దాసరి సాయి కుమారి అంటే మీకు తెలుసా ? ఖచ్చితంగా తెలిసి ఉండదు. కుమారి ఆంటీ తెలుసా అంటే మాత్రం ఖచ్చితంగా తెలియదు అని మాత్రం చెప్పరు. రోడ్డు పక్కన తక్కువ ధరకు రుచికరంగా ఆహారం అందిస్తూ సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది కుమారి ఆంటీ.
వీడియోలు చూసి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ సీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన సపోర్ట్ చూసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె యధావిధిగా బిజినెస్ చేసుకునేందుకు అనుమతించింది.
తనకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసిన కుమారీ ఆంటీ ఇటీవల ఏపీ శాసనసభ ఎన్నికల్లో సొంతూరు గుడివాడ వెళ్లి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం కూడా చేయడం గమనార్హం.
యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం వెంటపడ్డాయి. పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అయితే ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం అన్వేషిస్తున్న బిగ్ బాస్ టీమ్ కుమారీ ఆంటీని సంప్రదించినట్లు సమాచారం.
ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయినట్లు తెలుస్తుంది. మరి కుమారీ ఆంటీ ఎస్ అంటుందా ? నో అంటుందా ? చూడాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
This post was last modified on June 15, 2024 9:14 pm
ఎన్నికల్లో గెలుపోటములు, ప్రభుత్వాలు మారడం సహజమే కానీ ఇటీవలే జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికలు, వాటి ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.…
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సినిమాలకు గుర్తింపు ఇచ్చే అవార్డుగా పేరున్న ఆస్కార్ విజేతలను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఉందన్న…
కూటమి సర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల సమయంలో సీట్లు దక్కని నాయకులు, సీట్లు…
ఏపీ రాజధానిగా అమరావతి స్థిరపడింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. అమరావతికి ఢోకాలేదు. పనులు కూడా వేగంగా జరుగుతాయి.…
నిన్న విడుదలైన భారతీయుడు 2 ట్రైలర్ మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఊహించని విధంగా అటు తమిళంలోనూ అసంతృప్తి చెలరేగడం…
అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి విడుదల…