Trends

జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించేలా బాబు చేయగలరా

రాష్ట్రంలో జ‌రిగిన వ‌ర‌ద న‌ష్టాన్ని.. వ‌ర‌ద క‌ష్టాన్ని.. జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని సీఎం చంద్ర‌బాబు విన్న‌వించా రు. ప్ర‌స్తుతం రెండు రోజులుగా కేంద్రం నుంచి వ‌చ్చిన విపత్తు బృందాలు.. రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నాయి. రేపు కూడా ఈ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో గురువారం సాయంత్రం సీఎం చంద్ర‌బాబు వారితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రంలో జ‌రిగిన న‌ష్టాన్ని వారికి వివ‌రించారు.

ఇదేస‌మ‌యంలో న‌ష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేసి.. వారికి స్వ‌యంగా చంద్ర‌బాబు వివ‌రిం చారు. రాష్ట్రంలో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో న‌ష్టం వాటిల్లింద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఊళ్ల‌కు ఊళ్లే మునిగిపో యాయ‌ని.. రోజుల త‌ర‌బ‌డి.. ప్ర‌జ‌లు నీటిలో నానిపోయార‌ని.. ఇళ్లు.. దుస్తులు.. వ‌స్తువుల కూడా కోల్పోయార‌ని.. వారి క‌ష్టం.. న‌ష్టం అంతా ఇంతా కాద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే తాము ప్రాథ‌మికంగా ఒక అంచ‌నా వేసి.. రూ.6880 కోట్ల మేర‌కు న‌ష్టం వ‌చ్చిన‌ట్టు గుర్తించామ‌న్నారు.

దీనికి సంబందించిన నివేదిక‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించామ‌ని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. ఇక‌, పూర్తిస్థాయి న‌ష్టాన్ని అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో క‌ష్టాన్ని, న‌ష్టాన్ని గ‌మ‌నించి.. జాతీయ విప‌త్తు గా ప్ర‌క‌టించాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. జ‌రిగిన న‌ష్టాన్ని గ‌మ‌నించాల‌ని ఆయ‌న విన్న‌వించారు. బాధితుల‌కు అన్ని విధాలా సాయం చేస్తున్నామ‌ని.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిన వారి క‌ష్టాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఫొటోలు.. వీడియోల‌ను కూడా వారికి చూపించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర బృందం స‌భ్యులు మాట్లాడుతూ.. తాము కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించామ‌ని, ప‌రిస్థితిని గ‌మ‌నించామ‌న్నారు. రైతులు కూడా తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని వారే చెప్పారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మ‌రోసారి జోక్యం చేసుకుని రైతుల‌కు వ‌చ్చిన క‌ష్టం కూడా క‌నీవినీ ఎరుగని రీతిలో ఉంద‌న్నారు. వేలాది హెక్టార్లు నీట మునిగాయ‌ని అన్నారు. వారికి కూడా న్యాయం చేయాల్సి ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న‌ను జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌న్నారు.

This post was last modified on September 13, 2024 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago