బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన, అలాగే గౌరవనీయ వ్యక్తుల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో ఒక సమయంలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్న్నాడు ఆమిర్. కానీ ఆయన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. తన తర్వాతి చిత్రంతో ఆమిర్ బలంగా పుంజుకుంటాడని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఇక ఆమిర్ వ్యక్తిగత జీవితం కూడా తరచూ చర్చనీయాంశం అవుతుంటుంది.
రీనా దత్తాను వివాహమాడి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆమిర్.. తర్వాత ఆమె నుంచి విడిపోయి కిరణ్ రావును పెళ్లాడాడు. దాదాపు దశాబ్దం పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆమె నుంచి కూడా ఆమిర్ విడిపోయాడు. కానీ కిరణ్ నుంచి విడిపోయాక కూడా ఆమెతో కలిసి సినిమాల కోసం పని చేస్తుండడం విశేషం. మరి ఆమిర్ కొత్తగా మరో పెళ్లి చేసుకుంటాడా అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది. ఈ ప్రశ్నకు బదులివ్వడంతో పాటు తన మాజీ భార్యలతో సంబంధాల గురించి ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘‘వైవాహిక జీవితంలో నేను రెండుసార్లు విఫలమయ్యాను. కాబట్టి ఎవరైనా పెళ్లి గురించి నన్ను సూచనలు అడక్కపోవడం మంచిది. ఒక బంధం సక్సెస్ అవుతుందా లేదా అన్నది మనం చెప్పలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. నిజానికి నాకు ఒంటరిగా జీవించడం ఇష్టముండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలనే కోరుకుంటా. ఒకరితో కలిసి ఉ:డడం.. కష్టసుఖాలు పంచుకోవడం నాకిష్టం. కానీ కొన్ని కారణాల వల్ల నా వైవాహిక బంధాలు నిలబడలేదు.
కానీ నా మాజీ భార్యలు రీనా, కిరణ్ ఇద్దరితోనూ నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. నా దృష్టిలో మేమంతా ఒకే కుటుంబం. నాకిప్పుడు 59 ఏళ్లు. ఈ వయసులో మళ్లీ పెళ్లి అంటే కష్టంగా ఉంటుంది. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబం, పిల్లలు, స్నేహులతో రీకనెక్ట్ అవుతున్నాను. నాకెంతో ఇష్టమైన సమయాన్ని వారితో ఆస్వాదిస్తున్నా. అందుకు ఆనందంగా ఉన్నాను. అందరికీ నచ్చేలా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’ అని ఆమిర్ చెప్పాడు.
This post was last modified on August 26, 2024 6:22 pm
ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం…
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…