Trends

‘ప‌ర్స‌న‌ల్’ చంపేస్తోంది!: ఆర్బీఐ హెచ్చ‌రిక‌

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అప్పులు చేసేస్తున్నార‌ని.. ఇది ప్ర‌మాద‌క‌ర ధోర‌ణి అని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా(ఆర్బీఐ) హెచ్చరించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్‌.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు వ్య‌క్తిగ‌త రుణాలు(ప‌ర్స‌న‌ల్‌) చేసేస్తున్నార‌ని తెలిపారు. గ‌త 2022-23తో పోల్చితే.. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకున్న వారి సంఖ్య పెరుగుతోంద‌ని తెలిపారు. అయితే.. ఇది ప్ర‌మాద‌క‌ర ధోర‌ణిని సూచిస్తోంద‌న‌డం గ‌మ‌నార్హం.

ఎందుకిలా?

ఆర్బీఐ అంచ‌నా ప్ర‌కారం.. వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకోవ‌డం ప్ర‌మాక‌రం. ఎలా అంటే.. ప్ర‌స్తుతం చేస్తున్న ఉద్యోగం, ఉపాధిని అంచ‌నా వేసుకుని బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారులు ప‌ర్స‌న‌ల్ రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తు న్నారు. పైగా వ్య‌క్తిగ‌త రుణాల‌కు ఎలాంటి ప‌త్రాలు, ప్రూఫులు లేక‌పోవ‌డం వినియోగదారుల‌కు క‌లిసి వ‌స్తోంది. అయితే.. ఇక్క‌డే పెద్ద మ‌త‌ల‌బు ఉంది. వ్య‌క్తిగ‌త రుణాల రూపంలో ఇచ్చే మొత్తాల‌పై 42 – 50 శాతం వ‌డ్డీలు వ‌సూలు చేస్తున్నారు. నేష‌న‌లైజ్డ్ బ్యాంకుల్లోనే 35 శాతం వ‌డ్డీ విధిస్తున్నారు.

అయితే..వ‌డ్డీ ఎంత‌నేది ప‌క్క‌న పెడితే.. త‌క్ష‌ణం డ‌బ్బులు చేతికి అందుతుండ‌డంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున ఈ ప‌ర్స‌న‌ల్ రుణాల‌కు ఎగ‌బ‌డుతున్నారు. అయితే.. త‌ర్వాత కాలంలో వీటిని చెల్లించేందు కు నానా ప్ర‌యాస ప‌డుతున్నారు. కొంద‌రు వీటిని ఎగ్గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూ.. చిక్కుల్లో ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు. ఇత‌ర‌త్రా ఆస్తుల‌ను కూడా అమ్ముకుని వ్య‌క్తిగ‌త రుణాల‌ను చెల్లిస్తున్నారు. ఇక్క‌డ ఆర్బీఐ చెబుతున్న మ‌రో కీల‌క విష‌యం సిబిల్ స్కోర్‌.

ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుని చెల్లించ‌క‌పోతే.. అది సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. దీంతో స‌ద‌రు వ్య‌క్తికి త‌దుపరి ఎక్క‌డా రుణాలు ద‌క్కే అవ‌కాశం కోల్పోతున్నారు. ప‌ర్స‌న‌ల్ లోన్‌ల‌కు అల‌వాటు ప‌డిన యువ‌త‌.. వాటిని స‌ద్వినియోగం చేయ‌డం లేద‌ని కూడా ఆర్బీఐ హెచ్చ‌రించింది. ప్ర‌స్తుతం ఇంటి, బంగారంపై రుణాల‌కంటే 150 శాతం ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ రుణాలు తీసుకునేవారి సంఖ్య ఉంటోంద‌ని శ‌క్తికాంత దాస్ చెప్పారు.

This post was last modified on August 8, 2024 6:36 pm

Share

Recent Posts

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

37 minutes ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

1 hour ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

1 hour ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

2 hours ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

2 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

3 hours ago