నాలుగు నిండుప్రాణాల్ని తీసింది రోడ్డు యాక్సిడెంట్. ఉన్నత విద్య కోసం.. డాలర్ డ్రీమ్స్ ను తీర్చుకోవటానికి అమెరికాకు వెళ్లిన నలుగురు భారతీయులు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘనాథ్.. ఫరూఖ్.. లోకేశ్ లతో పాటు తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ నలుగురు కార్ పూలింగ్ ద్వారా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. బెన్ టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒక వాహనంలో బయలుదేరారు.
అనూహ్యంగా వరుసగా 5 వాహనాలు ఒకదానికి ఒకటి అతి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. డల్లాస్ లోని బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్, భార్యను కలిసేందుకు బయలుదేరిన లోకేశ్.. విశ్వవిద్యాలయానికి వెళ్తున్న దర్శిని వాసుదేవన్ లతో పాటు ఫరూఖ్ కూడా ఒకే కారులో ఎక్కారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకోవటంతో కారులో నుంచి బయటకు రాలేకపోయినట్లు చెబుతున్నారు.
వీరి డెడ్ బాడీస్ గుర్తు పట్టలేనంతగా కాలిపోవటంతో.. కార్ పూలింగ్ ద్వారా యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మరణించిన వారి వివరాలు ఆధారంగా వారిని గుర్తించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.
This post was last modified on September 4, 2024 11:15 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…