వైసీపీకి రాజీనామా చేయనున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. జగన్.. తనకు ఎన్నో పదవులు ఇచ్చారని.. అయినా.. ఆయనను తాను మోసం చేసి ఇప్పుడు పార్టీ మారుతున్నానన్న వైసీపీ నేతలకు తాను బదులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో జగన్ కోసం తాను ఎన్ని త్యాగాలుచేశానో.. వీరికి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోపిదేవి మాట్లాడుతూ.. తన రాజీనామాను సమర్థించుకున్నారు.
ఎన్నికల సమయంలో తాను టికెట్ అడిగితే.. కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే జగన్ ఇవ్వ నని కటువుగా చెప్పేశారని.. అప్పుడే తాను పార్టీకి రాజీనామా చేయాలని భావించానని మోపిదేవి వివరిం చారు. కానీ, జగన్ మారతారేమోనని తాను ఎదురు చూసినట్టు చెప్పారు. ఇక, మార్పు రాదని నిర్ణయించు కున్న తర్వాత.. తానే మారాలని భావించినట్టు తెలిపారు. తన కోసం.. జగన్ చేసిన త్యాగాలేమీ లేవన్నారు . తానే అనేక త్యాగాలు చేశానని.. ఇప్పుడు అవన్నీ చెబితే బాగోదని వ్యాఖ్యానించారు.
తాను రాజీనామాచేయడం సరైన చర్యేనని మోపిదేవి చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం బాగు పడుతుందన్న ఏకైక ఉద్దేశంతోనే తాను పార్టీ మారుతున్నట్టు తెలిపారు. రాజీనామా నిర్ణయాన్ని తన అనుచరులతో చర్చించిన తర్వాతే తీసుకున్నట్టు తెలిపారు. అయితే.. వైసీపీకి రాజీనామా చేయడం తనకు ఏమీ బాధకలిగించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం అన్ని విధాలా బాగవుతుంటే.. చంద్రబాబుకు మద్దతివ్వక ఎవరికి ఇవ్వాలని ఎదురు ప్రశ్నించారు.
ఏంటీ త్యాగాలు!
మోపిదేవి చెప్పినట్టు.. జగన్ కోసం ఆయన చేసిన త్యాగాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న మోపిదేవి.. అప్పట్లో వాన్పిక్ భూముల కుంభకోణంలో చిక్కుకున్నారు. వాన్పిక్ సంస్థకు తక్కువ ధరలకు భూములు లీజులు ఇచ్చారు. ప్రతిగా ఈ సంస్థ జగన్ సంస్థలకు పెట్టుబడులు సమకూర్చిందనేది సీబీఐ కేసు. ఈ కేసులోనే అప్పట్లో అనుమతులు మంజూరు చేశారన్న కారణంగా.. మోపిదేవిని అరెస్టు చేసి.. జైల్లో పెట్టారు. సుదీర్ఘకాలం జైలు జీవితం తర్వాత.. ఆయనకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. బహుశ ఆయన ఉద్దేశంలో ఇదే త్యాగమై ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
This post was last modified on August 29, 2024 10:45 pm
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…
సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం…