తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ. కేటీఆర్ కు చెందినదిగా చెబుతున్న వేళ.. దీనిపై ఇప్పటివరకు మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా పెదవి విప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు.
ఎనిమిది నెలల క్రితం తన మిత్రుడి నుంచి తాను లీజుకు ఫామ్ హౌస్ తీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ.. సదరు ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేసినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తానే తన స్నేహితుడికి చెబుతానని.. కూల్చివేసినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
కాకుంటే.. తమ ఫామ్ హౌస్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల ఫామ్ హౌస్ లపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వాదనలు వినిపిస్తున్నారు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్.
జన్వాడ భూములన్నీ కేటీఆర్ వేనని.. అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని చెబుతున్నారు. సర్వే నంబర్లతో సహా ఆధారాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫామ్ హౌస్ తన స్నేహితుడదని కేటీఆర్ చెబుతున్నారని.. కానీ అది కేటీఆర్ దేనని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ చుట్టు ఉన్న భూములు కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఉన్నట్లుగా అధికారులు నివేదికలు ఇచ్చినట్లుగా వెల్లడించారు.
కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో జన్వాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తమ వద్ద సర్వే నంబర్లతో సహా వివరాలు ఉన్నట్లుగా మహేశ్ కుమార్ గౌడ్ చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు జన్వాడ ఫామ్హౌస్ కూల్చివేతకు సంబంధించి.. నిబంధనలకు ప్రకారమే వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on August 22, 2024 1:32 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…