Trends

టెక్సాస్ స్టేట్ రోడ్డు ప్రమాదంలో మనోళ్లు నలుగురు దుర్మరణం

నాలుగు నిండుప్రాణాల్ని తీసింది రోడ్డు యాక్సిడెంట్. ఉన్నత విద్య కోసం.. డాలర్ డ్రీమ్స్ ను తీర్చుకోవటానికి అమెరికాకు వెళ్లిన నలుగురు భారతీయులు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘనాథ్.. ఫరూఖ్.. లోకేశ్ లతో పాటు తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ నలుగురు కార్ పూలింగ్ ద్వారా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. బెన్ టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒక వాహనంలో బయలుదేరారు.

అనూహ్యంగా వరుసగా 5 వాహనాలు ఒకదానికి ఒకటి అతి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. డల్లాస్ లోని బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్, భార్యను కలిసేందుకు బయలుదేరిన లోకేశ్.. విశ్వవిద్యాలయానికి వెళ్తున్న దర్శిని వాసుదేవన్ లతో పాటు ఫరూఖ్ కూడా ఒకే కారులో ఎక్కారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకోవటంతో కారులో నుంచి బయటకు రాలేకపోయినట్లు చెబుతున్నారు.

వీరి డెడ్ బాడీస్ గుర్తు పట్టలేనంతగా కాలిపోవటంతో.. కార్ పూలింగ్ ద్వారా యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మరణించిన వారి వివరాలు ఆధారంగా వారిని గుర్తించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.

This post was last modified on September 4, 2024 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

6 minutes ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

48 minutes ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

1 hour ago

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…

2 hours ago

IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…

3 hours ago

దారి తప్పుతున్న కంటెంట్లు – ఎవరు బాధ్యులు

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…

3 hours ago