Trends

అయ్యోపాపం: ఆడుతూ.. పాడుతూ.. బుగ్గ‌య్యారు!

అప్ప‌టి వ‌ర‌కు ఆడుతూ.. పాడుతూ.. తిరిగిన ప‌సిపిల్ల‌లు.. వారిని చూస్తూ.. ఆనందంలో మునిగిన వారి త‌ల్లిదండ్రులు కూడా.. అగ్నికి ఆహుత‌య్యారు. క‌నీసం ఊహ‌కు కూడా అంద‌ని విధంగా జ‌రిగిన ఘోర అగ్నిప్ర‌మాదం 30 మంది వ‌ర‌కు.. చూస్తూ చూస్తూ ఉండ‌గానే కాలి బుగ్గ‌య్యారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతంలోని ప్ర‌ఖ్యాత మాల్‌లో చోటు చేసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు కేరింతలు కొట్టిన చిన్నారు బూడిద కుప్ప‌గా మారారు. వారిని చూస్తూ.. ఆనందంలో ఉన్న త‌ల్లిదండ్రులు కూడా విగ‌త జీవుల‌య్యారు. ఈ ఘోరం దేశం మొత్తాన్నీ క‌దిలించి వేసింది.

ఏం జ‌రిగింది?

గుజ‌రాత్‌లోని గేమ్ జోన్‌.. ఇక్క‌డ చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఆడుకునేందుకు, సేద దీరేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రైవేటు కంపెనీ నిర్వ‌హిస్తున్న గేమ్ జోన్‌. వారాంతం కావ‌డంతో శ‌నివారం సాయంత్రం ఇక్క‌డ‌కు స్థానికుల‌తో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌మ చిన్నారుల‌తో క‌లిసి త‌ర‌లి వ‌చ్చారు. అంద‌రూ ఆనందంగా గ‌డుపుతున్న క్ష‌ణాల్లో ఒక్క‌సారిగా షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగి భ‌గ్గున మంట‌లు రాజుకున్నాయి. దీంతో అంద‌రూ ఉక్కిరి బిక్కిరికి గురై.. త‌ల్ల‌డిల్లిపోయారు. ఇంత‌లోనే మంట‌లు శ‌ర వేగంగా అలుముకోవ‌డం, బ‌య‌ట‌కు వ‌చ్చే మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ మంట‌ల్లో చిక్కుకుని 27 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ సంఖ్య 30కిపైగా ఉంటుంద‌ని స్థానికులు తెలిపారు.

ప్ర‌ధాని దిగ్భ్రాంతి..

త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాల‌ని.. ప్ర‌భుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇక‌, ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్ స్వ‌యంగా అగ్నిప్రమాదం జ‌రిగిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు. రాజ్ కోట్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న ఏపీ అధికారి రాజు భార్గ‌వ్ కూడా .. వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా, గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ఇంత ఘోరం జ‌ర‌గ‌డం ఇది రెండో సారి అని అధికారి తెలిపారు.

This post was last modified on May 26, 2024 12:41 pm

Share

Recent Posts

రీల్స్ కోసం రెండు చేతులు పోగొట్టుకుంది

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్‌లో రీల్ తీసుకునేందుకు…

1 hour ago

లోకేష్ కనకరాజ్‌కు ఇది తగునా?

మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…

2 hours ago

ఇరుముడి సినిమానే కావాలని గ్రామస్థుల ధర్నా

సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్…

2 hours ago

సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఆరేళ్ల బీహార్ బుడతడు

బిహార్‌ యువత హక్కుల కోసం గొంతెత్తిన ఆరేళ్ల బాలుడు ఆదిత్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. విద్యార్థుల ఉద్యోగాలు,…

2 hours ago

క్రేజీగా మారుతున్న టాలీవుడ్ డిసెంబర్

అందరూ సంక్రాంతి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే డిసెంబర్ కూడా క్రేజీ సినిమాలతో పీక్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేలా ఉంది.…

2 hours ago

సెంచరీ దాటేసినా ఇరుముడి తగ్గట్లేదు

టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా…

4 hours ago