మంచో చెడో.. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక మాట అనేశారు. జగన్ చాలా నేర్చుకోవాలి
అని! ఔను. ఇది వాస్తవం కూడా.
ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేయాలని చూసిన జగన్.. డబ్బులు ఇస్తు న్నాం.. మనకే ఓటేస్తారని భావించిన జగన్.. తాజా ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు.
జనం డబ్బుకు కాదు.. లొంగేది.. అభిమానానికని నిరూపించారు. కానీ, జగన్ నేర్చుకోలేక పోయారు. విజయవాడకు వరదలు వచ్చాయి. సర్వస్వం కోల్పోయారు. ఈ విషయం సర్కారే చెప్పింది.
అయినా.. జనం ఆనందంగానే భరిస్తున్నారు. కారణం.. వారి కష్టాన్ని తన కష్టంగా భావించిన చంద్రబాబును చూసు కుని. వరదలు వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి మందిరంలో కూర్చుని అధికారులను పంపించలేదు.
తానే స్వ యంగా మోకాల్లోతు నీటిలో దిగారు. ప్రజలకు ఏమీ తీసుకువెళ్లలేదు.. కొండంత మనోధైర్యాన్ని తప్ప. తొలి రెండు రోజులు పాపం.. అలానే జరిగిపోయింది.
ఆ సమయంలో అసలు ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. అయినా.. జనం కుంగిపోకుండా జాగ్రత్త పడ్డారు. తన మాటలతోనే వారికి ధైర్యం చెప్పారు.
చేయాల్సిన పనులు తర్వాత నుంచి వేగం పెంచారు. ఆహారం, నీరు.. అందించారు. ఎక్కడెక్కడ నుంచో మనుషు లను రప్పించారు. నేనున్నానంటూ.. ముందుకు సాగారు.
ఇతమిత్థంగా చెప్పాలంటే.. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి అందింది.. రేషన్, ఆహారం, తాగునీరు మాత్రమే. కానీ, వారు రెచ్చిపోలేదు. తమకు ఏమీ చేయలేదన్న బాధ కూడా వారిలో పెద్దగా కనిపించడం లేదు. రీజన్.. ఏదైనా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న భావనను వారిలో బలంగా నింపగలిగిన భరోసాను చంద్రబాబు ఇప్పటికే ఇచ్చేశారు.
ఇక, పవన్ కల్యాణ్.. క్షేత్రస్థాయికి వెళ్లలేదు. కానీ, ఆయన చేయాల్సింది ఆయన చేశారు. పంచాయతీలకు లక్ష చొప్పున 400 పంచాయతీలకు ఇచ్చారు. కోటి రూపాయలను వరద ప్రభావిత ప్రాంతాల కు సాయంగా అందించారు. ఇదీ.. ఆయన రాకపోయినా.. జరిగిపోయిన పని.
దీనినే జగన్ ఇప్పుడు నేర్చుకోవాలన్నది మంత్రి మనోహర్ చెబుతున్న మాట. నాలుగు రాళ్లు వేయడం తేలిక.. రాళ్లు తీయడమే కష్టం. చంద్రబాబు, పవన్లు చేసింది.. రాళ్లు వేయడం కాదు.. కష్టాల రాళ్లను తొలగించడం. దీనినుంచే జగన్ చాలా నేర్చుకోవాలి!! నేర్చుకుంటారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on September 14, 2024 3:13 pm
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిషిని ఆప్ నాయక త్వం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.…
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ? అనవసరంగా అతని…
సంవత్సరాలు, నెలల నుంచి కౌంట్ డౌన్ ఇప్పుడు రోజుల్లోకి వచ్చేసింది. దేవర పార్ట్ 1 విడుదలకు సరిగ్గా పది రోజులు…
బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీ ఇష్యూతో తెర మీదకు వచ్చిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా.. విశాల్…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ ముందున్న అతి పెద్ద సమస్య విడుదల…
వినాయకచవితి నిమజ్జనం వేళలో నిర్వహించే లడ్డూ వేలం ఎంతటి ఆసక్తిని రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది…