వినాయకచవితి నిమజ్జనం వేళలో నిర్వహించే లడ్డూ వేలం ఎంతటి ఆసక్తిని రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది హైదరాబాద్ శివారులోని ఖరీదైన విలాల్ల్లో జరిగిన లడ్డూ వేలం కోటి దాటేసి.. అందరూ వారివైపు చూడగా.. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్ శివారులోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వారు.. తిరుగులేని రీతిలో ఈసారీ తమదే అత్యధిక లడ్డూ వేలంగా తేల్చేశారు. తాజాగా జరిగిన లడ్డూ వేలంలో లడ్డూను రూ.1.87 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపంలో గణనాథుని చేతిలో ఉంచే లడ్డూ ప్రసాదాన్ని చివరి రోజున వేలం వేయటం తెలిసిందే. దాన్ని ఎవరైతే అత్యధిక ధరకు పాడతారో వారికి ఇస్తారు.
గత ఏడాది రిచ్ మండ్ విల్లాల వారు నిర్వహించిన వేలంలో రికార్డు ధర పలకగా.. ఈసారి దాన్ని మించి ఏకంగా రూ.1.87 కోట్లుగా పలికింది. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. మిగిలిన లడ్డూ వేలంకు రిచ్ మండ్ విల్లాస్ వేలంకు ఒక తేడా ఉంది. మిగిలిన చోట్ల ఒకరు.. లేదంటే కొందరు కలిసిన గ్రూప్ కలిసి లడ్డూ వేలంలో పాల్గొంటారు. కానీ.. రిచ్ మండ్ విల్లాస్ వైఖరి వేరు. వీరికి చెందిన ఆర్వీ దివ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా వేలంలో తమ ప్రాజెక్టులో ఉన్న విల్లాల వారంతా కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపడతారు. వారంతా కలిసి ఇచ్చిన మొత్తాల్ని ఏక మొత్తంగా చేస్తారు. ఆ మొత్తాన్ని లడ్డూ వేలం మొత్తంగా డిసైడ్ చేస్తారు.
అంటే.. మీడియాలో వచ్చిన విధంగా రిచ్ మండ్ విల్లాస్ లో జరిగిన లడ్డూ వేలం పాటలో పలికిన రూ.1.87 కోట్ల మొత్తాన్ని ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా పాడలేదు. వీరికి చెందిన ట్రస్టు తరఫున.. అందరూ కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపడతారు. అయితే.. ఇక్కడ ఎవరికి వారు పోటాపోటీగా క్రౌడ్ ఫండింగ్ కు విరాళాలు ఇస్తారు. దీంతో.. భారీ మొత్తం సిద్ధమవుతుంది. వీరు కలెక్టు చేసిన భారీ మొత్తాన్ని 42 వేర్వేరు ఎన్జీవోల ద్వారా పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గణేషుడి లడ్డూ వేలం లక్షలాదిగా జరిగినా.. రిచ్ మండ్ విల్లాస్ వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుందని చెప్పక తప్పదు.
This post was last modified on September 17, 2024 9:49 am
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…