వైసీపీ నాయకురాలు, జబర్దస్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై తాజాగా రోజా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా.. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఘటనతో సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటన సభ్యసమాజానికి మాయని మచ్చగా మారిపోయిందన్నారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే కెమెరాలు ఏమీ కనిపించలేదని ఎస్పీతో సర్టిపికేట్ ఇప్పించారని రోజా దుయ్యబట్టారు. ఈ రోజు నేరస్తులకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిం చారు. దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిం చేందుకు సరైన కార్యాచరణను ప్రకటించాలని సూచించారు. గతంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ పోలీసు స్టేషన్లను నిర్వీర్యం చేశారని.. దిశ యాప్లు తీసేశారని అన్నారు.
దిశ యాప్ ఉండి ఉంటే.. స్టూడెంట్స్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ, గతంలో వైసీపీ హయాంలో రోజా ఏవిధంగా అయితే.. తిరుమల దర్శనాలు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా దర్శనాలుచేసుకున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శ. తాజాగా తనతో 20 మందిని తీసుకు ని ప్రొటోకాల్ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి. అయితే.. దీనిపై రోజా స్పందించలేదు. దర్శనం చేసుకుంటే తప్పులేదు కదా! అన్నారు.
This post was last modified on September 1, 2024 1:26 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…