Trends

అయ్యోపాపం: ఆడుతూ.. పాడుతూ.. బుగ్గ‌య్యారు!

అప్ప‌టి వ‌ర‌కు ఆడుతూ.. పాడుతూ.. తిరిగిన ప‌సిపిల్ల‌లు.. వారిని చూస్తూ.. ఆనందంలో మునిగిన వారి త‌ల్లిదండ్రులు కూడా.. అగ్నికి ఆహుత‌య్యారు. క‌నీసం ఊహ‌కు కూడా అంద‌ని విధంగా జ‌రిగిన ఘోర అగ్నిప్ర‌మాదం 30 మంది వ‌ర‌కు.. చూస్తూ చూస్తూ ఉండ‌గానే కాలి బుగ్గ‌య్యారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతంలోని ప్ర‌ఖ్యాత మాల్‌లో చోటు చేసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు కేరింతలు కొట్టిన చిన్నారు బూడిద కుప్ప‌గా మారారు. వారిని చూస్తూ.. ఆనందంలో ఉన్న త‌ల్లిదండ్రులు కూడా విగ‌త జీవుల‌య్యారు. ఈ ఘోరం దేశం మొత్తాన్నీ క‌దిలించి వేసింది.

ఏం జ‌రిగింది?

గుజ‌రాత్‌లోని గేమ్ జోన్‌.. ఇక్క‌డ చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఆడుకునేందుకు, సేద దీరేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రైవేటు కంపెనీ నిర్వ‌హిస్తున్న గేమ్ జోన్‌. వారాంతం కావ‌డంతో శ‌నివారం సాయంత్రం ఇక్క‌డ‌కు స్థానికుల‌తో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌మ చిన్నారుల‌తో క‌లిసి త‌ర‌లి వ‌చ్చారు. అంద‌రూ ఆనందంగా గ‌డుపుతున్న క్ష‌ణాల్లో ఒక్క‌సారిగా షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగి భ‌గ్గున మంట‌లు రాజుకున్నాయి. దీంతో అంద‌రూ ఉక్కిరి బిక్కిరికి గురై.. త‌ల్ల‌డిల్లిపోయారు. ఇంత‌లోనే మంట‌లు శ‌ర వేగంగా అలుముకోవ‌డం, బ‌య‌ట‌కు వ‌చ్చే మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ మంట‌ల్లో చిక్కుకుని 27 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ సంఖ్య 30కిపైగా ఉంటుంద‌ని స్థానికులు తెలిపారు.

ప్ర‌ధాని దిగ్భ్రాంతి..

త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాల‌ని.. ప్ర‌భుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇక‌, ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్ స్వ‌యంగా అగ్నిప్రమాదం జ‌రిగిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు. రాజ్ కోట్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న ఏపీ అధికారి రాజు భార్గ‌వ్ కూడా .. వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా, గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ఇంత ఘోరం జ‌ర‌గ‌డం ఇది రెండో సారి అని అధికారి తెలిపారు.

Satya

Recent Posts

అనుమానాలు తీర్చేసిన ఆదర్శ కుటుంబం

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…

3 hours ago

హైదరాబాదు రోడ్డుపై స్పందించిన ట్రంప్

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…

4 hours ago

శోకంలోనూ విమర్శలు తప్పలేదు

అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…

4 hours ago

చంద్రబాబు… అసలైన జెన్ జీ..!

ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

4 hours ago

డ్రాగన్ అలా చేస్తే అభిమానులకు పండగే

డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…

5 hours ago

టీడీపీ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు?

అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…

5 hours ago