అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న వారి కలలు నిండకుండానే వారికి నూరేళ్లూ నిండిపోయాయి. అరిజోనా యూనివర్సిటీ నుంచి ఇటీవలే ఎంఎస్ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేశ్రెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) అనే విద్యార్థులు జలపాతంలో ప్రాణాలు కోల్పోయారు.
ఉన్నత చదువులు పూర్తయిన సందర్భంగా రాకేశ్ రెడ్డి, రోహిత్ లతో సహా మొత్తం 16 మంది స్నేహితులు ఆరిజోనాలోని ఫాజిల్ క్రీక్ జలపాతానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ రాకేశ్, రోహిత్లు జలపాతంలో మునిగిపోయారు. ఒక రోజు అనంతరం 25 అడుగుల లోతున వారిద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు గుర్తించారు.
ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన చంద్రశేఖర్రెడ్డి, పద్మ దంపతులకు రాకేశ్ రెడ్డి ఏకైక కుమారుడు అని సమాచారం. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. కుమారుడు పట్టా తీసుకుంటున్న సంతోషకర క్షణాలను పంచుకునేందుకు తల్లిదండ్రులు కూడా అమెరికా వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తూ వారు అక్కడ ఉండగానే అతడు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నారు. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన రోహిత్ మణికంఠకు వివరాలు అందాల్సి ఉంది. చికాగోలో 25 ఏళ్ల తెలుగు విద్యార్థి రూపేశ్ చంద్ర అదృశ్యం ఘటన మరవక ముందే ఈ వార్త వినాల్సి రావడం అందరినీ కలిచివేస్తున్నది.
This post was last modified on May 12, 2024 9:40 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…