Trends

వైసీపీలో ఇది చాలదు.. ఇంకా పెంచాల్సిందే..!

ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచ‌నా? అంటే.. ఇంకా కొంచెం పెంచాల్సిందేన‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం సుప్త‌చేత‌నావ‌స్థలో వైసీపీని పుంజుకునేలా చేసేందుకు.. ఒక్క అడుగు అయితే ప‌డింది. పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. రెండు మాసాల‌కు వైసీపీలో మార్పులు చోటు చేసుకు న్నాయి. తాజాగా కొన్ని కీల‌క స్థానాల‌ను మార్పు చేస్తూ.. జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌లువురిని పార్టీ కీల‌క ప‌ద‌వుల్లోకి తీసుకున్నారు.

మ‌రికొంద‌రిని.. జిల్లాల స్థాయిలో అధ్య‌క్షులుగా తీసుకోగా.. ఇంకొంద‌రిని బీసీ, ఎస్సీ, యువ‌జ‌న‌, స్టూడెంట్ విభాగాల్లోకి తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వేంపల్లి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాకు ఛాన్స్ ఇచ్చారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల అనంత‌రం.. రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాము ప‌నులు చేయించ‌లేక పోయామ‌ని అందుకే ఓడిపోయామ‌న్నారు.

అలాంటి రాజాకు కీల‌క‌మైన ప‌ద‌వి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను నియమించారు. వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా సుధాకర్‌బాబు, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించారు. చిరంజీవి విష‌యంలో అనేక అనుమానాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఆయ‌న పార్టీలో ఉంటారా..? ఉండ‌రా? అనేది చ‌ర్చ‌. టికెట్ విష‌యంలో త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని వాపోతున్న ఆయ‌న‌కు తాజాగా ప‌ద‌వి ఇచ్చి.. ప‌గ్గాలు వేసిన‌ట్టు అయింది.

వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా దూలం నాగేశ్వ రరావుకు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్‌ను జగన్ నియ‌మించారు. అయితే.. ఈ మార్పుల‌తో పార్టీలో సంతృప్తి గ్రాఫ్ పెర‌గ‌బోద‌ని అంటున్నారు నాయ‌కులు. మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు చేయాల్సిన‌, తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అప్పుడు మాత్ర‌మే మార్పు సాధ్య‌మ‌ని అంటున్నారు.

This post was last modified on August 24, 2024 6:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago