నాలుగు నిండుప్రాణాల్ని తీసింది రోడ్డు యాక్సిడెంట్. ఉన్నత విద్య కోసం.. డాలర్ డ్రీమ్స్ ను తీర్చుకోవటానికి అమెరికాకు వెళ్లిన నలుగురు భారతీయులు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘనాథ్.. ఫరూఖ్.. లోకేశ్ లతో పాటు తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ నలుగురు కార్ పూలింగ్ ద్వారా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. బెన్ టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒక వాహనంలో బయలుదేరారు.
అనూహ్యంగా వరుసగా 5 వాహనాలు ఒకదానికి ఒకటి అతి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. డల్లాస్ లోని బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్, భార్యను కలిసేందుకు బయలుదేరిన లోకేశ్.. విశ్వవిద్యాలయానికి వెళ్తున్న దర్శిని వాసుదేవన్ లతో పాటు ఫరూఖ్ కూడా ఒకే కారులో ఎక్కారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకోవటంతో కారులో నుంచి బయటకు రాలేకపోయినట్లు చెబుతున్నారు.
వీరి డెడ్ బాడీస్ గుర్తు పట్టలేనంతగా కాలిపోవటంతో.. కార్ పూలింగ్ ద్వారా యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మరణించిన వారి వివరాలు ఆధారంగా వారిని గుర్తించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.
This post was last modified on September 4, 2024 11:15 am
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…