భారత అమ్ముల పొదిలో చేరిన యుద్ధ విమానం రఫేల్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రఫెల్ జెట్ లను తాజాగా మహిళా పైలెట్ ఒకరు నడపనున్నట్లుగా వెల్లడించారు.
అత్యాధునిక యుద్ధ విమానమైన రఫేల్ ను డీల్ చేసేందుకు ఒక మహిళా పైలెట్ కు అవకాశాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అంబాలా వైమానిక స్థావరానికి రఫేల్ ను చేర్చటం తెలిసిందే. మరికొద్ది నెలల్లో మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరనున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రఫేల్ ను నడిపేందుకు వీలుగా ఒక మహిళా పైలెట్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
కఠినమైన పరీక్షల్ని విజయవంతంగా సదరు మహిళా పైలట్ పూర్తి చేసిందని.. దీంతో ఆమెకు రఫెల్ ను నడిపే అవకాశం లభించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఆమె.. త్వరలోనే దాన్నిపూర్తి చేసుకొని రఫెల్ ను నడపనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆ మహిళా పైలెట్ ఎవరు? ఆమె ఎక్కడి వారు అన్న వివరాల్ని మాత్రం రక్షణ శాఖ వెల్లడించలేదు.
This post was last modified on September 22, 2020 2:07 pm
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు…
నిజమేనండోయ్... భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా…
చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…
వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్…
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.…