Trends

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కేజీ ఎంత?

పెను దుమారంగా మారిన తిరుమల లడ్డూ నాణ్యత అంశంపై బోలెడన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తానికి మూలం లడ్డూ నాణ్యత మీద ఉన్న అనుమానంతో..దానికి వినియోగించిన నెయ్యిని పరీక్షలకు పంపగా.. అందులో స్వచ్ఛమైన ఆవునెయ్యికి బదులుగా.. పందికొవ్వు.. గొడ్డు కొవ్వు ఉందన్న అనుమానాలు సంచంనలంగా మారాయి.

ఈ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వం తప్పు చేసిందని.. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవునెయ్యిని కేజీ రూ.320కు కొన్నట్లుగా ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన ఆవు నెయ్యి కేజీ రూ.వెయ్యికి పైనే ఉందని.. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచారన్నారు.

నిజానికి తిరుమలకు ఆవునెయ్యిని కర్ణాటక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని డెయిరీ గతంలోనెయ్యి సరఫరా చేసేది. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మార్చేశారు. కేజీ రూ.320చొప్పున కేజీ ఆవు నెయ్యిని సరఫరా చేస్తామని ముందుకు వచ్చిన వారికి కాంటాక్టులు కట్టబెట్టేశారని చెబుతున్నారు. లాభాల కోసమే ఈ తప్పుడు పనులు చేశారని మండిపడుతున్నారు.

అంతేకాదు.. తిరుమలకు లాభాలతో సంబంధం లేకున్నా.. నెయ్యిని సరఫరా చేస్తున్నా.. తమ ఆవునెయ్యిని ఎందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకోవటం లేదన్న అంశంపై కర్ణాటక అసెంబ్లీలోనూ చర్చ జరిగిన విషయాన్ని ఆనం పేర్కొన్నారు. కర్ణాక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ లంచాలు ఇవ్వరు కాబట్టే.. ఆ నెయ్యిని వాడకుండా నాణ్యత లేని నెయ్యిని కాంటాక్టు రూపంలో ఇచ్చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

Satya

Recent Posts

ఢిల్లీలో చర్చలు.. భారత్ పై కొత్త పన్నులు.. ట్రంప్ డబుల్ గేమ్!

భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు…

52 minutes ago

డాన్ 3 గొడవ నుంచి బయటపడ్డ రణ్‌వీర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కు ఒక పెద్ద ఊరట లభించింది. డాన్ 3 సినిమా వివాదం నేపథ్యంలో…

1 hour ago

టెన్షన్ పెట్టిన ‘పెద్ద’ మల్టీప్లెక్సులు

ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నప్పుడు నిర్మాతకు ఫలితం కన్నా ఎక్కువగా ఆందోళనకు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో…

1 hour ago

తెలంగాణ విషయంలో పవన్ కు బాబు మద్దతు

తెలంగాణ‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన…

2 hours ago

లేబర్ అడ్డా అదిరిందండోయ్!

ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని…

2 hours ago

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు…

3 hours ago