తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ. కేటీఆర్ కు చెందినదిగా చెబుతున్న వేళ.. దీనిపై ఇప్పటివరకు మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా పెదవి విప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు.
ఎనిమిది నెలల క్రితం తన మిత్రుడి నుంచి తాను లీజుకు ఫామ్ హౌస్ తీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ.. సదరు ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేసినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తానే తన స్నేహితుడికి చెబుతానని.. కూల్చివేసినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
కాకుంటే.. తమ ఫామ్ హౌస్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల ఫామ్ హౌస్ లపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వాదనలు వినిపిస్తున్నారు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్.
జన్వాడ భూములన్నీ కేటీఆర్ వేనని.. అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని చెబుతున్నారు. సర్వే నంబర్లతో సహా ఆధారాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫామ్ హౌస్ తన స్నేహితుడదని కేటీఆర్ చెబుతున్నారని.. కానీ అది కేటీఆర్ దేనని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ చుట్టు ఉన్న భూములు కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఉన్నట్లుగా అధికారులు నివేదికలు ఇచ్చినట్లుగా వెల్లడించారు.
కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో జన్వాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తమ వద్ద సర్వే నంబర్లతో సహా వివరాలు ఉన్నట్లుగా మహేశ్ కుమార్ గౌడ్ చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు జన్వాడ ఫామ్హౌస్ కూల్చివేతకు సంబంధించి.. నిబంధనలకు ప్రకారమే వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on August 22, 2024 1:32 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…