హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ మాత్రం తగ్గని రీతిలో దూసుకెళుతోంది. కొన్ని విషయాల్లో హైదరాబాద్ కు సాటి రానట్లుగా పరిస్థితులు ఉన్నాయి. తాజాగా నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన రిపోర్టులో హైదరాబాద్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా పేర్కొంది.
అతి పెద్ద ఆఫీస్ స్థలాలకు హైదరాబాద్ లో గిరాకీ పెరిగిపోతోందన్న సదరు నివేదిక.. చిన్న స్థలాల కంటే కూడా పెద్ద ఆఫీసు స్థలాలకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఒక లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న వాటిని పెద్ద ఆఫీసు స్థలాలుగా లెక్కలోకి తీసుకుంటున్నారు. దేశంలోని వివిధ మహానగరాలతో పోల్చి చూసినప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఎంత బాగుందన్న విషయాన్ని ఈ రిపోర్టు చెప్పేసింది.
ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో హైదరాబాద్ లో నమోదైన ఆఫీస్ స్పేస్ కు సంబంధించిన లీజు లావాదేవీల్లోపెద్ద ఆఫీసు స్థలాల వాటానే అధికంగా ఉంది. ఇది 61 శాతంగా ఉన్నట్లుగా పేర్కొంది. గత ఏడాది మొదటిఆర్నెల్లతో పోలిస్తే.. ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో పెద్ద ఆఫీసుస్థలాలకు 109 శాతం అధిక గిరాకీ కనిపించినట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో హైదరాబాద్ లో 50 లక్షల చదరపుఅడుగుల ఆఫీసు స్థలం లీజు లావాదేవీలు నమోదయ్యాయి. దీనికి కారణం గ్లోబల్ కేపబిలిటి సెంటర్ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు.
లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉన్న ఆఫీస్ స్పేస్ కు ఉన్న డిమాండ్ కు తగ్గట్లే.. మధ్యస్థాయి ఆఫీసు స్థలాలు (50వేల చదరపు అడుగులు – లక్ష చదరపు అడుగుల మధ్య ఉండే ఆఫీస్ స్పేస్)విభాగంలోనే డిమాండ్ అధికంగానే ఉన్నట్లు వెల్లడించింది. 50వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఆఫీస్ స్పేస్ విభాగంలో లావాదేవీలు 13 శాతంగా ఉన్నాయి. వ్యాపార కార్యకలాపాలు పెరగటం.. మౌలిక సదుపాయాలు.. మానవ వనరుల లభ్యత ఎక్కువగా ఉండటంతో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. మొత్తానికి సమీప భవిష్యత్ మొత్తం హైదరాబాదే అన్నమాట.
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…