వైసీపీ నాయకురాలు, జబర్దస్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై తాజాగా రోజా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా.. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఘటనతో సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటన సభ్యసమాజానికి మాయని మచ్చగా మారిపోయిందన్నారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే కెమెరాలు ఏమీ కనిపించలేదని ఎస్పీతో సర్టిపికేట్ ఇప్పించారని రోజా దుయ్యబట్టారు. ఈ రోజు నేరస్తులకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిం చారు. దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిం చేందుకు సరైన కార్యాచరణను ప్రకటించాలని సూచించారు. గతంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ పోలీసు స్టేషన్లను నిర్వీర్యం చేశారని.. దిశ యాప్లు తీసేశారని అన్నారు.
దిశ యాప్ ఉండి ఉంటే.. స్టూడెంట్స్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ, గతంలో వైసీపీ హయాంలో రోజా ఏవిధంగా అయితే.. తిరుమల దర్శనాలు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా దర్శనాలుచేసుకున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శ. తాజాగా తనతో 20 మందిని తీసుకు ని ప్రొటోకాల్ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి. అయితే.. దీనిపై రోజా స్పందించలేదు. దర్శనం చేసుకుంటే తప్పులేదు కదా! అన్నారు.
This post was last modified on September 1, 2024 1:26 am
యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే…
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో హిందీ ‘గజిని’ ఒకటి. హాలీవుడ్ మూవీ ‘మొమెంటో’ స్ఫూర్తితో తమిళంలో సూర్య…
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…