భారత అమ్ముల పొదిలో చేరిన యుద్ధ విమానం రఫేల్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రఫెల్ జెట్ లను తాజాగా మహిళా పైలెట్ ఒకరు నడపనున్నట్లుగా వెల్లడించారు.
అత్యాధునిక యుద్ధ విమానమైన రఫేల్ ను డీల్ చేసేందుకు ఒక మహిళా పైలెట్ కు అవకాశాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అంబాలా వైమానిక స్థావరానికి రఫేల్ ను చేర్చటం తెలిసిందే. మరికొద్ది నెలల్లో మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరనున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రఫేల్ ను నడిపేందుకు వీలుగా ఒక మహిళా పైలెట్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
కఠినమైన పరీక్షల్ని విజయవంతంగా సదరు మహిళా పైలట్ పూర్తి చేసిందని.. దీంతో ఆమెకు రఫెల్ ను నడిపే అవకాశం లభించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఆమె.. త్వరలోనే దాన్నిపూర్తి చేసుకొని రఫెల్ ను నడపనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆ మహిళా పైలెట్ ఎవరు? ఆమె ఎక్కడి వారు అన్న వివరాల్ని మాత్రం రక్షణ శాఖ వెల్లడించలేదు.
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా తీయాలని ఏడాది కిందట్నుంచి ప్రయత్నాలు…