దాసరి సాయి కుమారి అంటే మీకు తెలుసా ? ఖచ్చితంగా తెలిసి ఉండదు. కుమారి ఆంటీ తెలుసా అంటే మాత్రం ఖచ్చితంగా తెలియదు అని మాత్రం చెప్పరు. రోడ్డు పక్కన తక్కువ ధరకు రుచికరంగా ఆహారం అందిస్తూ సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది కుమారి ఆంటీ.
వీడియోలు చూసి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ సీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన సపోర్ట్ చూసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె యధావిధిగా బిజినెస్ చేసుకునేందుకు అనుమతించింది.
తనకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసిన కుమారీ ఆంటీ ఇటీవల ఏపీ శాసనసభ ఎన్నికల్లో సొంతూరు గుడివాడ వెళ్లి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం కూడా చేయడం గమనార్హం.
యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం వెంటపడ్డాయి. పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అయితే ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం అన్వేషిస్తున్న బిగ్ బాస్ టీమ్ కుమారీ ఆంటీని సంప్రదించినట్లు సమాచారం.
ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయినట్లు తెలుస్తుంది. మరి కుమారీ ఆంటీ ఎస్ అంటుందా ? నో అంటుందా ? చూడాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
క్రిస్టఫర్ నోలన్ సినిమా వస్తే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేకవుతుందో మరోసారి రుజువైంది. నిన్న భారీ అంచనాల మధ్య…
గుంటూరులో మహిళపై దాడి చేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర…
నిన్న విడుదలైన హాలీవుడ్ మూవీ ది ఒడిస్సికి ఇండియాలో బ్రహ్మరథం దక్కుతోంది. క్రిస్టోఫర్ నోలన్ గత సినిమాలు దేనికి రానంత…
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆయనకు సహాయ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు…
దురంధర్ ముందు వరకు నాన్ బాలీవుడ్ రాష్ట్రాల్లో అంతగా పరిచయం లేని పేరు ఆదిత్య ధార్. ఏడు గంటలకు పైగా…