ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలో ఉండే కొండాపూర్ లో వెలుగు చూసిన ఒక ఉదంతం పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది విదేశీ అమ్మాయిలు ఒకే ప్లాట్ లో ఉండటం.. వారిపై తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన మాదాపూర్ పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు.
కొండాపూర్ లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వీరు చేస్తున్న వ్యభిచారం పూర్తిస్థాయి హైటెక్ రీతిలో ఉందంటున్నారు. కొన్ని చెత్త వెబ్ సైట్లలో..మీకు సమీపంలోనే అమ్మాయిలు ఉన్నారంటూ మెసేజ్ లు పంపుతుంటారు. అలా ఆకర్షిస్తూ. . ఆన్ లైన్ లోనే బేరసారాల్ని పూర్తి చేసే విధానాన్ని వీరు అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందుకోసం విదేశాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి.. కొంతకాలం వారిని ఇక్కడ ఉంచేసి తిరిగి పంపుతారన్నట్లుగా తెలుస్తోంది. వెబ్ సైట్ ద్వారా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 17 మంది విదేశీ అమ్మాయిలు రెండు దేశాలకు చెందిన వారిగా తెలుస్తోంది. వీరిని సేఫ్ హౌస్ కు తరలించారు. తదుపరి విచారణ జరపాల్సి ఉంది.
వీరు ఏ పని మీద మన దేశానికి వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? వీరిని ఎవరైనా ట్రాప్ చేశారా? వీరి వెనుక ఉన్న వారెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఒక వ్యభిచార రాకెట్ లో ఒకేసారి ఇంత మంది విదేశీ అమ్మాయిలు దొరకటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
ఈ మొత్తానికి బాధ్యుడిగా శివకుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. అతడితో పాటు.. ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 25 హెచ్ఐవీ పరీక్ష కిట్లు.. హుక్కా పాట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
This post was last modified on August 23, 2024 12:12 pm
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…