Trends

రజినీ సినిమా లో చేయమని హీరో ని అడిగితే

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఆయన్ని మించిన ఆకర్షణ వేరే ఇంకేదీ అవసరం లేదు. కానీ ఆయన కొత్త చిత్రాల్లో మాత్రం దర్వకులు వేరే ఆకర్షణల్ని బాగానే దట్టిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ‘వేట్టయాన్’తో పాటు ఆ తర్వాత రానున్న ‘కూలీ’ సినిమామాల్లో కాస్టింగ్ చూస్తే మల్టీస్టారర్ తరహాలో కనిపిస్తున్నాయి.

‘వేట్టయాన్’లో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఇక ‘కూలీ’లో ఏమో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి పేరున్న నటులున్నారు. రజినీతో నాగ్, ఉపేంద్రల కలయికను అస్సలు ఎవ్వరూ ఊహించి ఉండరు.

నాగ్ ఇలాంటి ప్రత్యేక పాత్రలు పోషించడం మామూలే కానీ.. ఉపేంద్ర ఇలాంటి పాత్రలు చేయడం అరుదు. ఐతే సూపర్ స్టార్ సినిమా అన్న ఏకైక కారణంతో కథ కూడా వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర చెప్పాడు.

దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనకు ఫోన్ చేసి రజినీకాంత్ సినిమాలో నటించాల్సి ఉంటుందని చెప్పాడని.. అలాగే సినిమా లైన్ చెప్పి తన పాత్ర గురించి వివరించబోతుంటే.. తాను ఆపేశానని ఉపేంద్ర తెలిపాడు. తాను రజినీకాంత్‌కు చాలా పెద్ద ఫ్యాన్ అని.. అలాంటపుడు కథ, పాత్ర గురించి చెప్పడం ఎందుకు, ఈ సినిమా చేస్తున్నా అంటూ ఆపేశానని ఉపేంద్ర చెప్పాడు.

రజినీ సినిమాలో నటించడం కంటే అదృష్టం, ఆనందం ఇంకేమీ ఉండదని.. అందుకే ఈ సినిమా కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నానని ఉపేంద్ర వెల్లడించాడు. ఉపేంద్ర ఇలా తెలుగులో రెండు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించాడు.

సన్నాఫ్ సత్యమూర్తితో పాటు గని మూవీలో నటించాడు. కానీ అవి నిరాశపరిచాయి. మరి తమిళంలో, అది కూడా సూపర్ స్టార్ మూవీలో చేస్తున్న ప్రత్యేక పాత్రతో ఉపేంద్ర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

This post was last modified on September 13, 2024 12:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago