ఈ దేశంలో గవర్నమెంటు ఆఫీసుల్లో స్వీపర్ కూడా అవినీతి చేయగలడు అని నిరూపించడానికి ఉత్తరప్రదేశ్ లో ఒక స్వీపర్ భాగోతం బయటకు వచ్చింది. అతగాడికి 9 లగ్జరీకార్లు ఉండటాన్ని అధికారులు సైతం అవాక్కు అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే..తానేమీ తప్పు చేయలేదన్నట్లుగా సదరు స్వీపర్ చెప్పే మాటల్ని వింటే నోటి వెంట మాట రాని పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు కోట్లకు పడగలెత్తిన వైనం సంచలనంగా మారింది. ఏదో లాటరీ తగలటమో.. ఎప్పుడో కొన్న భూమికి అదిరే రేటు రావటం మరో ఎత్తు. తాజా ఎపిసోడ్ మాత్రం కాస్త భిన్నమైంది. సంతోష్ జైస్వాల్ అనే వ్యక్తి గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కథ మొదలైంది ఎప్పుడంటే.. అతగాడికి నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రమోషన్ వచ్చింది.
అంతే.. అక్కడకు వెళ్లిన అతడు ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేయటం.. భారీగా నొక్కేస్తూ.. అడ్డగోలుగా సంపాదించాడు. తాజాగా అతడి భాగోతం బయటకు వచ్చి అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేసి.. కేసు పెట్టారు. ఇక.. అధికారులు అతడ్ని విచారించి.. సోదాలు నిర్వహించే వేళలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అతడికి మొత్తం తొమ్మిది లగ్జరీకార్లు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు.
కాకుంటే.. ఆ కార్లు నిందితుడి సోదరుడు.. భార్య పేర్ల మీద ఉండటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన లగ్జరీకార్ల భాగోతం అనంతరం అతడి బ్యాంకు ఖాతాల మీద ఫోకస్ పెంచారు. రానున్న రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించి మరెన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయో?
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…