రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ వేశం వేసి రంగంలోకి దించుతాడు. అల్లరిమూకలు చుట్టూ ఉన్నది తమ వారు అనుకొని విధ్వంసానికి సిద్దం అవగానే రౌడీల డ్రస్సులో ఉన్న పోలీసులు తమ పైన ధరించిన డ్రస్సులను చించివేసి పోలీసు డ్రస్సులతో రౌడీ మూకలను చితకబాది వారి ప్రణాళికను భగ్నం చేస్తారు.
ఒంగోలులో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ కూడలిలో అల్లరిమూకలు ఒక్కసారిగా బస్టాండ్ సెంటర్లోకి దూసుకొచ్చారు. కౌంటింగ్లో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని అల్లరి మూకలను కట్టడి చేసేందుకు తొలుత హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేశారు. ఈ సందర్బంగా పోలీసులపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు కూడా విసిరారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అనంతరం వాటర్ క్యానన్లతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్లో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. గాయాలపాలైన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో 20 నిమిషాలపాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.
ఒంగోలు పోలీసులు అమలు చేసిన టచ్ చేసి చూడు సినిమా ప్లాన్ ను పోలీసులు అమలుచేశారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు, రేపు జూన్ 4 ఫలితాల తర్వాత అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు పోలీసులు ఆడిన ఈ నాటకం స్థానికులలో ఉత్కంఠ రేపింది.
కౌంటిగ్ రోజున ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకునే యాక్షన్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ప్రకాశంజిల్లా ఎస్పి గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో, ఆ తరువాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనలకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించడం గమనార్హం.
This post was last modified on May 20, 2024 6:53 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…