అప్పటి వరకు ఆడుతూ.. పాడుతూ.. తిరిగిన పసిపిల్లలు.. వారిని చూస్తూ.. ఆనందంలో మునిగిన వారి తల్లిదండ్రులు కూడా.. అగ్నికి ఆహుతయ్యారు. కనీసం ఊహకు కూడా అందని విధంగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం 30 మంది వరకు.. చూస్తూ చూస్తూ ఉండగానే కాలి బుగ్గయ్యారు. ఈ ఘటన గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతంలోని ప్రఖ్యాత మాల్లో చోటు చేసుకుంది. అప్పటి వరకు కేరింతలు కొట్టిన చిన్నారు బూడిద కుప్పగా మారారు. వారిని చూస్తూ.. ఆనందంలో ఉన్న తల్లిదండ్రులు కూడా విగత జీవులయ్యారు. ఈ ఘోరం దేశం మొత్తాన్నీ కదిలించి వేసింది.
ఏం జరిగింది?
గుజరాత్లోని గేమ్ జోన్.. ఇక్కడ చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆడుకునేందుకు, సేద దీరేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తున్న గేమ్ జోన్. వారాంతం కావడంతో శనివారం సాయంత్రం ఇక్కడకు స్థానికులతో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ చిన్నారులతో కలిసి తరలి వచ్చారు. అందరూ ఆనందంగా గడుపుతున్న క్షణాల్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి భగ్గున మంటలు రాజుకున్నాయి. దీంతో అందరూ ఉక్కిరి బిక్కిరికి గురై.. తల్లడిల్లిపోయారు. ఇంతలోనే మంటలు శర వేగంగా అలుముకోవడం, బయటకు వచ్చే మార్గం కనిపించకపోవడంతో ఆ మంటల్లో చిక్కుకుని 27 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ సంఖ్య 30కిపైగా ఉంటుందని స్థానికులు తెలిపారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
తన సొంత రాష్ట్రం గుజరాత్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇక, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వయంగా అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రాజ్ కోట్ పోలీసు కమిషనర్గా పనిచేస్తున్న ఏపీ అధికారి రాజు భార్గవ్ కూడా .. వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. కాగా, గత నాలుగు సంవత్సరాల్లో ఇంత ఘోరం జరగడం ఇది రెండో సారి అని అధికారి తెలిపారు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…