Trends

టీ20లకు మరో భారత క్రికెటర్ గుడ్ బై

టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో సఫారీ జట్టుపై రోహిత్ సేన చిరస్మరణీయ విజయం సాధించింది. ఎంతోకాలంగా ఫామ్ లేమితో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న కింగ్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. 2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అవమాన భారంతో కుంగి పోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఈ ప్రపంచ కప్ చాలా స్పెషల్. అందుకే వారంతా కప్ గెలవగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నామని సంచలన ప్రకటన చేశారు.

వయసు రీత్యా మరో రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచ కప్ సమయానికి వీరిద్దరి స్థానాల్లో కొత్తవారికి చోటు దక్కితే బాగుంటుందన్న వాదన చాలాకాలంగా ఉంది. ఆ ప్రచారం ప్రకారమే రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా ధనాధన్ క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ ల బాటలోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టాటా చెప్పేశాడు. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నానని జడ్డూ ప్రకటించాడు. గుండెనిండా కృత‌జ్జ‌తాభావంతో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్నానని అన్నాడు. తన కెరీర్ ను ఎంతో గ‌ర్వంగా ముగిస్తున్నానని, దేశానికి ఆడిన ప్ర‌తిసారి తన అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచానని జడ్డూ భావోద్వేగంతో అన్నాడు.

మిగ‌తా ఫార్మాట్ల‌లోనూ అదే త‌ర‌హాలో ఆడాతానని చెప్పాడు. పొట్టి ప్ర‌పంచ క‌ప్ గెల‌వాల‌నే క‌ల నిజ‌మైందని, టీ20 కెరీర్‌లో ఇదో గొప్ప ఘ‌ట్టమని చెప్పాడు. ఇన్ని రోజులు తనకు మ‌ద్దతుగా ఉన్న అభిమానులంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతూ జడ్డూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

This post was last modified on June 30, 2024 6:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…

52 minutes ago

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

2 hours ago

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…

2 hours ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

3 hours ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

3 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

4 hours ago