పెను దుమారంగా మారిన తిరుమల లడ్డూ నాణ్యత అంశంపై బోలెడన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తానికి మూలం లడ్డూ నాణ్యత మీద ఉన్న అనుమానంతో..దానికి వినియోగించిన నెయ్యిని పరీక్షలకు పంపగా.. అందులో స్వచ్ఛమైన ఆవునెయ్యికి బదులుగా.. పందికొవ్వు.. గొడ్డు కొవ్వు ఉందన్న అనుమానాలు సంచంనలంగా మారాయి.
ఈ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వం తప్పు చేసిందని.. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవునెయ్యిని కేజీ రూ.320కు కొన్నట్లుగా ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన ఆవు నెయ్యి కేజీ రూ.వెయ్యికి పైనే ఉందని.. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచారన్నారు.
నిజానికి తిరుమలకు ఆవునెయ్యిని కర్ణాటక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని డెయిరీ గతంలోనెయ్యి సరఫరా చేసేది. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మార్చేశారు. కేజీ రూ.320చొప్పున కేజీ ఆవు నెయ్యిని సరఫరా చేస్తామని ముందుకు వచ్చిన వారికి కాంటాక్టులు కట్టబెట్టేశారని చెబుతున్నారు. లాభాల కోసమే ఈ తప్పుడు పనులు చేశారని మండిపడుతున్నారు.
అంతేకాదు.. తిరుమలకు లాభాలతో సంబంధం లేకున్నా.. నెయ్యిని సరఫరా చేస్తున్నా.. తమ ఆవునెయ్యిని ఎందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకోవటం లేదన్న అంశంపై కర్ణాటక అసెంబ్లీలోనూ చర్చ జరిగిన విషయాన్ని ఆనం పేర్కొన్నారు. కర్ణాక ప్రభుత్వ మిల్క్ ఫెడరేషన్ లంచాలు ఇవ్వరు కాబట్టే.. ఆ నెయ్యిని వాడకుండా నాణ్యత లేని నెయ్యిని కాంటాక్టు రూపంలో ఇచ్చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
This post was last modified on September 20, 2024 9:50 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…