Trends

ఏపీ అప్పుల లెక్క తేలుస్తున్నారు!

ఏపీలో కొత్త‌గా గెలిచిన కూట‌మి పార్టీలు.. అధికారం చేప‌ట్టేందుకు నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. అయితే.. ఇంత‌లోనే కీల‌క ప‌రిణామాలు.. సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ కుమార్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఉన్న‌త‌స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ స‌మీక్ష‌లో ఏపీ అప్పుల లెక్క తేల్చాల‌ని.. సీఎస్ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఆదేశించారు. ఎక్క‌డెక్క‌డ ఎంతెంత అప్పులు తెచ్చారు. ఏయే ప‌థ‌కాల‌కు వాటిని మ‌ళ్లించారు? అనే విష‌యాల‌పై 24 గంట‌ల్లోగా త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు.

అదేస‌మ‌యంలో ఎన్నిక కార్పొరేష‌న్ల ఆస్తుల‌ను అడ్డు పెట్టుకుని అప్పులు తెచ్చారో.. కూడా తేల్చాల‌ని సీఎస్ ఆదేశించిన‌ట్టు స‌మాచారం. దీంతో ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

కొత్త‌గా కొలువు దీర‌నున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. తెలంగాణ త‌ర‌హాలోనే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్తితిపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని.. నిర్ణ‌యించుకున్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో సీఎస్ ఆదేశాల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి సత్యనారాయణ వైసీపీ హ‌యాంలో ఆర్థిక శాఖ వ్య‌వ‌హారాల‌ను స‌మ‌గ్రంగా చూశారు.

ఈ నేప‌థ్యంలో అప్పుల విష‌యం ఆయ‌న‌కు బాగా తెలిసి ఉంటుంద‌ని నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ బాధ్య‌త‌ను ఆయ‌న‌కే అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. నిబంధనలు అన్ని ఉల్లంఘించి మాజీ సీఎం త‌న వారికి మాత్రమే బిల్లులు చెల్లించారని టీడీపీ ఆరోపించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వాటిపై కూడా ఆర్థిక శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. ఇప్ప‌టికే జ‌గ‌న్ కు చెందిన సాక్షి ప‌త్రిక‌ను అధికారికంగా కొనుగోలు చేయ‌రాద‌ని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌కు, వ‌లంటీర్ల‌కు ప‌త్రిక నిలిచిపోయింది.

మొత్తం ఈ ప‌రిణామాలు చూస్తే.. వైసీపీ చేసిన త‌ప్పుల‌ను వెలుగు లోకి తీసుకురావ‌డంతోపాటు.. కొత్త ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసేందుకు కూడా.. కార్యాచ‌ర‌ణ సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం.

This post was last modified on June 10, 2024 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

35 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

56 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

2 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

3 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago