అప్పటి వరకు ఆడుతూ.. పాడుతూ.. తిరిగిన పసిపిల్లలు.. వారిని చూస్తూ.. ఆనందంలో మునిగిన వారి తల్లిదండ్రులు కూడా.. అగ్నికి ఆహుతయ్యారు. కనీసం ఊహకు కూడా అందని విధంగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం 30 మంది వరకు.. చూస్తూ చూస్తూ ఉండగానే కాలి బుగ్గయ్యారు. ఈ ఘటన గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతంలోని ప్రఖ్యాత మాల్లో చోటు చేసుకుంది. అప్పటి వరకు కేరింతలు కొట్టిన చిన్నారు బూడిద కుప్పగా మారారు. వారిని చూస్తూ.. ఆనందంలో ఉన్న తల్లిదండ్రులు కూడా విగత జీవులయ్యారు. ఈ ఘోరం దేశం మొత్తాన్నీ కదిలించి వేసింది.
ఏం జరిగింది?
గుజరాత్లోని గేమ్ జోన్.. ఇక్కడ చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆడుకునేందుకు, సేద దీరేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తున్న గేమ్ జోన్. వారాంతం కావడంతో శనివారం సాయంత్రం ఇక్కడకు స్థానికులతో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ చిన్నారులతో కలిసి తరలి వచ్చారు. అందరూ ఆనందంగా గడుపుతున్న క్షణాల్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి భగ్గున మంటలు రాజుకున్నాయి. దీంతో అందరూ ఉక్కిరి బిక్కిరికి గురై.. తల్లడిల్లిపోయారు. ఇంతలోనే మంటలు శర వేగంగా అలుముకోవడం, బయటకు వచ్చే మార్గం కనిపించకపోవడంతో ఆ మంటల్లో చిక్కుకుని 27 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ సంఖ్య 30కిపైగా ఉంటుందని స్థానికులు తెలిపారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
తన సొంత రాష్ట్రం గుజరాత్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇక, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వయంగా అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రాజ్ కోట్ పోలీసు కమిషనర్గా పనిచేస్తున్న ఏపీ అధికారి రాజు భార్గవ్ కూడా .. వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. కాగా, గత నాలుగు సంవత్సరాల్లో ఇంత ఘోరం జరగడం ఇది రెండో సారి అని అధికారి తెలిపారు.
This post was last modified on May 26, 2024 12:41 pm
మెటా సంస్థ భారతదేశంలో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాన్ని…
బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి…
ఏపీ నూతన రాజధాని అమరావతికి ఇక నిధుల కొరత అన్న మాట వినిపించదు. ఎందుకంటే… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ…
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…
ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…