Trends

జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించేలా బాబు చేయగలరా

రాష్ట్రంలో జ‌రిగిన వ‌ర‌ద న‌ష్టాన్ని.. వ‌ర‌ద క‌ష్టాన్ని.. జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని సీఎం చంద్ర‌బాబు విన్న‌వించా రు. ప్ర‌స్తుతం రెండు రోజులుగా కేంద్రం నుంచి వ‌చ్చిన విపత్తు బృందాలు.. రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నాయి. రేపు కూడా ఈ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో గురువారం సాయంత్రం సీఎం చంద్ర‌బాబు వారితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రంలో జ‌రిగిన న‌ష్టాన్ని వారికి వివ‌రించారు.

ఇదేస‌మ‌యంలో న‌ష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేసి.. వారికి స్వ‌యంగా చంద్ర‌బాబు వివ‌రిం చారు. రాష్ట్రంలో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో న‌ష్టం వాటిల్లింద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఊళ్ల‌కు ఊళ్లే మునిగిపో యాయ‌ని.. రోజుల త‌ర‌బ‌డి.. ప్ర‌జ‌లు నీటిలో నానిపోయార‌ని.. ఇళ్లు.. దుస్తులు.. వ‌స్తువుల కూడా కోల్పోయార‌ని.. వారి క‌ష్టం.. న‌ష్టం అంతా ఇంతా కాద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే తాము ప్రాథ‌మికంగా ఒక అంచ‌నా వేసి.. రూ.6880 కోట్ల మేర‌కు న‌ష్టం వ‌చ్చిన‌ట్టు గుర్తించామ‌న్నారు.

దీనికి సంబందించిన నివేదిక‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించామ‌ని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. ఇక‌, పూర్తిస్థాయి న‌ష్టాన్ని అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో క‌ష్టాన్ని, న‌ష్టాన్ని గ‌మ‌నించి.. జాతీయ విప‌త్తు గా ప్ర‌క‌టించాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. జ‌రిగిన న‌ష్టాన్ని గ‌మ‌నించాల‌ని ఆయ‌న విన్న‌వించారు. బాధితుల‌కు అన్ని విధాలా సాయం చేస్తున్నామ‌ని.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిన వారి క‌ష్టాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఫొటోలు.. వీడియోల‌ను కూడా వారికి చూపించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర బృందం స‌భ్యులు మాట్లాడుతూ.. తాము కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించామ‌ని, ప‌రిస్థితిని గ‌మ‌నించామ‌న్నారు. రైతులు కూడా తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని వారే చెప్పారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మ‌రోసారి జోక్యం చేసుకుని రైతుల‌కు వ‌చ్చిన క‌ష్టం కూడా క‌నీవినీ ఎరుగని రీతిలో ఉంద‌న్నారు. వేలాది హెక్టార్లు నీట మునిగాయ‌ని అన్నారు. వారికి కూడా న్యాయం చేయాల్సి ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న‌ను జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌న్నారు.

This post was last modified on September 13, 2024 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

22 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

2 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

4 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago