Trends

అచ్యుతాపురం ట్రాజెడీ.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ

ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఇంకా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరిలోకి చల్లపల్లి హారిక (22) కథ తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె దురదృష్టంకొద్దీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రియాక్టరు పేలుడు సమయంలో ఆమె అసలు విధుల్లోనే ఉండాల్సింది కాదు.

మూడు రోజుల కిందటే తన పెదనాన్న కొడుకైన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఆమె అచ్యుతాపురం నుంచి కాకినాడకు వచ్చింది. తన అన్నకు రాఖీ కట్టిన వీడియోను రీల్‌గా కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టారు. రాఖీ కోసం ఇటికి వచ్చిన హారికను ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉండాలని కోరారట కుటుంబ సభ్యులు. కానీ ఆమె మాత్రం రాఖీ తర్వాతి రోజు మాత్రమే అక్కడ ఉండి.. విధులకు హాజరు కావాల్సిందే అంటూ ప్రమాద ఘటన రోజు అచ్యుతాపురానికి వచ్చేసింది.

కెమికల్ ఫ్యాక్టరీలో విధులకు హాజరైంది. కానీ మృత్యువు రియాక్టర్ పేలుడు రూపంలో ఆమెను వెంటాడింది. రెండు రోజుల ముందు అన్నకు రాఖీ కట్టి ఎంతో సంతోషంగా ఉన్న హారిక.. ఇప్పుడిలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో అందరి గుండె బరువు చేస్తోంది. హారిక ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించినట్లు స్థానికులు చెబుతున్నారు.

తాపీ మేస్త్రిగా పని చేసే తండ్రి హారిక చిన్నతనంలోనే చనిపోగా.. సోదరుడు చిన్నపుడే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తల్లి, నానమ్మ సంరక్షణలో పెరిగిన హారిక ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ప్రమాదం జరిగిన ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందింది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన హారిక.. పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. వాళ్లు మరొక్క రోజు ఉండమన్నా.. సెలవు దొరక్కపోవడంతో విధులకు వెళ్లి మృత్యువాత పడింది.

This post was last modified on August 23, 2024 7:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago