ముస్లిం సమాజం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కలలు కంటుకుంది. ఇప్పుడు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా.. హజ్ యాత్రకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఒకప్పుడు ప్రయాణ సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండగా.. ఇప్పుడు ప్రధాన నగరాలు.. రాజధాని ప్రాంతాల నుంచి హజ్కు వెళ్లే విమానాలు.. యాత్రికుల సంఖ్య పెరిగింది. ఈ యాత్ర అంటేనే ముస్లింలకు మాత్రమే ప్రత్యేకం. అలాంటి ఈ యాత్ర ఈ సారి.. విషాదాన్ని నింపేసింది.
ప్రస్తుతం మరో రెండు రోజుల్లో ఈ యాత్ర ముగియనుంది. ఇలాంటి సమయంలో అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గడిచిన పది రోజుల్లో 550 మందికి పైగా యాత్రికులు మృతి చెందినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనధికారికంగా ఈ సంఖ్య 1000కి పైనే ఉంటుందని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు.. ఎంతోభక్తి శ్రద్ధలతో హజ్ యాత్ర చేస్తారు. మక్కా, మదీనాలను సందర్శించుకుంటారు.
అయితే.. ఈ యాత్ర పైకి చెప్పుకొన్నంత తేలిక కాదు.. విపరీతమైన రద్దీ నెలకొంటుంది. కనీసం.. ఒక చోట పట్టుమని పది నిమిషాలు కూర్చుకునే సదుపాయాలు కూడా ఉండవు. దీనికి తోడు.. 50 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు.. హజ్యాత్రికులకు ఈ సారి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ వేడిని తట్టుకోలేక.. అనేక మంది యాత్రికులు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఉష్ణోగ్రతలను ముందుగానే అంచనావేసినా.. ప్రత్యేకంగా బహిరంగ ప్రాంతాల్లోనూ చలువ గాలిని ఇచ్చే ఏసీలను, కూలర్లను ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు.
దీంతో యాత్రికులు కూర్చున్న వారు కూర్చునట్టుగా ప్రాణాలు వదులుతున్నారు. ఇలా చనిపోయిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్తులు అధికంగా ఉన్నారని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన వారిలో 300లకుపైగా ఈజిప్టియన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మరణించారని తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉండడం గమనార్హం.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…