‘పుస్తెలు అమ్మి అయినా పులస చేప తినాలి’ అన్నది గోదావరి జిల్లాలలో సామెత. వర్షాకాలం మొదలై గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం మొదలయిందంటే గోదావరి జిల్లాలలో పులస చేపల కోసం వేట మొదలవుతుంది. ఆ సమయంలో పులస చేపలు సముద్రం నుండి గోదావరిలోకి ఎదురెక్కడంతో మత్స్యకారుల వలకు చిక్కుతాయి.,
వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ పులస చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఇది దేశంలో గోదావరి నదితో పాటు పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిలో మాత్రమే దొరుకుతుంది. అక్కడ ఈ చేపను వాళ్లు ‘హిల్సా’ అని పిలుస్తారు. ఉప్పునీరు, తీపి నీరు కలిసే ప్రాంతంలో దొరకడం మూలంగా ఈ చేపలు ప్రత్యేక రుచి కలిగి ఉంటాయని చెబుతారు.
తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక మత్స్యకారుల వలలో దాదాపు కేజీన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీనిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేయడం విశేషం. కేజీన్నర పులస చేప ధర ఇంత ధర పలికితే భవిష్యత్ లో పుస్తెలమ్మినా పులస తినడం కష్టమేనని సామాన్యులు ఉసూరుమంటున్నారు.
This post was last modified on July 13, 2024 6:45 pm
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…
నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…
మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…