సినిమాలతో పాటు వివిధ రంగాల్లో మహిళల మీద లైంగిక వేధింపుల గురించి కొన్నేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఒక దశలో ‘మీ టూ’ పేరుతో ఉద్యమం పతాక స్థాయిలో సాగింది. అందుకు ప్రధాన కారణం.. ఓ మళయాల స్టార్ హీరోయిన్ మీద ఒక హీరో కక్ష గట్టి తన అనుచరులతో ఆమెను కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులు చేయించడం. అప్పుడు మొదలైన ఈ ఉద్యమం ఒక రెండేళ్ల పాటు సినీ రంగాన్ని కుదిపేసింది.
ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న అనేకమంది బాగోతాలు ఈ క్రమంలో వెలుగులోకి వచ్చాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ చట్టపరంగా శిక్ష పడి ఉండకపోవచ్చు కానీ.. వాళ్ల ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. అదే సమయంలో ఇదే అదనుగా ఫేక్ ఆరోపణలు చేసిన అమ్మాయిలు కూడా ఉన్న మాట వాస్తవం.
కాగా తమిళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి హేమ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక అక్కడ ప్రకంపనలు రేపుతోంది. మాలీవుడ్లో వ్యవస్థీకృతంగా మారిన లైంగిక వేధింపుల గురించి ఆ కమిటీలో సంచలన విషయాలు పేర్కొన్నారు.
ఈ నివేదిక బయటికి వచ్చిన సమయంలోనే మరింత మంది ఇండస్ట్రీ మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దల గుట్టును బయటపెట్టారు. మలయాళలో ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధిఖ్ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు, మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవిని వదులుకున్నారు. ఇటీవలే బెంగాలి నటి శ్రీలేఖ మిత్ర.. తనతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆరోపణలు రావడం.. ఖండించి ఊరుకోవడం మామూలే కానీ.. ఇలా పెద్ద పదవుల్లో ఉన్న ప్రముఖులు తమ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి రావడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on August 26, 2024 6:21 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…