సమాజం మారిపోయింది, అభ్యుదయం పెరిగిపోయిందని కబుర్లు చెప్పుకుంటాం కానీ నిజానికి ఈ 5జి ప్రపంచంలోనూ కుల వివక్ష బోలెడంత ఉంది. దానికి ఉదాహరణే ఈ సంఘటన.
ఇటీవలే తమిళంలో గరుడన్ రిలీజయ్యింది. వడ చెన్నై, విచారణ, విడుదల పార్ట్ 1 లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వెట్రిమారన్ దీనికి కథను అందించారు. సెంథిల్ కుమార్ దర్శకుడు. కమెడియన్ సూరి హీరోగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
గత ఇరవై నాలుగు గంటల్లో ఇండియా వైడ్ లక్షకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోయిన సినిమా ఇదొక్కటే. బాలీవుడ్, టాలీవుడ్ కొత్త మూవీస్ కాదు.
తమిళనాడులో సంచార జాతి అనే కులం ఒకటుంది. నక్కల జాతి అనే పేరుతో కూడా వ్యహరిస్తారు. ఊరూరా తిరిగి వంట సామాన్లు అమ్మడం ద్వారా జీవనోపాధి చూసుకుంటారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లడం వీళ్ళ అలవాటు.
శనివారం వ్యాపారం పూర్తి చేసుకుని కడలూరు అనే ఊరిలో గరుడన్ చూద్దామని మొత్తం 30 మంది థియేటర్ కు వెళ్లారు. వీళ్ళను చూసిన యాజమాన్యం టికెట్లు అమ్మడానికి నిరాకరించి వెనక్కు వెళ్లిపోవాలని చెప్పింది. దీంతో ఆగ్రహించిన సంచార జాతి ప్రేక్షకులు తీవ్ర నిరసన ప్రకటించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి, అక్కడ పని జరగక ఆర్డిఓని కలుసుకుని నేరుగా తమకు జరిగిన అన్యాయం వివరించారు.
వెంటనే థియేటర్ దగ్గరకు వెళ్లిన అధికారులు దగ్గరుండి టికెట్లు ఇప్పించి ఆ బృందం సభ్యులందరికీ సినిమా చూసే ఏర్పాట్లు చేశారు. తక్కువ కులం కాబట్టి ఇతర వర్గాల నుంచి ఏమైనా గొడవలు జరగొచ్చనే అనుమానంతో 20 మంది పోలీసులతో బందోబస్తు పెట్టించి షో అయిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా కాపలా ఉన్నారు. నిజంగా ఇది ఆందోళన కలిగించే సంఘటన.
ఒకరో ఇద్దరో వెళ్లి ఉంటే ఇలా జరిగేది కాదేమో కానీ ఒక సమూహంగా వెళ్లిన వాళ్ళను కులం పేరుతో అడ్డుకోవడం మాత్రం ముమ్మాటికీ దుర్మార్గమే. ఇలాంటి దారుణాల మీదే కథలు రాసే వెట్రిమారన్ ఈ ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on June 3, 2024 3:44 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…