ఆరు నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియో శుక్రవారం పలు వాట్సాప్ గ్రూపుల్లో భారీగా షేర్ అయ్యింది. అందులో పొద్దుపొద్దున్నే వాకింగ్ చేసే రహదారి మీద ఒక మహిళ.. ఒక యువకుడు ఇద్దరూ బీర్ బాటిళ్లతో రచ్చ చేయటం.. ఆ దారి వెంట వెళ్లే వాకర్స్ కు ఇబ్బందికరంగా వ్యవహరించిన వైనం పెనుసంచలనంగా మారింది. మద్యం మత్తులో సీనియర్ సిటిజన్లు అని కూడా చూడకుండా రచ్చ చేసిన వారిద్దరిని నాగోలు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ గ్రూపుల్లోనూ పెద్ద చర్చకు తెర తీసిన ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాగా చదువుకున్న వారే అయినప్పటికీ.. సంస్కారం అన్నది లేకుండా.. నిబంధనలకు విరుద్దంగా బహిరంగంగా తాగటం ఒక ఎత్తు అయితే.. అక్కడి వారితో వాదనకు దిగటం.. ఇబ్బందికరంగా వ్యవహరిస్తూ రచ్చ చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నాగోల్ లోని ఫతుల్లాగూడ ప్రాంతంలో పొద్దుపొద్దునే రోడ్డు మధ్యలో కారు ఆపేసిన ఒక యువకుడు.. యువతి బీర్ తాగుతున్నారు.
ఉదయం వేళ కావటంతో ఆ రోడ్డు మీద వాకింగ్ చేసే సీనియర్ సిటిజన్లు వీరి తీరుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం సరికాదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వినని సదరు మహిళ.. అక్కడి వారితో వాదనలకు దిగారు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయగా.. వారిపై దుర్భాషలాడారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి వెళ్లిపోయారు.
మద్యం సేవించటం ఒక ఎత్తు.. తమ తీరుతో ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేయటం మరో ఎత్తు.. అక్కడి సీనియర్ సిటిజన్స్ తో రచ్చకు దిగి.. అతి వేగంతో కారును డ్రైవ్ చేసి అందరిని భయపెట్టేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. వీరిద్దరి మీదా నాగోల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి వేళలో వీరిని గుర్తించి.. అరెస్టు చేశారు. మొత్తంగా వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…