రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని.. వరద కష్టాన్ని.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు విన్నవించా రు. ప్రస్తుతం రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన విపత్తు బృందాలు.. రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. రేపు కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వారికి వివరించారు.
ఇదేసమయంలో నష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి.. వారికి స్వయంగా చంద్రబాబు వివరిం చారు. రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఊళ్లకు ఊళ్లే మునిగిపో యాయని.. రోజుల తరబడి.. ప్రజలు నీటిలో నానిపోయారని.. ఇళ్లు.. దుస్తులు.. వస్తువుల కూడా కోల్పోయారని.. వారి కష్టం.. నష్టం అంతా ఇంతా కాదని వివరించారు. ఇప్పటికే తాము ప్రాథమికంగా ఒక అంచనా వేసి.. రూ.6880 కోట్ల మేరకు నష్టం వచ్చినట్టు గుర్తించామన్నారు.
దీనికి సంబందించిన నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించామని సీఎం చంద్రబాబు వివరించారు. ఇక, పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కష్టాన్ని, నష్టాన్ని గమనించి.. జాతీయ విపత్తు గా ప్రకటించాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. జరిగిన నష్టాన్ని గమనించాలని ఆయన విన్నవించారు. బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తున్నామని.. కట్టుబట్టలతో మిగిలిన వారి కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోలు.. వీడియోలను కూడా వారికి చూపించారు.
ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. తాము కూడా క్షేత్రస్థాయిలో పర్యటించామని, పరిస్థితిని గమనించామన్నారు. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని వారే చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి జోక్యం చేసుకుని రైతులకు వచ్చిన కష్టం కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఉందన్నారు. వేలాది హెక్టార్లు నీట మునిగాయని అన్నారు. వారికి కూడా న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు.
This post was last modified on September 13, 2024 10:22 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…