టాలీవుడ్డే కాదు దేశంలో అన్ని వుడ్డులు ఎదురు చూస్తున్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబినేషనని ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అనౌన్స్ చేసి నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ప్రారంభోత్సవం జరగకపోవడంతో అభిమానులు సహజంగానే ఖంగారు పడతారు.
ఒకపక్క మహేష్ కొత్త లుక్ తో బయట అదరగొడుతూ ఉండగా ఇక అసలు మూవీలో ఎలా ఉంటాడోనని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. అయితే ఎన్నిరకాలుగా అప్డేట్స్ కోసం ఎదురు చూసినా ఆ క్షణం మాత్రం రావడం లేదు. కృష్ణ, మహేష్ పుట్టినరోజులు అయిపోయినా ఏ జాడ లేదు.
అడిగితే మాత్రం నిర్ధాక్షిణ్యంగా కొట్టేస్తా అంటున్నారు జక్కన్న. మత్తువదలరా 2 ప్రమోషన్స్ కోసం తనను కలిసిన శ్రీసింహ, కాల భైరవలు చిన్న వీడియో బైట్ తీసుకున్నాక చివర్లో ఎస్ఎస్ఆర్ఎంబి అప్డేట్ ఇవ్వొచ్చుగా అని అడిగితే కర్ర తీసుకుని కొట్టడానికి సిద్ధపడటం వైరలవుతోంది.
సరదాగా చేసిందే అయినా రాజమౌళి మనసులో మాత్రం నిజంగా ఆ ఉద్దేశమే ఉంది. మహేష్ ఫ్యాన్స్ నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఏ మాత్రం చలించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రెండు వర్క్ షాపులు, ఆడిషన్లు జరిగాయని సమాచారం ఉంది కానీ సరైన స్పష్టత లేదు.
ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం ఈ ఎస్ఎస్ఎంబి గ్లోబల్ మూవీని జనవరిలో లాంఛ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. అయితే రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ కలిసి నిర్ధారణగా ఓకే అనుకున్న తర్వాతే ప్రకటన ప్లస్ ప్రెస్ మీట్ రెండూ ఉంటాయి. సంక్రాంతి పండగ మంచి అకేషన్ కాబట్టి దాన్నే ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఇంకో నాలుగు నెలలు ఎదురు చూడక తప్పేలా లేదు. క్యాస్టింగ్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్ త్వరలోనే కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కి ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా కనీసం మహేష్ అభిమానులకు కనీసం రెండేళ్ల నిరీక్షణ తప్పదు.
This post was last modified on September 11, 2024 4:41 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…