Trends

స‌ర్కారుకు హైడ్రా నివేదిక‌.. సంచ‌ల‌న విష‌యాలు ఇవీ!

గ‌త కొన్నాళ్లుగా హైద‌రాబాద్ లో ఆక్ర‌మ‌ణ దారుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్న హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మేనేజ్‌మెంట్‌, ప్రొటెక్ష‌న్ ఏజేన్సీ(హైడ్రా) తాజాగా ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ ర్పించింది. గ‌త జూన్ 27వ తేదీన రంగంలోకి దిగిన హైడ్రా ప‌లు అక్ర‌మ క‌ట్టడాల‌ను కూల్చి వేయ‌డంతో పాటు.. ఆక్ర‌మిత స్థ‌లాల‌ను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన నివేదిక‌ను హైడ్రా క‌మిష‌న‌ర్, ఐపీఎస్ రంగ‌నాథ్ స‌ర్కారుకు అందించారు. నివేదిలో పేర్కొన్న‌ వివ‌రాలు ఇవీ..

సినీ ఇండ‌స్ట్రీలో..

+ ఫిల్మ్‌నగర్‌ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో ఆక్ర‌మ‌ణ‌కు గురైన  16 గుంటలు స్వాధీనం.

+  ఫిల్మ్ నగర్‌లోని బీజేఆర్ నగర్‌లో 5 ఎకరాలు స్వాధీనం.

+ అమీర్‌పేట, చందానగర్‌ల‌లో 16 గుంటల స్థలం స్వాధీనం.

+ బాచుపల్లిలో 29 గుంటలు, బోడుప్పల్‌ లో 3 గుంటలు స్వాధీనం.

ఇత‌ర ప్రాంతాల్లో..

+  18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

+ 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

+ చెరువులు, బ‌ఫ‌ర్ జోన్ల ఆక్ర‌మ‌ణ‌లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నారు.

+ చింతల్ చెరువును ఆక్ర‌మించిన బీఆర్ ఎస్ నేత‌ రత్నాకరం సాయిరాజుకు చెందిన 54 భ‌వ‌నాల‌ కూల్చివేత‌. త‌ద్వారా.. 3 ఎకరాల 5 గుంటల స్థలం స్వాధీనం.

+ ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని 18 గుంటల భూమి స్వాధీనం.

+ బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్‌లోని బుమురౌఖ్‌ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదంతస్తుల భవనాలు, ఒకటి రెండంతస్తుల భవనంతోపాటు మరో భవనాన్ని కూల్చివేశారు.

+ బ‌హదూర్ పురాలో 12 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం.

ప్ర‌ముఖుల‌కు చెందిన‌వి కూడా..

+ గండిపేటలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, ప్రోకబడ్డి యజమాని అనుపమ ఆక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేశారు.

+ మాదాపూర్‌లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత‌, 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం. 

Satya

Recent Posts

బాలయ్య పుట్టినరోజుకి ఇన్నేసి కానుకలా

ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ…

4 minutes ago

బాలీవుడ్ ఏడుపు… టాలీవుడ్ గ‌ప్‌చుప్‌

బాహుబ‌లి సినిమాను అప్ప‌ట్లో టాలీవుడ్‌ను మించి బాలీవుడ్‌యే ఎక్కువ‌గా మోసింది. అందుక్కార‌ణం అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఆ చిత్రాన్ని…

2 hours ago

పేరు చెడిపోతోంది నానీ…

టాలీవుడ్లో కొన్నేళ్లుగా సినిమాల మేకింగ్ బాగా ఆల‌స్యం అవుతోంది. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌క‌, దాన్ని మార్చ‌కుండా చెప్పిన…

3 hours ago

గులాబీ బాస్ బిగ్ స్కెచ్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని భావిస్తున్న…

3 hours ago

దత్తుగారికి నిద్ర పట్టనివ్వని మెగా మూవీ

టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

6 hours ago

లవర్ కోసం కోటిన్నర కొట్టేసిన యువతి!

జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…

7 hours ago