ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం బ్యాంకులకు చెందుతుందని ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగా దానిపై అతను హైకోర్టును ఆశ్రయించినట్లు నిన్న వార్తలు రావడం తెలిసిందే. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది.
2003లో కొన్న ఆ స్థలాన్ని జూనియర్ 2013లోనే విక్రయించాడని, ఆ స్థలంతో, ఆ వివాదంతో ఎన్టీఆర్ కు సంబంధం లేదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే మహిళ నుండి కొనుగోలు చేశాడని, అందులో నిర్మాణం చేపట్టాడని, ఆమె స్థలం జూనియర్ ఎన్టీఆర్ కు ఆ స్థలం అమ్మడానికి ముందే 1996లో తమ వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి . తాజాగా జూనియర్ టీమ్ ప్రకటనతో అది అంతా ట్రాష్ అని తేలిపోయింది.
This post was last modified on May 18, 2024 9:57 am
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…