ఒక సినిమా రిలీజ్ అవ్వడం మీద కన్నా మొదలుపెట్టడం గురించి విపరీతమైన ఉత్సుకత కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాటిలో ఇప్పుడు మొదటి వరసలో ఉన్నది మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ.
ఫ్యాన్స్ ఎదురు చూపులకు పరీక్ష పెడుతూ జక్కన్న టీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అలాని పనులేవీ ఆగలేదు. వర్క్ షాప్స్, ఆడిషన్స్ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ దాదాపు లాక్ చేశారట. మహేష్ బాబు మీద రెండు ఫోటో షూట్స్ జరిగినా వాటి తాలూకు లీక్స్, వివరాలు ఏ రూపంలోనూ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
ఇక కొన్ని ఎక్స్ క్లూజివ్ లీక్స్ అభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ మూవీ అడవి నేపథ్యంలో జరిగే సంగతి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో బయట పెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఇది 1800 సంవత్సర కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామాగా వినిపిస్తోంది.
200 పైగా కీలకమైన ఆర్టిస్టులు ఇందులో భాగం పంచుకోబోతున్నారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సెట్లు, గిరిజన జాతికి సంబంధించి లుక్స్ అన్నీ సూక్ష్మ స్థాయిలో జాగ్రత్త తీసుకుని డిజైన్ చేయిస్తున్నారట. మహేష్ ఇప్పటికే పొడవాటి జుట్టుని పెంచడంతో గుబురు గెడ్డంతో తనను తాను మార్చుకోవడం చూశాం.
ఇదంతా ఫైనల్ కావడానికి కనీసం ఇంకో మూడు నెలలు సమయం పట్టేలా ఉంది. జనవరిలో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రొడక్షన్ కు రెండు సంవత్సరాలు, ఆపై నిర్మాణాంతర కార్యక్రమాలు, ప్రమోషన్లకు మరో ఆరేడు నెలలు మొత్తం కలిపి ఓ మూడేళ్లు ఈ ప్రాజెక్టు కోసం వదలుకోవాల్సి ఉంటుందని జక్కన్న ముందే చెప్పినట్టు వినికిడి.
దానికి మహేష్ అంగీకారం వచ్చాకే అడుగులు ముందుకు పడ్డాయట. సో మూవీ లవర్స్ నిరీక్షణ చాలా సుదీర్ఘంగా ఉండబోతోంది. దానికి ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు.
This post was last modified on September 13, 2024 10:24 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…