ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏకంగా 18కి చేరుకుంది. ఇంకా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందరిలోకి చల్లపల్లి హారిక (22) కథ తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె దురదృష్టంకొద్దీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రియాక్టరు పేలుడు సమయంలో ఆమె అసలు విధుల్లోనే ఉండాల్సింది కాదు.
మూడు రోజుల కిందటే తన పెదనాన్న కొడుకైన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఆమె అచ్యుతాపురం నుంచి కాకినాడకు వచ్చింది. తన అన్నకు రాఖీ కట్టిన వీడియోను రీల్గా కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టారు. రాఖీ కోసం ఇటికి వచ్చిన హారికను ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉండాలని కోరారట కుటుంబ సభ్యులు. కానీ ఆమె మాత్రం రాఖీ తర్వాతి రోజు మాత్రమే అక్కడ ఉండి.. విధులకు హాజరు కావాల్సిందే అంటూ ప్రమాద ఘటన రోజు అచ్యుతాపురానికి వచ్చేసింది.
కెమికల్ ఫ్యాక్టరీలో విధులకు హాజరైంది. కానీ మృత్యువు రియాక్టర్ పేలుడు రూపంలో ఆమెను వెంటాడింది. రెండు రోజుల ముందు అన్నకు రాఖీ కట్టి ఎంతో సంతోషంగా ఉన్న హారిక.. ఇప్పుడిలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో అందరి గుండె బరువు చేస్తోంది. హారిక ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించినట్లు స్థానికులు చెబుతున్నారు.
తాపీ మేస్త్రిగా పని చేసే తండ్రి హారిక చిన్నతనంలోనే చనిపోగా.. సోదరుడు చిన్నపుడే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తల్లి, నానమ్మ సంరక్షణలో పెరిగిన హారిక ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ప్రమాదం జరిగిన ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందింది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన హారిక.. పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. వాళ్లు మరొక్క రోజు ఉండమన్నా.. సెలవు దొరక్కపోవడంతో విధులకు వెళ్లి మృత్యువాత పడింది.
This post was last modified on August 23, 2024 7:57 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…