వైసీపీకి రాజీనామా చేయనున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. జగన్.. తనకు ఎన్నో పదవులు ఇచ్చారని.. అయినా.. ఆయనను తాను మోసం చేసి ఇప్పుడు పార్టీ మారుతున్నానన్న వైసీపీ నేతలకు తాను బదులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో జగన్ కోసం తాను ఎన్ని త్యాగాలుచేశానో.. వీరికి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోపిదేవి మాట్లాడుతూ.. తన రాజీనామాను సమర్థించుకున్నారు.
ఎన్నికల సమయంలో తాను టికెట్ అడిగితే.. కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే జగన్ ఇవ్వ నని కటువుగా చెప్పేశారని.. అప్పుడే తాను పార్టీకి రాజీనామా చేయాలని భావించానని మోపిదేవి వివరిం చారు. కానీ, జగన్ మారతారేమోనని తాను ఎదురు చూసినట్టు చెప్పారు. ఇక, మార్పు రాదని నిర్ణయించు కున్న తర్వాత.. తానే మారాలని భావించినట్టు తెలిపారు. తన కోసం.. జగన్ చేసిన త్యాగాలేమీ లేవన్నారు . తానే అనేక త్యాగాలు చేశానని.. ఇప్పుడు అవన్నీ చెబితే బాగోదని వ్యాఖ్యానించారు.
తాను రాజీనామాచేయడం సరైన చర్యేనని మోపిదేవి చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం బాగు పడుతుందన్న ఏకైక ఉద్దేశంతోనే తాను పార్టీ మారుతున్నట్టు తెలిపారు. రాజీనామా నిర్ణయాన్ని తన అనుచరులతో చర్చించిన తర్వాతే తీసుకున్నట్టు తెలిపారు. అయితే.. వైసీపీకి రాజీనామా చేయడం తనకు ఏమీ బాధకలిగించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం అన్ని విధాలా బాగవుతుంటే.. చంద్రబాబుకు మద్దతివ్వక ఎవరికి ఇవ్వాలని ఎదురు ప్రశ్నించారు.
ఏంటీ త్యాగాలు!
మోపిదేవి చెప్పినట్టు.. జగన్ కోసం ఆయన చేసిన త్యాగాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న మోపిదేవి.. అప్పట్లో వాన్పిక్ భూముల కుంభకోణంలో చిక్కుకున్నారు. వాన్పిక్ సంస్థకు తక్కువ ధరలకు భూములు లీజులు ఇచ్చారు. ప్రతిగా ఈ సంస్థ జగన్ సంస్థలకు పెట్టుబడులు సమకూర్చిందనేది సీబీఐ కేసు. ఈ కేసులోనే అప్పట్లో అనుమతులు మంజూరు చేశారన్న కారణంగా.. మోపిదేవిని అరెస్టు చేసి.. జైల్లో పెట్టారు. సుదీర్ఘకాలం జైలు జీవితం తర్వాత.. ఆయనకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. బహుశ ఆయన ఉద్దేశంలో ఇదే త్యాగమై ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
This post was last modified on August 29, 2024 10:45 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…