వాళ్లు వరసకు బంధువులు అవుతారు. అమెరికాలో పైచదువులు చెప్పిస్తామని ఆశపెట్టారు. బంగారు భవిష్యత్తును కళ్ల ముందు చూయించారు. తీరా అమెరికాకు తీసుకొచ్చాక బంధువుతో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఎలాగోలా వీరి బారి నుండి బయటపడ్డ అతను అమెరికా కోర్టును ఆశ్రయించాడు. ఈ భారతీయ అమెరికన్ జంటకు అమెరికా కోర్టు భారీ షాక్ ఇచ్చింది.
నిందితులైన భార్యాభర్తలకు జైలు శిక్ష విధించడమే కాకుండా బాధితుడికి రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. నిందితుడు హర్మన్ ప్రీత్ సింగ్ కు 11.25 ఏళ్ల జైలు శిక్ష, అతడి భార్య కుల్బీర్ కౌర్కు 7.25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని నిందితులు తమ బంధువైన అబ్బాయిని పైచదువులు చదివిస్తాం, మంచి భవిష్యత్ చూపిస్తాం అని ఆశపెట్టి అమెరికాకు రప్పించుకున్నారు. ఆ తరువాత అతడి వద్ద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వేధింపులకు పాల్పడుతూ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వర్జీనియాలో ఉన్న వారి గ్యాస్ స్టేషన్, షాపులో రోజుకు 12 నుండి 17 గంటల చొప్పున పని చేయించుకున్నారు. చివరకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా వేధించారు.
షాపు వెనకభాగంలోని స్టోర్ రూంలోనే ఉండేలా చేశారు. భారత్ కు వెళ్లేందుకు అనుమతించలేదు. వీసా గడువు ముగిసినా అమెరికాలో కొనసాగేలా చేశారు. తన డాక్యుమెంట్లు ఇవ్వమని కోరితే దాడికి దిగడమే కాకుండా సెలవు అడిగితే తుపాకీ చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి క్రూరత్వాన్ని గమనించిన కోర్టు ఇద్దరికీ శిక్షలు విధించడం గమనార్హం.
This post was last modified on June 28, 2024 10:10 am
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…