శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఒక అరాచక ఉదంతాన్ని నోటితో కూడా చెప్పలేనిది. ఎంత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం.. మరీ అంత దారుణానికి పాల్పడటమా? అన్నది ప్రశ్నగా మారింది.
ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకుందన్న కారణంగా.. ఆమెను ఆమె తల్లిదండ్రులే చంపేయటమేకాదు.. ఇంటికిసమీపంలో పూడ్చేసి మిస్సింగ్ కేసు పెట్టిన దారుణ ఉదంతం తాజాగా వెలుగు చూసింది.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభుని సత్రానికి చెందిన వెంకటరమణయ్య.. దేవసేనమ్మకు ఒకకొడుకు.. ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు 24 ఏళ్ల శ్రావణి. ఆరేళ్ల క్రితం పెళ్లి చేయగా.. భర్తతో విడిపోయారు. వీరికి ఊళ్లో కూరగాయల షాపు ఉండేది.
ఈ క్రమంలో ఆమెకు రబ్బానీ బాషాతో పరిచయమై.. ప్రేమగా మారింది. 20 రోజుల క్రితం కసుమూరు దర్గాలో వారు పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కూతుర్ని కొట్టి.. బలవంతంగాఇంటికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రావణిని తీవ్రంగా కొట్టటంతో గాయమై చనిపోయింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకుఇంటి పక్కనే ఉన్న స్థలంలో గుంత తీసి పూడ్చేశారు. పోలీసులకు ఫోన్ చేసి తమ కుమార్తె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. వారు ఉంటున్న ఇంటి పక్కన ప్రాంతంలో ఒక మహిళ డెడ్ బాడీని పూడ్చి పెట్టారంటూ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు డయల్ 100కు ఫోన్ చేశారు.
దీంతో స్పందించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద ప్రదేశంలో తవ్వగా.. శ్రావణి డెడ్ బాడీ కనిపించింది.
నమూనాలు తీసుకొని.. తిరిగి అక్కడే పూడ్చి పెట్టారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మిస్సింగ్ కేసును కాస్తా హత్య కేసుగా మార్చారు. ఈ ఉదంతం స్థానికంగానే కాదు జిల్లాలోనూ సంచలనంగా మారింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…