ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే.. నాయకులు ముందుకు రావాలి. నాయకులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు రావడం కాదు! ఇదీ.. రాజకీయంగా ఎవరైనా చెప్పేమాట. కానీ.. అదేంటో కానీ.. వైసీపీలో మాత్రం ఈ తరహా రాజకీయం ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఏపీ మొత్తం కాకపోయినా.. దాదాపు 5 జిల్లాలు ప్రస్తుతం నీటి దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు రాత్రులు, మూడు పగళ్లుగా వరదలో చిక్కుకున్నవారు అలమటిస్తున్నారు. తమకు కనీసం ఆహారం అందించినా.. చాలని అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో సర్కారు తరఫున శాయశక్తులా పని చేస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
మరి ప్రతి పక్షం వైసీపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరైనా.. వచ్చారా? ఆపన్నులకు ఆదరంగా నిలిచారా? మేమున్నాంటూ.. ముందుకు వచ్చి సాయం చేయగలిగారా? అంటే.. లేదనే చెప్పాలి. ఎక్కడా కూడా వైసీపీ నాయకులు ముందుకు వచ్చిన పరిస్థి తి అయితే కనిపించలేదు. ప్రభుత్వం పోయి.. కేవలం మూడుమాసాలే అయింది. ఇంతలోనే ప్రజలు అంత వెగటు కొట్టేశా రా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. విజయవాడలో పూర్తిగా వరద నీరు చేరుకుని.. శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలుబిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
ఇలాంటి వారికి ఇప్పుడు కావాల్సింది .. రాజకీయాలు కాదు. సాయం! అది ఎవరు చేసినా ఓకే. కానీ, వైసీపీ నాయకులు మాత్రం మాకు ఓటేయలేదు కదా.. మేమెందుకు చేస్తాం అన్నట్టుగా విజయవాడ నాయకులు వ్యవహరిస్తున్నారు. నిజానికి బలైమన నాయకులు విజయవాడలో ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఎమ్మెల్యేలుగా చేసిన వారే. కానీ, వారి ప్రాంతాలే మునిగిపోయినా.. వారిద్దరూ ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కనీసం బాధితులను పరామర్శించేందుకు కూడా ఇద్దరూ ముందుకు రాలేదు. కేవలం సీఎం జగన్ పర్యటనలో అలా కనిపించి.. ఇలా మాయమయ్యారు. మరి ఇలా ఉంటే.. వారికి భవిష్యత్తులోనూ ప్రజలు ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న రాదా?! నాయకులు ఆలోచించుకోవాలి.
This post was last modified on September 3, 2024 10:04 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…