ఎందరో తెలుగు వారు.. విదేశాల్లో తమ కీర్తిని చాటుతూ.. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో మంది తెలుగు వారు కీలక స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవాడకు చెందిన మహిళ జయ బాడిగ.. అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జయ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.
శాక్రమెంటో సుపీరియర్ కోర్టుకు జయ బాడిగ నియమితులయ్యారు. ఆమె 2022 నుండి కోర్టు కమిషనర్గా పనిచేస్తున్నారు. అమెరికాలో కీలకమైన కుటుంబ వ్యవహారాల చట్టంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకున్నారు. న్యాయ వ్యవస్థలో కీలకమైన విషయాల్లో ఆమె చాలా మందికి మార్గదర్శకురాలుగా నిలవడం గమనార్హం. జడ్జి జయ బాడిగ ఏపీలోని విజయవాడలో జన్మించారు. ప్రాథమిక విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. జయ 1991 నుండి 1994 వరకు ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాద్లో సైకాలజీ, పొలిటికల్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు.
ఆమె 2018 నుండి 2022 వరకు ప్రాక్టీషనర్ గా పనిచేశారు. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్లో, కాలిఫోర్నియా గవర్నర్స్ ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో అటార్నీగా పనిచేశారు. శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుండి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సాధించారు. కాగా, కాలిఫోర్నియా కోర్టు న్యాయమూర్తి రాబర్ట్ లాఫామ్ పదవీ విరమణతో ఆ పదవి జయ బాడిగను వరించడం విశేషం.
ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…