వాళ్లు వరసకు బంధువులు అవుతారు. అమెరికాలో పైచదువులు చెప్పిస్తామని ఆశపెట్టారు. బంగారు భవిష్యత్తును కళ్ల ముందు చూయించారు. తీరా అమెరికాకు తీసుకొచ్చాక బంధువుతో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఎలాగోలా వీరి బారి నుండి బయటపడ్డ అతను అమెరికా కోర్టును ఆశ్రయించాడు. ఈ భారతీయ అమెరికన్ జంటకు అమెరికా కోర్టు భారీ షాక్ ఇచ్చింది.
నిందితులైన భార్యాభర్తలకు జైలు శిక్ష విధించడమే కాకుండా బాధితుడికి రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. నిందితుడు హర్మన్ ప్రీత్ సింగ్ కు 11.25 ఏళ్ల జైలు శిక్ష, అతడి భార్య కుల్బీర్ కౌర్కు 7.25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని నిందితులు తమ బంధువైన అబ్బాయిని పైచదువులు చదివిస్తాం, మంచి భవిష్యత్ చూపిస్తాం అని ఆశపెట్టి అమెరికాకు రప్పించుకున్నారు. ఆ తరువాత అతడి వద్ద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వేధింపులకు పాల్పడుతూ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వర్జీనియాలో ఉన్న వారి గ్యాస్ స్టేషన్, షాపులో రోజుకు 12 నుండి 17 గంటల చొప్పున పని చేయించుకున్నారు. చివరకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా వేధించారు.
షాపు వెనకభాగంలోని స్టోర్ రూంలోనే ఉండేలా చేశారు. భారత్ కు వెళ్లేందుకు అనుమతించలేదు. వీసా గడువు ముగిసినా అమెరికాలో కొనసాగేలా చేశారు. తన డాక్యుమెంట్లు ఇవ్వమని కోరితే దాడికి దిగడమే కాకుండా సెలవు అడిగితే తుపాకీ చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి క్రూరత్వాన్ని గమనించిన కోర్టు ఇద్దరికీ శిక్షలు విధించడం గమనార్హం.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…