దాసరి సాయి కుమారి అంటే మీకు తెలుసా ? ఖచ్చితంగా తెలిసి ఉండదు. కుమారి ఆంటీ తెలుసా అంటే మాత్రం ఖచ్చితంగా తెలియదు అని మాత్రం చెప్పరు. రోడ్డు పక్కన తక్కువ ధరకు రుచికరంగా ఆహారం అందిస్తూ సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది కుమారి ఆంటీ.
వీడియోలు చూసి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ సీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన సపోర్ట్ చూసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె యధావిధిగా బిజినెస్ చేసుకునేందుకు అనుమతించింది.
తనకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసిన కుమారీ ఆంటీ ఇటీవల ఏపీ శాసనసభ ఎన్నికల్లో సొంతూరు గుడివాడ వెళ్లి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం కూడా చేయడం గమనార్హం.
యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం వెంటపడ్డాయి. పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారీ ఆంటీ. అయితే ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం అన్వేషిస్తున్న బిగ్ బాస్ టీమ్ కుమారీ ఆంటీని సంప్రదించినట్లు సమాచారం.
ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయినట్లు తెలుస్తుంది. మరి కుమారీ ఆంటీ ఎస్ అంటుందా ? నో అంటుందా ? చూడాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
This post was last modified on June 15, 2024 9:14 pm
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…