పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. తుది మెట్టుపై బోల్తా కొడుతూ త్రుటిలో పతకం కోల్పోతుండడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. ఇప్పటికే ఏడు విభాగాల్లో భారత్కు పతకం అందినట్లే అంది దూరమైంది. ఇప్పుడు ఖాయమైన పతకం కూడా చేజారడం పెద్ద షాక్. మంగళవారం రెజ్లింగ్లో వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగంలో ఫైనల్కు చేరడం ద్వారా పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి జరగాల్సిన ఫైనల్లో గెలిస్తే ఆమెకు స్వర్ణం దక్కేది. ఓడినా రజతం సొంతమయ్యేది. కానీ ఫైనల్ బౌట్ జరగడానికి ముందే వినేశ్ మీద అనర్హత వేటు పడి పతకం దూరం కావడం పెద్ద షాక్. తన విభాగంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే 50 గ్రాములు ఎక్కువ ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వినేశ్ నిరాశగా ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించక తప్పట్లేదు.
రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడల్లో బరువును బట్టి విభాగాలు ఉంటాయి. తాము పోటీ పడుతున్న విభాగానికి సంబంధించి నిర్దేశించిన బరువు కంటే ఒక్క గ్రామ్ కూడా ఎక్కువ ఉండకూడదు. క్రీడాకారులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ వినేశ్ లాంటి ఎంతో అనుభవమున్న, అగ్రశ్రేణి రెజ్లర్ బరువు సరి చూసుకోకుండా ఎలా పోటీలో దిగిందన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. సెమీస్లో గెలిచిన కొన్ని గంటల తర్వాత ఆమె బరువు కొలవగా 50 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో నిబంధనల ప్రకారం ఆమె మీద అనర్హత వేటు వేశారు. ఇలా చేతుల్లోకి వచ్చిన పతకం దూరం కావడం వినేశ్కే కాదు.. అభిమానులకు కూడా పెద్ద షాక్. వినేశ్, కోచింగ్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారన్నది అర్థం కాని విషయం. వినేశ్ నిజానికి ఏడాది ముందు వరకు 57 కేజీల విభాగంలో పోటీ పడేది. కానీ ఈ ఒలింపిక్స్ కోసం 50 కేజీలకు మారింది. ఈ క్రమంలో బరువు తగ్గే ఒలింపిక్స్కు వెళ్లింది. కానీ పోటీల సమయంలో అనుకోకుండా కాస్త బరువు పెరిగితే అదే ఇప్పుడు శాపంగా మారింది.
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…