Trends

ఒలింపిక్స్‌లో భారత్‌కు బిగ్ షాక్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. తుది మెట్టుపై బోల్తా కొడుతూ త్రుటిలో పతకం కోల్పోతుండడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. ఇప్పటికే ఏడు విభాగాల్లో భారత్‌కు పతకం అందినట్లే అంది దూరమైంది. ఇప్పుడు ఖాయమైన పతకం కూడా చేజారడం పెద్ద షాక్. మంగళవారం రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరడం ద్వారా పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి జరగాల్సిన ఫైనల్లో గెలిస్తే ఆమెకు స్వర్ణం దక్కేది. ఓడినా రజతం సొంతమయ్యేది. కానీ ఫైనల్ బౌట్ జరగడానికి ముందే వినేశ్ మీద అనర్హత వేటు పడి పతకం దూరం కావడం పెద్ద షాక్. తన విభాగంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే 50 గ్రాములు ఎక్కువ ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వినేశ్ నిరాశగా ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించక తప్పట్లేదు.

రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడల్లో బరువును బట్టి విభాగాలు ఉంటాయి. తాము పోటీ పడుతున్న విభాగానికి సంబంధించి నిర్దేశించిన బరువు కంటే ఒక్క గ్రామ్ కూడా ఎక్కువ ఉండకూడదు. క్రీడాకారులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ వినేశ్ లాంటి ఎంతో అనుభవమున్న, అగ్రశ్రేణి రెజ్లర్ బరువు సరి చూసుకోకుండా ఎలా పోటీలో దిగిందన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. సెమీస్‌లో గెలిచిన కొన్ని గంటల తర్వాత ఆమె బరువు కొలవగా 50 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో నిబంధనల ప్రకారం ఆమె మీద అనర్హత వేటు వేశారు. ఇలా చేతుల్లోకి వచ్చిన పతకం దూరం కావడం వినేశ్‌కే కాదు.. అభిమానులకు కూడా పెద్ద షాక్. వినేశ్, కోచింగ్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారన్నది అర్థం కాని విషయం. వినేశ్ నిజానికి ఏడాది ముందు వరకు 57 కేజీల విభాగంలో పోటీ పడేది. కానీ ఈ ఒలింపిక్స్ కోసం 50 కేజీలకు మారింది. ఈ క్రమంలో బరువు తగ్గే ఒలింపిక్స్‌కు వెళ్లింది. కానీ పోటీల సమయంలో అనుకోకుండా కాస్త బరువు పెరిగితే అదే ఇప్పుడు శాపంగా మారింది.

This post was last modified on August 7, 2024 7:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

43 minutes ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

1 hour ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

6 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

8 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

11 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

12 hours ago