భారత స్టార్ క్రికెటర్లలో ఒకడైన హార్దిక్ పాండ్య.. సెర్బియాకు చెందిన మోడల్ నటాషా స్టాంకోవిచ్తో ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్లు అన్యోన్యంగా సాగిన ఈ జంటకు ఓ కొడుకు పుట్టడం.. కానీ తర్వాత విభేదాలు వచ్చి ఈ జంట విడిపోవడం తెలిసిందే.
ఈ ఏడాది ఆరంభంలో ఈ జంట విడిపోయింది. ఐతే అది జరిగిన కొన్ని నెలలకే నటాషా కొత్త బంధంలోకి వెళ్లిపోవడం విశేషం. తాజాగా తన కొత్త బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆమె ముంబయి చక్కర్లు కొడుతూ మీడియా కంట పడింది.
హార్దిక్ నుంచి విడిపోయాక స్వస్థలమైన సెర్బియాకు వెళ్లిపోయిన నటాషా.. ఇటీవలే తిరిగి ముంబయికి వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వెంట వచ్చాడు. తమ ఇద్దరినీ మీడియా వాళ్లు ఫొటోలు తీస్తున్నా నటాషా పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి కారు ఎక్కి తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది.
ప్రస్తుతానికి హార్దిక్ అయితే ఒంటరిగానే ఉన్నాడు. విడాకుల అనంతరం కొడుకును తీసుకుని సెర్బియాకు వెళ్లిన నటాషా.. ఇటీవలే ఇక్కడికి తిరిగొచ్చాక కొడుకును తండ్రి వద్ద విడిచిపెట్టింది. తాజాగా వినాయక చవితి వేడుకల్లో హార్దిక్, కృణాల్ కుటుంబాలతో కలిసి ఆ పిల్లాడు సందడి చేశాడు.
నటాషాను కరోనా టైంలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు హార్దిక్. ఓ షిప్లో వీరి పెళ్లి జరిగింది. కరోనా టైంలో కాబట్టి పెళ్లి ఘనంగా చేసుకోలేదని.. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ప్రత్యేకంగా వేడుకలు చేసుకున్నారు హార్దిక్, నటాషా. ఇదంతా ఏడాది ముందే జరిగింది.
అప్పుడు అంత హుషారుగా ఉన్న జంట.. ఏడాది తిరిగే లోపు విడిపోయింది. భరణం కింద నటాషాకు హార్దిక్ భారీ మొత్తంలో డబ్బు, ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ఐతే కొడుకు మాత్రం ఇద్దరి దగ్గరా పెరిగేలా వీరి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
This post was last modified on September 12, 2024 6:13 pm
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…
సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం…