Trends

బాబు టీంకు ఫుల్ మార్కులు.!

వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేయడంలో మంత్రులు ప‌డుతున్న క‌ష్టం ఒక్కొక్క‌రిది ఒక్కొక్క ర‌కంగా ఉం ది. రాజ‌కీయంగా దూకుడు ఉండే అనేక మంది నాయ‌కులు బాధితుల క‌ష్టాలు చూసి క‌రిగిపోతున్నారు. విజ‌య‌వాడ శివారు ప్రాంతం మునిగిపోయిన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు.. సీఎం చంద్ర‌బాబు నేరుగా రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రుల‌ను కూడా రావాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు. దీంతో ఉమ్మ‌డి ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగారు.

వీరిలో కొంద‌రు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ.. బాధితుల క‌ష్టాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఇరిగేష‌న్ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌విలు ఏకంగా బాధిత ప్రాంతాల్లో క‌లియ‌దిరుగుతున్నారు. బుడ‌మేరు గండి పూడ్చే వ‌ర‌కు తాను అక్క‌డే ఉంటాన‌ని నిమ్మ‌ల శ‌ప‌థం చేసి మరీ.. అక్క‌డే ఉన్నారు. అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు.. తాగునీటిని సాధ్య‌మైనంత వ‌ర‌కు వేగంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక‌, గొట్టిపాటి ర‌వి అయితే..శివారు ప్రాంతాల్లో విద్యుత స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించే ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. అధికారుల‌ను రాత్రి వేళ‌ల్లో కూడా అక్క‌డే ఉంచి.. తాను కూడా ఉండి ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మ‌రో మంత్రి నారా లోకేష్‌.. స‌మ‌న్వ‌యం చేస్తూ.. ఎక్క‌డా లోపాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రుల‌ను క్షేత్ర‌స్థాయికి తీసుకువెళ్లి బాధితుల గోడును స్వ‌యంగా వారికి వినిపిస్తూ.. చొర‌వ తీసుకుంటున్నారు.

జ‌న‌సేన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ.. మ‌రోవైపు.. కేంద్రానికి త‌గిన విధంగా నివేదిక‌లు రూపొందించే ప‌నిలో ఉన్నారు. హోం మంత్రి అనిత‌కూడా రాజ‌రాజేశ్వ‌రి పేట‌లోనే తిష్ట వేశారు. ఇక్క‌డ మ‌హిళ‌లు ఎక్కువ‌గా బాధ‌ల్లో ఉన్నారు. వారికి ఓదార్పు నిస్తూ.. వారికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు ఏర్పాటు చేసేలా చొర‌వ తీసుకుంటున్నారు. మంత్రి స‌విత విజ‌య‌వాడ‌లో ఉండి.. ఆహార పంపిణీ.. నీటి పంపిణీని నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇలా.. చంద్ర‌బాబు టీం అద్భుత ప‌నితీరు చూపిస్తోంది. అయితే.. లోపం ఏంటంటే.. బాధితులు ఎక్కువ‌గా ఉండడం.. శివారు ప్రాంతంలో ఉండ‌డంతో త‌గిన విధంగా సాయం అంద‌డం లేద‌నేది వాస్త‌వం.

This post was last modified on September 6, 2024 5:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago