భారత స్టార్ క్రికెటర్లలో ఒకడైన హార్దిక్ పాండ్య.. సెర్బియాకు చెందిన మోడల్ నటాషా స్టాంకోవిచ్తో ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్లు అన్యోన్యంగా సాగిన ఈ జంటకు ఓ కొడుకు పుట్టడం.. కానీ తర్వాత విభేదాలు వచ్చి ఈ జంట విడిపోవడం తెలిసిందే.
ఈ ఏడాది ఆరంభంలో ఈ జంట విడిపోయింది. ఐతే అది జరిగిన కొన్ని నెలలకే నటాషా కొత్త బంధంలోకి వెళ్లిపోవడం విశేషం. తాజాగా తన కొత్త బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆమె ముంబయి చక్కర్లు కొడుతూ మీడియా కంట పడింది.
హార్దిక్ నుంచి విడిపోయాక స్వస్థలమైన సెర్బియాకు వెళ్లిపోయిన నటాషా.. ఇటీవలే తిరిగి ముంబయికి వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వెంట వచ్చాడు. తమ ఇద్దరినీ మీడియా వాళ్లు ఫొటోలు తీస్తున్నా నటాషా పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి కారు ఎక్కి తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది.
ప్రస్తుతానికి హార్దిక్ అయితే ఒంటరిగానే ఉన్నాడు. విడాకుల అనంతరం కొడుకును తీసుకుని సెర్బియాకు వెళ్లిన నటాషా.. ఇటీవలే ఇక్కడికి తిరిగొచ్చాక కొడుకును తండ్రి వద్ద విడిచిపెట్టింది. తాజాగా వినాయక చవితి వేడుకల్లో హార్దిక్, కృణాల్ కుటుంబాలతో కలిసి ఆ పిల్లాడు సందడి చేశాడు.
నటాషాను కరోనా టైంలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు హార్దిక్. ఓ షిప్లో వీరి పెళ్లి జరిగింది. కరోనా టైంలో కాబట్టి పెళ్లి ఘనంగా చేసుకోలేదని.. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ప్రత్యేకంగా వేడుకలు చేసుకున్నారు హార్దిక్, నటాషా. ఇదంతా ఏడాది ముందే జరిగింది.
అప్పుడు అంత హుషారుగా ఉన్న జంట.. ఏడాది తిరిగే లోపు విడిపోయింది. భరణం కింద నటాషాకు హార్దిక్ భారీ మొత్తంలో డబ్బు, ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ఐతే కొడుకు మాత్రం ఇద్దరి దగ్గరా పెరిగేలా వీరి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
This post was last modified on September 12, 2024 6:13 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…