వైసీపీ నాయకురాలు, జబర్దస్త్ రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై తాజాగా రోజా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న రోజా.. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఘటనతో సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు.. దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటన సభ్యసమాజానికి మాయని మచ్చగా మారిపోయిందన్నారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయకుండానే కెమెరాలు ఏమీ కనిపించలేదని ఎస్పీతో సర్టిపికేట్ ఇప్పించారని రోజా దుయ్యబట్టారు. ఈ రోజు నేరస్తులకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిం చారు. దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిం చేందుకు సరైన కార్యాచరణను ప్రకటించాలని సూచించారు. గతంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ పోలీసు స్టేషన్లను నిర్వీర్యం చేశారని.. దిశ యాప్లు తీసేశారని అన్నారు.
దిశ యాప్ ఉండి ఉంటే.. స్టూడెంట్స్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ, గతంలో వైసీపీ హయాంలో రోజా ఏవిధంగా అయితే.. తిరుమల దర్శనాలు చేసుకున్నారో.. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా దర్శనాలుచేసుకున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న విమర్శ. తాజాగా తనతో 20 మందిని తీసుకు ని ప్రొటోకాల్ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి. అయితే.. దీనిపై రోజా స్పందించలేదు. దర్శనం చేసుకుంటే తప్పులేదు కదా! అన్నారు.
This post was last modified on September 1, 2024 1:26 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…