ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం బ్యాంకులకు చెందుతుందని ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగా దానిపై అతను హైకోర్టును ఆశ్రయించినట్లు నిన్న వార్తలు రావడం తెలిసిందే. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది.
2003లో కొన్న ఆ స్థలాన్ని జూనియర్ 2013లోనే విక్రయించాడని, ఆ స్థలంతో, ఆ వివాదంతో ఎన్టీఆర్ కు సంబంధం లేదని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే మహిళ నుండి కొనుగోలు చేశాడని, అందులో నిర్మాణం చేపట్టాడని, ఆమె స్థలం జూనియర్ ఎన్టీఆర్ కు ఆ స్థలం అమ్మడానికి ముందే 1996లో తమ వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి . తాజాగా జూనియర్ టీమ్ ప్రకటనతో అది అంతా ట్రాష్ అని తేలిపోయింది.
This post was last modified on May 18, 2024 9:57 am
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…