ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఇంకా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరిలోకి చల్లపల్లి హారిక (22) కథ తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె దురదృష్టంకొద్దీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రియాక్టరు పేలుడు సమయంలో ఆమె అసలు విధుల్లోనే ఉండాల్సింది కాదు.
మూడు రోజుల కిందటే తన పెదనాన్న కొడుకైన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఆమె అచ్యుతాపురం నుంచి కాకినాడకు వచ్చింది. తన అన్నకు రాఖీ కట్టిన వీడియోను రీల్గా కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టారు. రాఖీ కోసం ఇటికి వచ్చిన హారికను ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉండాలని కోరారట కుటుంబ సభ్యులు. కానీ ఆమె మాత్రం రాఖీ తర్వాతి రోజు మాత్రమే అక్కడ ఉండి.. విధులకు హాజరు కావాల్సిందే అంటూ ప్రమాద ఘటన రోజు అచ్యుతాపురానికి వచ్చేసింది.
కెమికల్ ఫ్యాక్టరీలో విధులకు హాజరైంది. కానీ మృత్యువు రియాక్టర్ పేలుడు రూపంలో ఆమెను వెంటాడింది. రెండు రోజుల ముందు అన్నకు రాఖీ కట్టి ఎంతో సంతోషంగా ఉన్న హారిక.. ఇప్పుడిలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో అందరి గుండె బరువు చేస్తోంది. హారిక ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించినట్లు స్థానికులు చెబుతున్నారు.
తాపీ మేస్త్రిగా పని చేసే తండ్రి హారిక చిన్నతనంలోనే చనిపోగా.. సోదరుడు చిన్నపుడే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తల్లి, నానమ్మ సంరక్షణలో పెరిగిన హారిక ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ప్రమాదం జరిగిన ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందింది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన హారిక.. పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. వాళ్లు మరొక్క రోజు ఉండమన్నా.. సెలవు దొరక్కపోవడంతో విధులకు వెళ్లి మృత్యువాత పడింది.
This post was last modified on August 23, 2024 7:57 am
టాలీవుడ్లో క్వాలిటీ సినిమాలు చేస్తూనే మంచి స్పీడ్ కూడా చూపించే హీరోల్లో నేచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో…
తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ స్థానమేంటో, ఆయన స్థాయేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి ‘బ్రహ్మా ఆనందం’ సినిమా…
ఏపీలో అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి చెందిన యువ నేతలు ఒక్కొక్కరుగా ఆక్టివేట్ అయిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా…
https://www.youtube.com/watch?v=McPGQ-Nb9Uk బ్లాక్ బస్టర్ చూసి సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక హీరో మార్కెట్, బడ్జెట్ తగ్గడానికి బదులు పెరుగుతోందంటే అతని స్టార్…
మెటా సంస్థ భారతదేశంలో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాన్ని…
బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి…