Trends

గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌న రోజా షాకింగ్ కామెంట్స్‌

వైసీపీ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై తాజాగా రోజా స్పందించారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్న రోజా.. అనంత‌రం మీడియా తో మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌నతో సిగ్గు ప‌డాల‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం మౌనంగా ఉంద‌ని విమ‌ర్శించారు. గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌న స‌భ్య‌స‌మాజానికి మాయ‌ని మ‌చ్చ‌గా మారిపోయింద‌న్నారు.

ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ చేయ‌కుండానే కెమెరాలు ఏమీ క‌నిపించ‌లేద‌ని ఎస్పీతో స‌ర్టిపికేట్ ఇప్పించార‌ని రోజా దుయ్య‌బ‌ట్టారు. ఈ రోజు నేర‌స్తుల‌కు ఇంత ధైర్యం ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిం చారు. దీనికి ప్ర‌భుత్వం సిగ్గుప‌డాల‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిం చేందుకు స‌రైన కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాల‌ని సూచించారు. గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన దిశ పోలీసు స్టేష‌న్ల‌ను నిర్వీర్యం చేశార‌ని.. దిశ యాప్‌లు తీసేశార‌ని అన్నారు.

దిశ యాప్ ఉండి ఉంటే.. స్టూడెంట్స్ ఫిర్యాదు చేసేందుకు అవ‌కాశం ఉండేద‌న్నారు. కానీ, గ‌తంలో వైసీపీ హ‌యాంలో రోజా ఏవిధంగా అయితే.. తిరుమ‌ల ద‌ర్శ‌నాలు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా ద‌ర్శ‌నాలుచేసుకున్నార‌నేది ప్ర‌స్తుతం వినిపిస్తున్న విమ‌ర్శ‌. తాజాగా త‌న‌తో 20 మందిని తీసుకు ని ప్రొటోకాల్ ద‌ర్శ‌నం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి. అయితే.. దీనిపై రోజా స్పందించ‌లేదు. ద‌ర్శ‌నం చేసుకుంటే త‌ప్పులేదు క‌దా! అన్నారు. 

This post was last modified on September 1, 2024 1:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

46 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago