వినాయకచవితి నిమజ్జనం వేళలో నిర్వహించే లడ్డూ వేలం ఎంతటి ఆసక్తిని రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది హైదరాబాద్ శివారులోని ఖరీదైన విలాల్ల్లో జరిగిన లడ్డూ వేలం కోటి దాటేసి.. అందరూ వారివైపు చూడగా.. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ శివారులోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వారు.. తిరుగులేని రీతిలో ఈసారీ తమదే అత్యధిక లడ్డూ వేలంగా తేల్చేశారు. తాజాగా జరిగిన లడ్డూ వేలంలో లడ్డూను రూ.1.87 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపంలో గణనాథుని చేతిలో ఉంచే లడ్డూ ప్రసాదాన్ని చివరి రోజున వేలం వేయటం తెలిసిందే. దాన్ని ఎవరైతే అత్యధిక ధరకు పాడతారో వారికి ఇస్తారు.
గత ఏడాది రిచ్ మండ్ విల్లాల వారు నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకగా.. ఈసారి దాన్ని మించి ఏకంగా రూ.1.87 కోట్లుగా పలికింది. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. మిగిలిన లడ్డూ వేలంకు రిచ్ మండ్ విల్లాస్ వేలంకు ఒక తేడా ఉంది. మిగిలిన చోట్ల ఒకరు.. లేదంటే కొందరు కలిసిన గ్రూప్ కలిసి లడ్డూ వేలంలో పాల్గొంటారు. కానీ.. రిచ్ మండ్ విల్లాస్ వైఖరి వేరు. వీరికి చెందిన ఆర్వీ దివ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా వేలంలో తమ ప్రాజెక్టులో ఉన్న విల్లాల వారంతా కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపడతారు. వారంతా కలిసి ఇచ్చిన మొత్తాల్ని ఏక మొత్తంగా చేస్తారు. ఆ మొత్తాన్ని లడ్డూ వేలం మొత్తంగా డిసైడ్ చేస్తారు.
అంటే.. మీడియాలో వచ్చిన విధంగా రిచ్ మండ్ విల్లాస్ లో జరిగిన లడ్డూ వేలం పాటలో పలికిన రూ.1.87 కోట్ల మొత్తాన్ని ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా పాడలేదు. వీరికి చెందిన ట్రస్టు తరఫున.. అందరూ కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపడతారు. అయితే.. ఇక్కడ ఎవరికి వారు పోటాపోటీగా క్రౌడ్ ఫండింగ్ కు విరాళాలు ఇస్తారు. దీంతో.. భారీ మొత్తం సిద్ధమవుతుంది. వీరు కలెక్టు చేసిన భారీ మొత్తాన్ని 42 వేర్వేరు ఎన్జీవోల ద్వారా పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గణేషుడి లడ్డూ వేలం లక్షలాదిగా జరిగినా.. రిచ్ మండ్ విల్లాస్ వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుందని చెప్పక తప్పదు.
This post was last modified on September 17, 2024 9:49 am
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…