Trends

బాబు టీంకు ఫుల్ మార్కులు.!

వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేయడంలో మంత్రులు ప‌డుతున్న క‌ష్టం ఒక్కొక్క‌రిది ఒక్కొక్క ర‌కంగా ఉం ది. రాజ‌కీయంగా దూకుడు ఉండే అనేక మంది నాయ‌కులు బాధితుల క‌ష్టాలు చూసి క‌రిగిపోతున్నారు. విజ‌య‌వాడ శివారు ప్రాంతం మునిగిపోయిన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు.. సీఎం చంద్ర‌బాబు నేరుగా రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రుల‌ను కూడా రావాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు. దీంతో ఉమ్మ‌డి ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రులు రంగంలోకి దిగారు.

వీరిలో కొంద‌రు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ.. బాధితుల క‌ష్టాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఇరిగేష‌న్ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌విలు ఏకంగా బాధిత ప్రాంతాల్లో క‌లియ‌దిరుగుతున్నారు. బుడ‌మేరు గండి పూడ్చే వ‌ర‌కు తాను అక్క‌డే ఉంటాన‌ని నిమ్మ‌ల శ‌ప‌థం చేసి మరీ.. అక్క‌డే ఉన్నారు. అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు.. తాగునీటిని సాధ్య‌మైనంత వ‌ర‌కు వేగంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక‌, గొట్టిపాటి ర‌వి అయితే..శివారు ప్రాంతాల్లో విద్యుత స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించే ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. అధికారుల‌ను రాత్రి వేళ‌ల్లో కూడా అక్క‌డే ఉంచి.. తాను కూడా ఉండి ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మ‌రో మంత్రి నారా లోకేష్‌.. స‌మ‌న్వ‌యం చేస్తూ.. ఎక్క‌డా లోపాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రుల‌ను క్షేత్ర‌స్థాయికి తీసుకువెళ్లి బాధితుల గోడును స్వ‌యంగా వారికి వినిపిస్తూ.. చొర‌వ తీసుకుంటున్నారు.

జ‌న‌సేన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ.. మ‌రోవైపు.. కేంద్రానికి త‌గిన విధంగా నివేదిక‌లు రూపొందించే ప‌నిలో ఉన్నారు. హోం మంత్రి అనిత‌కూడా రాజ‌రాజేశ్వ‌రి పేట‌లోనే తిష్ట వేశారు. ఇక్క‌డ మ‌హిళ‌లు ఎక్కువ‌గా బాధ‌ల్లో ఉన్నారు. వారికి ఓదార్పు నిస్తూ.. వారికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు ఏర్పాటు చేసేలా చొర‌వ తీసుకుంటున్నారు. మంత్రి స‌విత విజ‌య‌వాడ‌లో ఉండి.. ఆహార పంపిణీ.. నీటి పంపిణీని నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇలా.. చంద్ర‌బాబు టీం అద్భుత ప‌నితీరు చూపిస్తోంది. అయితే.. లోపం ఏంటంటే.. బాధితులు ఎక్కువ‌గా ఉండడం.. శివారు ప్రాంతంలో ఉండ‌డంతో త‌గిన విధంగా సాయం అంద‌డం లేద‌నేది వాస్త‌వం.

Satya

Recent Posts

అనుమానాలు తీర్చేసిన ఆదర్శ కుటుంబం

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…

5 hours ago

హైదరాబాదు రోడ్డుపై స్పందించిన ట్రంప్

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…

6 hours ago

శోకంలోనూ విమర్శలు తప్పలేదు

అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…

6 hours ago

చంద్రబాబు… అసలైన జెన్ జీ..!

ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

7 hours ago

డ్రాగన్ అలా చేస్తే అభిమానులకు పండగే

డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…

7 hours ago

టీడీపీ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు?

అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…

7 hours ago