దేశవ్యాప్తంగా సివిల్స్ ఫలితాలలో 1016 మంది విజయం సాధించారు. ఇందులో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. ఇందులో తెలుగమ్మాయి అనన్యరెడ్డి 22 ఏళ్ల మొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఇక వెయ్యిలోపు 30 మంది తెలుగువారు సివిల్స్ లో విజయం సాధించారు.
అయితే జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన కేరళకు చెందిన సిద్దార్థ్ రామ్ కుమార్ తన కుటుంబసభ్యులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. గతేడాది సివిల్స్ లో 121వ ర్యాంకు సాధించి ఐపీఎస్ కు ఎంపికై హైదరాబాద్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో మరోసారి సివిల్స్ రాశాడు. అయితే ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
తాజా ఫలితాలలో సిద్దార్థ నాలుగో ర్యాంక్ సాధించిన విషయం టీవీల ద్వారా తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అతను మరోసారి సివిల్స్ రాస్తున్నట్లు మాకెవరికీ చెప్పలేదని, టీవీల ద్వారా విషయం తెలుసుకుని సంతోషపడ్డామని, ఐఏఎస్ కావాలన్న సిద్దార్థ్ కలనెరవేర్చుకున్నందుకు ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు చెప్పారు. చదువుతో పాటు ఆటలలో కూడా చిన్నప్పటి నుండి సిద్దార్థ్ చురుగ్గా ఉండేవాడని, స్కూల్ టీంకు కెప్టెన్ గా వ్యవహరించాడని వారు వెల్లడించారు. అయితే ఐఏఎస్ గా ఎంపికయ్యే వరకు అమ్మానాన్నలకు తెలియకుండా ఆశ్చర్యపరచడం విశేషమే.
This post was last modified on April 17, 2024 10:35 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…