పిల్లలు, భర్త అవసరం ఉండదా? కానీ, మీరు మాత్రం ఇతర అమ్మాయిలను సన్యాసులుగా మారుస్తున్నారు. ఇదేం పద్ధతి అని కడిగిపారేసింది.
తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో ఏర్పాటు చేసుకున్న ఈశా ఫౌండేషన్ ద్వారా.. విదేశీ విరాళాలు సేకరించడంతో పాటు.. అక్కడే పలు విద్యాసంస్థలను, వైద్య శాలలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవేవీ ఉచితం కాదు. ఇదేసమయం లో జగ్గీవాసుదేవ్ ఏటా మహాశివరాత్రిని ఘనంగా చేపడతారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులను రప్పిస్తారు. ఇది కూడా ఉచితం కాదు. రూ. లక్ష ఎంట్రీ ఫీజుగా ఉంటుంది. దీనిని మూడు మాసాల ముందే బుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన వారిని ఆయన భక్తి మార్గంలో ముంచేస్తారు. ఇది మంచిదే. కానీ, ఆయన యువతులను వివాహం చేసుకోకుండా.. దేవుడికి అంకితం కావాలంటూ.. ప్రోత్సహిస్తున్నారు. బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇదే వివాదం అయింది.
ఏం జరిగింది?
తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. కామరాజ్కు ఇద్దరు కుమార్తెలు. వీరు జగ్గీవాసు దేవ్ భక్తురాళ్లుగా మారిపోయారు. దీంతో తమ ఇంటిని కూడా వదిలేసి.. ఈశా ఫౌండేషన్లోనే ఉంటున్నారు. అయితే.. వీరిద్దరూ కూడా యుక్తవయసుకు రావడంతో కామరాజ్ తన కుమార్తెలకు వివాహం చేయాలని తలపోశారు. కానీ, ఈశా ఫౌండేషన్లో జగ్గీ వాసు దేవ్.. చేసిన బ్రెయిన్ వాష్తో ఆ ఇద్దరు యువతులు కూడా తాము పెళ్లి చేసుకునేది లేదని.. ఈశా ఫౌండేషన్కే తమ జీవితాలను అంకితం చేసి .. సన్యాసులుగా ఉండిపోతామని తెలిపారు.
దీంతో షాకైన కామరాజ్. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు.. సుబ్రమణియ న్, శివజ్ఞానం.. జగ్గీ వాస్దేవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుమార్తెకు వివాహం చేసి..సంసారం చేసుకునేలా ప్రోత్సహించిన మీరు.. ఇతర యువతులను ఇలా సన్యాసం దిశగా ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. ఇది సరైన విధానం కాదని ఏవగించుకున్నారు. ఇతర మహిళల సంసార జీవితాలను త్యజించమని ఎలా ప్రోత్సహిస్తారని నిప్పులు చెరిగారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
దృశ్యం 3 థియేటర్లలో 200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకుల బుర్రలో…
‘గుంటూరు కారం’ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయాలనుకున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. తన కెరీర్లో తొలిసారిగా…
ఈ వారం విడుదల కాబోతున్న సింగ్ గీతం సినిమాకు టీమ్ చేస్తున్న ప్రమోషన్లు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 94 వయసులో…
సుప్రసిద్ధ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి బయోపిక్ తెరకెక్కించేందుకు గీత ఆర్ట్స్, బన్నీ వాస్ సంయక్తంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన హిట్ ఫ్రాంచైజ్ 'వెల్కమ్ టు ది జంగిల్' (వెల్కమ్ 3) కోసం…
పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు…