Trends

టెక్సాస్ స్టేట్ రోడ్డు ప్రమాదంలో మనోళ్లు నలుగురు దుర్మరణం

నాలుగు నిండుప్రాణాల్ని తీసింది రోడ్డు యాక్సిడెంట్. ఉన్నత విద్య కోసం.. డాలర్ డ్రీమ్స్ ను తీర్చుకోవటానికి అమెరికాకు వెళ్లిన నలుగురు భారతీయులు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రం తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘనాథ్.. ఫరూఖ్.. లోకేశ్ లతో పాటు తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ నలుగురు కార్ పూలింగ్ ద్వారా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. బెన్ టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒక వాహనంలో బయలుదేరారు.

అనూహ్యంగా వరుసగా 5 వాహనాలు ఒకదానికి ఒకటి అతి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. డల్లాస్ లోని బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్, భార్యను కలిసేందుకు బయలుదేరిన లోకేశ్.. విశ్వవిద్యాలయానికి వెళ్తున్న దర్శిని వాసుదేవన్ లతో పాటు ఫరూఖ్ కూడా ఒకే కారులో ఎక్కారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అంటుకోవటంతో కారులో నుంచి బయటకు రాలేకపోయినట్లు చెబుతున్నారు.

వీరి డెడ్ బాడీస్ గుర్తు పట్టలేనంతగా కాలిపోవటంతో.. కార్ పూలింగ్ ద్వారా యాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మరణించిన వారి వివరాలు ఆధారంగా వారిని గుర్తించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.

This post was last modified on September 4, 2024 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…

2 hours ago

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో…

4 hours ago

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

6 hours ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

6 hours ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

7 hours ago

‘శ్రీవారి ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిపారు’

అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నిలువునా మోసం చేసింద‌ని ఏపీ సీఎం…

7 hours ago