ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలో ఉండే కొండాపూర్ లో వెలుగు చూసిన ఒక ఉదంతం పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది విదేశీ అమ్మాయిలు ఒకే ప్లాట్ లో ఉండటం.. వారిపై తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన మాదాపూర్ పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు చేశారు.
కొండాపూర్ లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వీరు చేస్తున్న వ్యభిచారం పూర్తిస్థాయి హైటెక్ రీతిలో ఉందంటున్నారు. కొన్ని చెత్త వెబ్ సైట్లలో..మీకు సమీపంలోనే అమ్మాయిలు ఉన్నారంటూ మెసేజ్ లు పంపుతుంటారు. అలా ఆకర్షిస్తూ. . ఆన్ లైన్ లోనే బేరసారాల్ని పూర్తి చేసే విధానాన్ని వీరు అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందుకోసం విదేశాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి.. కొంతకాలం వారిని ఇక్కడ ఉంచేసి తిరిగి పంపుతారన్నట్లుగా తెలుస్తోంది. వెబ్ సైట్ ద్వారా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 17 మంది విదేశీ అమ్మాయిలు రెండు దేశాలకు చెందిన వారిగా తెలుస్తోంది. వీరిని సేఫ్ హౌస్ కు తరలించారు. తదుపరి విచారణ జరపాల్సి ఉంది.
వీరు ఏ పని మీద మన దేశానికి వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? వీరిని ఎవరైనా ట్రాప్ చేశారా? వీరి వెనుక ఉన్న వారెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఒక వ్యభిచార రాకెట్ లో ఒకేసారి ఇంత మంది విదేశీ అమ్మాయిలు దొరకటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
ఈ మొత్తానికి బాధ్యుడిగా శివకుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. అతడితో పాటు.. ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 25 హెచ్ఐవీ పరీక్ష కిట్లు.. హుక్కా పాట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
This post was last modified on August 23, 2024 12:12 pm
కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్…
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…
వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు…
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…