దాసరి సాయి కుమారి అంటే మీకు తెలుసా ? ఖచ్చితంగా తెలిసి ఉండదు. కుమారి ఆంటీ తెలుసా అంటే మాత్రం ఖచ్చితంగా తెలియదు అని మాత్రం చెప్పరు. రోడ్డు పక్కన తక్కువ ధరకు రుచికరంగా ఆహారం అందిస్తూ సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది కుమారి ఆంటీ.
వీడియోలు చూసి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ సీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన సపోర్ట్ చూసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె యధావిధిగా బిజినెస్ చేసుకునేందుకు అనుమతించింది.
తనకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసిన కుమారీ ఆంటీ ఇటీవల ఏపీ శాసనసభ ఎన్నికల్లో సొంతూరు గుడివాడ వెళ్లి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం కూడా చేయడం గమనార్హం.
యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం వెంటపడ్డాయి. పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అయితే ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం అన్వేషిస్తున్న బిగ్ బాస్ టీమ్ కుమారీ ఆంటీని సంప్రదించినట్లు సమాచారం.
ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయినట్లు తెలుస్తుంది. మరి కుమారీ ఆంటీ ఎస్ అంటుందా ? నో అంటుందా ? చూడాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
This post was last modified on June 15, 2024 9:14 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…