వైసీపీ నాయకురాలు, జబర్దస్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై తాజాగా రోజా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా.. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఘటనతో సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటన సభ్యసమాజానికి మాయని మచ్చగా మారిపోయిందన్నారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే కెమెరాలు ఏమీ కనిపించలేదని ఎస్పీతో సర్టిపికేట్ ఇప్పించారని రోజా దుయ్యబట్టారు. ఈ రోజు నేరస్తులకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిం చారు. దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిం చేందుకు సరైన కార్యాచరణను ప్రకటించాలని సూచించారు. గతంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ పోలీసు స్టేషన్లను నిర్వీర్యం చేశారని.. దిశ యాప్లు తీసేశారని అన్నారు.
దిశ యాప్ ఉండి ఉంటే.. స్టూడెంట్స్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ, గతంలో వైసీపీ హయాంలో రోజా ఏవిధంగా అయితే.. తిరుమల దర్శనాలు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా దర్శనాలుచేసుకున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శ. తాజాగా తనతో 20 మందిని తీసుకు ని ప్రొటోకాల్ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి. అయితే.. దీనిపై రోజా స్పందించలేదు. దర్శనం చేసుకుంటే తప్పులేదు కదా! అన్నారు.
This post was last modified on September 1, 2024 1:26 am
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…