సినిమాలతో పాటు వివిధ రంగాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల గురించి కొన్నేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఒక దశలో ‘మీ టూ’ పేరుతో ఉద్యమం పతాక స్థాయిలో సాగింది. అందుకు ప్రధాన కారణం.. ఓ మళయాల స్టార్ హీరోయిన్ మీద ఒక హీరో కక్ష గట్టి తన అనుచరులతో ఆమెను కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులు చేయించడం. అప్పుడు మొదలైన ఈ ఉద్యమం ఒక రెండేళ్ల పాటు సినీ రంగాన్ని కుదిపేసింది.
ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న అనేకమంది బాగోతాలు ఈ క్రమంలో వెలుగులోకి వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ చట్టపరంగా శిక్ష పడి ఉండకపోవచ్చు కానీ.. వాళ్ల ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. అదే సమయంలో ఇదే అదనుగా ఫేక్ ఆరోపణలు చేసిన అమ్మాయిలు కూడా ఉన్న మాట వాస్తవం.
కాగా తమిళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి హేమ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక అక్కడ ప్రకంపనలు రేపుతోంది. మాలీవుడ్లో వ్యవస్థీకృతంగా మారిన లైంగిక వేధింపుల గురించి ఆ కమిటీలో సంచలన విషయాలు పేర్కొన్నారు.
ఈ నివేదిక బయటికి వచ్చిన సమయంలోనే మరింత మంది ఇండస్ట్రీ మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దల గుట్టును బయటపెట్టారు. మలయాళలో ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధిఖ్ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు, మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవిని వదులుకున్నారు. ఇటీవలే బెంగాలి నటి శ్రీలేఖ మిత్ర.. తనతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు రావడం.. ఖండించి ఊరుకోవడం మామూలే కానీ.. ఇలా పెద్ద పదవుల్లో ఉన్న ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి రావడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on August 26, 2024 6:21 pm
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…