ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే.. నాయకులు ముందుకు రావాలి. నాయకులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు రావడం కాదు! ఇదీ.. రాజకీయంగా ఎవరైనా చెప్పేమాట. కానీ.. అదేంటో కానీ.. వైసీపీలో మాత్రం ఈ తరహా రాజకీయం ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఏపీ మొత్తం కాకపోయినా.. దాదాపు 5 జిల్లాలు ప్రస్తుతం నీటి దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు రాత్రులు, మూడు పగళ్లుగా వరదలో చిక్కుకున్నవారు అలమటిస్తున్నారు. తమకు కనీసం ఆహారం అందించినా.. చాలని అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో సర్కారు తరఫున శాయశక్తులా పని చేస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
మరి ప్రతి పక్షం వైసీపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరైనా.. వచ్చారా? ఆపన్నులకు ఆదరంగా నిలిచారా? మేమున్నాంటూ.. ముందుకు వచ్చి సాయం చేయగలిగారా? అంటే.. లేదనే చెప్పాలి. ఎక్కడా కూడా వైసీపీ నాయకులు ముందుకు వచ్చిన పరిస్థి తి అయితే కనిపించలేదు. ప్రభుత్వం పోయి.. కేవలం మూడుమాసాలే అయింది. ఇంతలోనే ప్రజలు అంత వెగటు కొట్టేశా రా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. విజయవాడలో పూర్తిగా వరద నీరు చేరుకుని.. శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలుబిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
ఇలాంటి వారికి ఇప్పుడు కావాల్సింది .. రాజకీయాలు కాదు. సాయం! అది ఎవరు చేసినా ఓకే. కానీ, వైసీపీ నాయకులు మాత్రం మాకు ఓటేయలేదు కదా.. మేమెందుకు చేస్తాం అన్నట్టుగా విజయవాడ నాయకులు వ్యవహరిస్తున్నారు. నిజానికి బలైమన నాయకులు విజయవాడలో ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు ఎమ్మెల్యేలుగా చేసిన వారే. కానీ, వారి ప్రాంతాలే మునిగిపోయినా.. వారిద్దరూ ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కనీసం బాధితులను పరామర్శించేందుకు కూడా ఇద్దరూ ముందుకు రాలేదు. కేవలం సీఎం జగన్ పర్యటనలో అలా కనిపించి.. ఇలా మాయమయ్యారు. మరి ఇలా ఉంటే.. వారికి భవిష్యత్తులోనూ ప్రజలు ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న రాదా?! నాయకులు ఆలోచించుకోవాలి.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…
ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…
అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…