బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన, అలాగే గౌరవనీయ వ్యక్తుల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో ఒక సమయంలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్న్నాడు ఆమిర్. కానీ ఆయన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. తన తర్వాతి చిత్రంతో ఆమిర్ బలంగా పుంజుకుంటాడని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఇక ఆమిర్ వ్యక్తిగత జీవితం కూడా తరచూ చర్చనీయాంశం అవుతుంటుంది.
రీనా దత్తాను వివాహమాడి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆమిర్.. తర్వాత ఆమె నుంచి విడిపోయి కిరణ్ రావును పెళ్లాడాడు. దాదాపు దశాబ్దం పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆమె నుంచి కూడా ఆమిర్ విడిపోయాడు. కానీ కిరణ్ నుంచి విడిపోయాక కూడా ఆమెతో కలిసి సినిమాల కోసం పని చేస్తుండడం విశేషం. మరి ఆమిర్ కొత్తగా మరో పెళ్లి చేసుకుంటాడా అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది. ఈ ప్రశ్నకు బదులివ్వడంతో పాటు తన మాజీ భార్యలతో సంబంధాల గురించి ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘‘వైవాహిక జీవితంలో నేను రెండుసార్లు విఫలమయ్యాను. కాబట్టి ఎవరైనా పెళ్లి గురించి నన్ను సూచనలు అడక్కపోవడం మంచిది. ఒక బంధం సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనం చెప్పలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. నిజానికి నాకు ఒంటరిగా జీవించడం ఇష్టముండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలనే కోరుకుంటా. ఒకరితో కలిసి ఉ:డడం.. కష్టసుఖాలు పంచుకోవడం నాకిష్టం. కానీ కొన్ని కారణాల వల్ల నా వైవాహిక బంధాలు నిలబడలేదు.
కానీ నా మాజీ భార్యలు రీనా, కిరణ్ ఇద్దరితోనూ నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. నా దృష్టిలో మేమంతా ఒకే కుటుంబం. నాకిప్పుడు 59 ఏళ్లు. ఈ వయసులో మళ్లీ పెళ్లి అంటే కష్టంగా ఉంటుంది. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబం, పిల్లలు, స్నేహులతో రీకనెక్ట్ అవుతున్నాను. నాకెంతో ఇష్టమైన సమయాన్ని వారితో ఆస్వాదిస్తున్నా. అందుకు ఆనందంగా ఉన్నాను. అందరికీ నచ్చేలా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’ అని ఆమిర్ చెప్పాడు.
This post was last modified on August 26, 2024 6:22 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…