Trends

ఫామ్ హౌస్ చుట్టూ రాజకీయం

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ. కేటీఆర్ కు చెందినదిగా చెబుతున్న వేళ.. దీనిపై ఇప్పటివరకు మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా పెదవి విప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు.

ఎనిమిది నెలల క్రితం తన మిత్రుడి నుంచి తాను లీజుకు ఫామ్ హౌస్ తీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ.. సదరు ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేసినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తానే తన స్నేహితుడికి చెబుతానని.. కూల్చివేసినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

కాకుంటే.. తమ ఫామ్ హౌస్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల ఫామ్ హౌస్ లపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వాదనలు వినిపిస్తున్నారు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్.

జన్వాడ భూములన్నీ కేటీఆర్ వేనని.. అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని చెబుతున్నారు. సర్వే నంబర్లతో సహా ఆధారాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫామ్ హౌస్ తన స్నేహితుడదని కేటీఆర్ చెబుతున్నారని.. కానీ అది కేటీఆర్ దేనని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ చుట్టు ఉన్న భూములు కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఉన్నట్లుగా అధికారులు నివేదికలు ఇచ్చినట్లుగా వెల్లడించారు.

కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో జన్వాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో తమ వద్ద సర్వే నంబర్లతో సహా వివరాలు ఉన్నట్లుగా మహేశ్ కుమార్ గౌడ్ చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు జన్వాడ ఫామ్హౌస్ కూల్చివేతకు సంబంధించి.. నిబంధనలకు ప్రకారమే వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

This post was last modified on August 22, 2024 1:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago