సినిమాలతో పాటు వివిధ రంగాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల గురించి కొన్నేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఒక దశలో ‘మీ టూ’ పేరుతో ఉద్యమం పతాక స్థాయిలో సాగింది. అందుకు ప్రధాన కారణం.. ఓ మళయాల స్టార్ హీరోయిన్ మీద ఒక హీరో కక్ష గట్టి తన అనుచరులతో ఆమెను కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులు చేయించడం. అప్పుడు మొదలైన ఈ ఉద్యమం ఒక రెండేళ్ల పాటు సినీ రంగాన్ని కుదిపేసింది.
ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న అనేకమంది బాగోతాలు ఈ క్రమంలో వెలుగులోకి వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ చట్టపరంగా శిక్ష పడి ఉండకపోవచ్చు కానీ.. వాళ్ల ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. అదే సమయంలో ఇదే అదనుగా ఫేక్ ఆరోపణలు చేసిన అమ్మాయిలు కూడా ఉన్న మాట వాస్తవం.
కాగా తమిళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి హేమ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక అక్కడ ప్రకంపనలు రేపుతోంది. మాలీవుడ్లో వ్యవస్థీకృతంగా మారిన లైంగిక వేధింపుల గురించి ఆ కమిటీలో సంచలన విషయాలు పేర్కొన్నారు.
ఈ నివేదిక బయటికి వచ్చిన సమయంలోనే మరింత మంది ఇండస్ట్రీ మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దల గుట్టును బయటపెట్టారు. మలయాళలో ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధిఖ్ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు, మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవిని వదులుకున్నారు. ఇటీవలే బెంగాలి నటి శ్రీలేఖ మిత్ర.. తనతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు రావడం.. ఖండించి ఊరుకోవడం మామూలే కానీ.. ఇలా పెద్ద పదవుల్లో ఉన్న ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి రావడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on August 26, 2024 6:21 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…