Trends

గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌న రోజా షాకింగ్ కామెంట్స్‌

వైసీపీ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై తాజాగా రోజా స్పందించారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్న రోజా.. అనంత‌రం మీడియా తో మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌నతో సిగ్గు ప‌డాల‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం మౌనంగా ఉంద‌ని విమ‌ర్శించారు. గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌న స‌భ్య‌స‌మాజానికి మాయ‌ని మ‌చ్చ‌గా మారిపోయింద‌న్నారు.

ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ చేయ‌కుండానే కెమెరాలు ఏమీ క‌నిపించ‌లేద‌ని ఎస్పీతో స‌ర్టిపికేట్ ఇప్పించార‌ని రోజా దుయ్య‌బ‌ట్టారు. ఈ రోజు నేర‌స్తుల‌కు ఇంత ధైర్యం ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిం చారు. దీనికి ప్ర‌భుత్వం సిగ్గుప‌డాల‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిం చేందుకు స‌రైన కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాల‌ని సూచించారు. గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన దిశ పోలీసు స్టేష‌న్ల‌ను నిర్వీర్యం చేశార‌ని.. దిశ యాప్‌లు తీసేశార‌ని అన్నారు.

దిశ యాప్ ఉండి ఉంటే.. స్టూడెంట్స్ ఫిర్యాదు చేసేందుకు అవ‌కాశం ఉండేద‌న్నారు. కానీ, గ‌తంలో వైసీపీ హ‌యాంలో రోజా ఏవిధంగా అయితే.. తిరుమ‌ల ద‌ర్శ‌నాలు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా ద‌ర్శ‌నాలుచేసుకున్నార‌నేది ప్ర‌స్తుతం వినిపిస్తున్న విమ‌ర్శ‌. తాజాగా త‌న‌తో 20 మందిని తీసుకు ని ప్రొటోకాల్ ద‌ర్శ‌నం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి. అయితే.. దీనిపై రోజా స్పందించ‌లేదు. ద‌ర్శ‌నం చేసుకుంటే త‌ప్పులేదు క‌దా! అన్నారు. 

This post was last modified on September 1, 2024 1:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉచితాల‌తో `బ‌ద్ధ‌క‌స్తు`ల‌ను పెంచుతున్నారు: సుప్రీం సీరియ‌స్‌

``ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. స‌మాజంలో బ‌ద్ధ‌క‌స్తుల‌ను పెంచుతున్నాయి. ఇది స‌రికాదు. స‌మాజంలో ప‌నిచేసే వారు త‌గ్గిపోతున్నారు.…

28 minutes ago

‘తండేల్’ బౌండరీ దాటలేకపోయినట్టేనా?

బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…

58 minutes ago

తులసిబాబుకు రూ.48 లక్షలు!.. ఎందుకిచ్చారంటే..?

కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…

2 hours ago

తమిళ స్టార్‌ను మనోళ్లే కాపాడాలి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…

2 hours ago

విజిలెన్స్ రిపోర్ట్ రెడీ!… పెద్దిరెడ్డి ఆక్రమణలు నిజమేనా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…

3 hours ago

‘సైబర్ క్రైమ్’కు పృథ్వీరాజ్.. ఇంటరెస్టింగ్ కామెంట్స్

సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం…

3 hours ago