సినిమాలతో పాటు వివిధ రంగాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల గురించి కొన్నేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఒక దశలో ‘మీ టూ’ పేరుతో ఉద్యమం పతాక స్థాయిలో సాగింది. అందుకు ప్రధాన కారణం.. ఓ మళయాల స్టార్ హీరోయిన్ మీద ఒక హీరో కక్ష గట్టి తన అనుచరులతో ఆమెను కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులు చేయించడం. అప్పుడు మొదలైన ఈ ఉద్యమం ఒక రెండేళ్ల పాటు సినీ రంగాన్ని కుదిపేసింది.
ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న అనేకమంది బాగోతాలు ఈ క్రమంలో వెలుగులోకి వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ చట్టపరంగా శిక్ష పడి ఉండకపోవచ్చు కానీ.. వాళ్ల ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. అదే సమయంలో ఇదే అదనుగా ఫేక్ ఆరోపణలు చేసిన అమ్మాయిలు కూడా ఉన్న మాట వాస్తవం.
కాగా తమిళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి హేమ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక అక్కడ ప్రకంపనలు రేపుతోంది. మాలీవుడ్లో వ్యవస్థీకృతంగా మారిన లైంగిక వేధింపుల గురించి ఆ కమిటీలో సంచలన విషయాలు పేర్కొన్నారు.
ఈ నివేదిక బయటికి వచ్చిన సమయంలోనే మరింత మంది ఇండస్ట్రీ మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దల గుట్టును బయటపెట్టారు. మలయాళలో ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధిఖ్ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు, మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవిని వదులుకున్నారు. ఇటీవలే బెంగాలి నటి శ్రీలేఖ మిత్ర.. తనతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు రావడం.. ఖండించి ఊరుకోవడం మామూలే కానీ.. ఇలా పెద్ద పదవుల్లో ఉన్న ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి రావడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on August 26, 2024 6:21 pm
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…
సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం…