ఏపీలో పశు ప్రవృత్తిని మించిన దారుణాలు వెలుగు చూస్తున్నారు. పసి మొగ్గల నుంచి చిన్నారుల వరకు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. నెలల పిల్లల నుంచి ముక్కుపచ్చలారని పసి మొగ్గల వరకు దారుణాల్లో చిక్కుకునిబలైపోతున్నారు. అయితే.. నాణేనికి ఒక భాగమైతే.. ఇప్పుడు మరో కోణం అత్యంత హీనంగా.. దారుణంగా ఉండడం గమనార్హం. పశువులపై కూడా.. అత్యాచారానికి పాల్పడుతున్న ప్రబుద్ధులు వెలుగు చూస్తున్నారు. ఇటీవల ఒక శాస్త్రవేత్త అమెరికాలో కుక్కపై అత్యాచారానికి పాల్పడిన విషయం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.
సుమారు పది సంవత్సరాల పాటు కుక్కపై ప్రయోగాలు చేసిన సదరు శాస్త్రవేత్త తన కామ వాంఛను కుక్కతోనే తీర్చుకున్నాడు. ఈయనకు జైలు శిక్ష కూడా పడింది. ఇక, మన విషయానికి వస్తే.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని తోకలపూడి గ్రామంలో నోరు లేని జీవి, నిత్యం తన పాలతో ఎంతో మందికి సేవ చేస్తున్న గేదపై ఒకడు పశుప్రవృత్తికి పాల్పడ్డాయి. కన్నూ మిన్నూ కానకుండా..గేదెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గేదె కాళ్లు కట్టేసి.. మరీ ఈ దారుణానికి పాల్పడినట్టు రైతు పిల్లి సీతారామయ్య గుర్తించారు.
ఎలా గుర్తించారు?
నిత్యం నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలిచ్చే గేదె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దీంతో అనుమానం వచ్చిన రైతు.. సీతారామయ్య దానిని పరీక్షించగా.. గేదె కాళ్లపై గాయాలను ఒంటిపై గోళ్ళతో గీరిన గాయాలు గుర్తించారు. తర్వాత.. పృష్ఠ భాగంలోనూ రక్త గాయాలను గుర్తించి.. ఏదో జరిగిందన్న అనుమానంతో సమీప పాల రైతులను పిలిచి.. వారితోనూ పరిశీలించేలా చేశారు. వారు.. గేదెపై అత్యాచారం జరిగిందని.. దారుణంగా వ్యవహరించారని గుర్తించారు.
ఈ క్రమంలో తొలుత ఈ నెల 7న స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు పట్టించుకోలేదు. దీంతో తాజాగా సోమవారం.. గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈనెల నాలుగో తారీకు రాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి, మద్యం సేవించి గేదె కాళ్ళను తాడుతో బంధించి అత్యాచారానికి ఒడిగట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్.. వెటర్నరీ వైద్యులను రంగంలోకి దింపి.. పరీక్షలకు ఆదేశించారు.
ఈ పరిణామంతో ఒక్కసారిగా అందరూ ముక్కున వేలేసుకున్నారు. సమాజం ఎటు పోతోందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి విచ్చలవిడిగా లభించడం.. గత ప్రభుత్వం అరికట్టే చర్యలు చేపట్టకపోగా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన కారణంగానే ఈ దారుణం జరిగిందని పలువురు వ్యాఖ్యానించారు.
This post was last modified on July 17, 2024 1:24 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…