Trends

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కేజీ ఎంత?

పెను దుమారంగా మారిన తిరుమల లడ్డూ నాణ్యత అంశంపై బోలెడన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తానికి మూలం లడ్డూ నాణ్యత మీద ఉన్న అనుమానంతో..దానికి వినియోగించిన నెయ్యిని పరీక్షలకు పంపగా.. అందులో స్వచ్ఛమైన ఆవునెయ్యికి బదులుగా.. పందికొవ్వు.. గొడ్డు కొవ్వు ఉందన్న అనుమానాలు సంచంనలంగా మారాయి.

ఈ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వం తప్పు చేసిందని.. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవునెయ్యిని కేజీ రూ.320కు కొన్నట్లుగా ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన ఆవు నెయ్యి కేజీ రూ.వెయ్యికి పైనే ఉందని.. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచారన్నారు.

నిజానికి తిరుమలకు ఆవునెయ్యిని కర్ణాటక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని డెయిరీ గతంలోనెయ్యి సరఫరా చేసేది. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మార్చేశారు. కేజీ రూ.320చొప్పున కేజీ ఆవు నెయ్యిని సరఫరా చేస్తామని ముందుకు వచ్చిన వారికి కాంటాక్టులు కట్టబెట్టేశారని చెబుతున్నారు. లాభాల కోసమే ఈ తప్పుడు పనులు చేశారని మండిపడుతున్నారు.

అంతేకాదు.. తిరుమలకు లాభాలతో సంబంధం లేకున్నా.. నెయ్యిని సరఫరా చేస్తున్నా.. తమ ఆవునెయ్యిని ఎందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకోవటం లేదన్న అంశంపై కర్ణాటక అసెంబ్లీలోనూ చర్చ జరిగిన విషయాన్ని ఆనం పేర్కొన్నారు. కర్ణాక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ లంచాలు ఇవ్వరు కాబట్టే.. ఆ నెయ్యిని వాడకుండా నాణ్యత లేని నెయ్యిని కాంటాక్టు రూపంలో ఇచ్చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

This post was last modified on September 20, 2024 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

3 hours ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

5 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

5 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

7 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

7 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

8 hours ago