ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది. ఆమెకు ఫ్రీహ్యాండ్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. వైఎస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో ఆయనకు ఫ్రీహ్యాండ్ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. కాబట్టి.. ఇప్పుడు నాకు కూడా.. ఫ్రీహ్యాండ్ కావాలి. నేను తీసుకునే నిర్ణయాలకు క్షేత్రస్థాయి నాయకులు ఆమోదం తెలపాలి. అప్పుడే పార్టీ పుంజుకుంటుంది అని షర్మిల తేల్చిచెబుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే షర్మిల తన డిమాండ్ను అధిష్టానం ముందు పెట్టారని కూడా సమాచారం. ఈ విషయంపై అధిష్టానం నుంచి ఇంకా పూర్తి నిర్ణయం వెలువడలేదు. అందుకే.. షర్మిల సైలెంట్ అయ్యారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇంతకు ముందు.. రోజూ ఏదో ఒక అంశంతో ఆమె ప్రజల మధ్య ఉన్నారు. వైసీపీని విమర్శిస్తూ.. ప్రభుత్వ సూపర్ సిక్స్ను ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిం చారు. కానీ.. గత నెల రోజులకు పైగా షర్మిల సైలెంట్గా ఉంటూ.. తన రాజకీయం తాను చేస్తున్నారు.
ఈ పరిణామాల వెనుక అధిష్టానం షర్మిల విషయంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదనే వినిపిస్తోంది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపడం లేదని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇలా ఫ్రీహ్యాండ్ ఇస్తే.. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు .. జంప్ అయ్యే అవకాశం లేదా.. ఏకండా రాజకీయాలకు కూడా దూరమయ్యే అవకాశం మెండుగా ఉందని భావిస్తున్నారు. అందుకే ఇవ్వడం లేదన్నది ఒక టాక్. మరో మాట ఏంటంటే.. అప్పట్లో రాజశేఖరరెడ్డికి 30 ఏళ్లకుపైగానే అనుభవం ఉన్నదరిమిలా.. ఆయన నెట్టుకువచ్చారనేది.
అంటే.. కాంగ్రెస్ పార్టీ అంటేనే.. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. సో.. ఆ పార్టీ లో ఎవరూ ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వరు. ఏ చిన్న సమస్య వచ్చినా.. నేరుగా అధిష్టానానికి చెబుతారు. వీటిని లోకల్గానే సర్దుబాటు చేయాలంటే.. వైఎస్కు ఉన్నంత అనుభవమైనా ఉండాలి. లేదా.. ఆయనకు ఉన్న రాజకీయ చతురతైనా ఉండాలి. కానీ, వైఎస్కు వారసురాలిగా చెబుతున్న షర్మిలలో ఈ రెండూ లేవు. నోటికి వచ్చింది. మాట్లాడేయడమే తప్ప.. ఆలోచన లేదు. పైగా.. సీనియర్లంటే.. ఆమెకు గిట్టరన్న వాదన కూడా ఉంది. ఈ పరిణామాలతోనే చాలా మంది నాయకులు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.
ఇప్పుడు ఆమెకే కనుక ఫ్రీహ్యాండిస్తే.. పార్టీ పుంజుకోవడం మాట ఎలా ఉన్నా.. మరింత ఇబ్బంది పడుతుందన్నది అధిష్టానం ఆలోచనగా ఉందని సీనియర్లు భావిస్తున్నారు. అందుకే.. ఆమె డిమాండ్ పై పునరాలోచనలో పడ్డారన్నది వినిపిస్తున్న వాదన. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ తన డిమాండ్ను పట్టించుకోకపోతే.. షర్మిలకు ప్లాన్-బి రెడీగా ఉందన్నది సీనియర్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 9, 2024 10:40 am
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…