భారత అమ్ముల పొదిలో చేరిన యుద్ధ విమానం రఫేల్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రఫెల్ జెట్ లను తాజాగా మహిళా పైలెట్ ఒకరు నడపనున్నట్లుగా వెల్లడించారు.
అత్యాధునిక యుద్ధ విమానమైన రఫేల్ ను డీల్ చేసేందుకు ఒక మహిళా పైలెట్ కు అవకాశాన్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అంబాలా వైమానిక స్థావరానికి రఫేల్ ను చేర్చటం తెలిసిందే. మరికొద్ది నెలల్లో మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరనున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రఫేల్ ను నడిపేందుకు వీలుగా ఒక మహిళా పైలెట్ కు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
కఠినమైన పరీక్షల్ని విజయవంతంగా సదరు మహిళా పైలట్ పూర్తి చేసిందని.. దీంతో ఆమెకు రఫెల్ ను నడిపే అవకాశం లభించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఆమె.. త్వరలోనే దాన్నిపూర్తి చేసుకొని రఫెల్ ను నడపనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆ మహిళా పైలెట్ ఎవరు? ఆమె ఎక్కడి వారు అన్న వివరాల్ని మాత్రం రక్షణ శాఖ వెల్లడించలేదు.
This post was last modified on September 22, 2020 2:07 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…