ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలో ఉండే కొండాపూర్ లో వెలుగు చూసిన ఒక ఉదంతం పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది విదేశీ అమ్మాయిలు ఒకే ప్లాట్ లో ఉండటం.. వారిపై తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన మాదాపూర్ పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు.
కొండాపూర్ లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వీరు చేస్తున్న వ్యభిచారం పూర్తిస్థాయి హైటెక్ రీతిలో ఉందంటున్నారు. కొన్ని చెత్త వెబ్ సైట్లలో..మీకు సమీపంలోనే అమ్మాయిలు ఉన్నారంటూ మెసేజ్ లు పంపుతుంటారు. అలా ఆకర్షిస్తూ. . ఆన్ లైన్ లోనే బేరసారాల్ని పూర్తి చేసే విధానాన్ని వీరు అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందుకోసం విదేశాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి.. కొంతకాలం వారిని ఇక్కడ ఉంచేసి తిరిగి పంపుతారన్నట్లుగా తెలుస్తోంది. వెబ్ సైట్ ద్వారా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 17 మంది విదేశీ అమ్మాయిలు రెండు దేశాలకు చెందిన వారిగా తెలుస్తోంది. వీరిని సేఫ్ హౌస్ కు తరలించారు. తదుపరి విచారణ జరపాల్సి ఉంది.
వీరు ఏ పని మీద మన దేశానికి వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? వీరిని ఎవరైనా ట్రాప్ చేశారా? వీరి వెనుక ఉన్న వారెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఒక వ్యభిచార రాకెట్ లో ఒకేసారి ఇంత మంది విదేశీ అమ్మాయిలు దొరకటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
ఈ మొత్తానికి బాధ్యుడిగా శివకుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. అతడితో పాటు.. ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 25 హెచ్ఐవీ పరీక్ష కిట్లు.. హుక్కా పాట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…