ఈ దేశంలో గవర్నమెంటు ఆఫీసుల్లో స్వీపర్ కూడా అవినీతి చేయగలడు అని నిరూపించడానికి ఉత్తరప్రదేశ్ లో ఒక స్వీపర్ భాగోతం బయటకు వచ్చింది. అతగాడికి 9 లగ్జరీకార్లు ఉండటాన్ని అధికారులు సైతం అవాక్కు అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే..తానేమీ తప్పు చేయలేదన్నట్లుగా సదరు స్వీపర్ చెప్పే మాటల్ని వింటే నోటి వెంట మాట రాని పరిస్థితి.
ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు కోట్లకు పడగలెత్తిన వైనం సంచలనంగా మారింది. ఏదో లాటరీ తగలటమో.. ఎప్పుడో కొన్న భూమికి అదిరే రేటు రావటం మరో ఎత్తు. తాజా ఎపిసోడ్ మాత్రం కాస్త భిన్నమైంది. సంతోష్ జైస్వాల్ అనే వ్యక్తి గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కథ మొదలైంది ఎప్పుడంటే.. అతగాడికి నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రమోషన్ వచ్చింది.
అంతే.. అక్కడకు వెళ్లిన అతడు ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేయటం.. భారీగా నొక్కేస్తూ.. అడ్డగోలుగా సంపాదించాడు. తాజాగా అతడి భాగోతం బయటకు వచ్చి అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేసి.. కేసు పెట్టారు. ఇక.. అధికారులు అతడ్ని విచారించి.. సోదాలు నిర్వహించే వేళలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అతడికి మొత్తం తొమ్మిది లగ్జరీకార్లు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు.
కాకుంటే.. ఆ కార్లు నిందితుడి సోదరుడు.. భార్య పేర్ల మీద ఉండటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన లగ్జరీకార్ల భాగోతం అనంతరం అతడి బ్యాంకు ఖాతాల మీద ఫోకస్ పెంచారు. రానున్న రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించి మరెన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తాయో?
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…